PM Modi and President of France jointly visit ITER facility

February 12th, 05:32 pm

PM Modi and President Emmanuel Macron visited the ITER facility in Cadarache, the first such visit by any Head of State or Government. They praised ITER’s progress in fusion energy and India’s key contributions through scientists and industries like L&T, Inox India, and TCS, highlighting India's commitment to advancing global clean energy research.

PM Modi and President of France jointly inaugurate the Consulate General of India in Marseille

February 12th, 05:29 pm

PM Modi and President Emmanuel Macron inaugurated the Consulate General of India in Marseille. The new Consulate will boost economic, cultural, and people-to-people connections across four French regions. PM Modi deeply appreciated President Macron’s special gesture, as both leaders received a warm welcome from the Indian diaspora.

మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు

February 12th, 04:57 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ఉదయం మాసే లోని మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించి మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో అసువులు బాసిన భారత వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. యుద్ధవీరుల త్యాగాలకు నివాళిగా ఇరువురు నేతలూ పుష్ప గుచ్ఛాలను ఉంచారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

February 12th, 03:24 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్ష విమానంలో పారిస్ నుంచి మార్సిలే వరకు మంగళవారం కలిసి ప్రయాణించారు. ఇద్దరు నాయకుల మధ్య సాన్నిహిత్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు, కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై వారు పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం మార్సిలే చేరుకున్న తర్వాత ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. గత 25 సంవత్సరాలుగా బహుముఖంగా, స్థిరంగా అభివృద్ధి చెందుతున్న భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల బలమైన నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు.

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా భార‌త్‌-ఫ్రాన్స్‌ సంయుక్త ప్రకటన

February 12th, 03:22 pm

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10-12 తేదీల్లో ఫ్రాన్స్‌ను సందర్శించారు. ఈ రెండు రోజుల్లో అక్కడ నిర్వహించిన కృత్రిమ మేధ (ఎఐ) కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు రెండు దేశాలూ సంయుక్తంగా అధ్యక్షత వహించాయి. బ్లెచ్లీ పార్క్ (2023 నవంబర్), సియోల్ (2024 మే) శిఖరాగ్ర సదస్సులు తీర్మానించిన మేరకు సాధించిన కీలక విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై ఈ సదస్సు చర్చించింది. ఇందులో వివిధ దేశాల-ప్రభుత్వాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతోపాటు చిన్న-పెద్ద వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు సహా కళాకారులు-పౌర సమాజ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉపయోగకర సామాజిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో సత్ఫలితాల సాధనకు అంతర్జాతీయ కృత్రిమ మేధ రంగం సారథ్యం వహించేలా నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి అంకిత భావంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సును విజయవంతంగా నిర్వహించారంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. తదుపరి శిఖరాగ్ర సదస్సును భారత్‌ నిర్వహించనుండటంపై ఫ్రాన్స్ హర్షం వ్యక్తం చేసింది.

ప్రధాని... ఫ్రాన్స్ పర్యటన ఫలితాలు

February 12th, 03:20 pm

భారత్, ఫ్రాన్స్ కృత్రిమ మేధ డిక్లరేషన్

కృత్రిమ మేధలో భారత్ గొప్ప ప్రగతిని సాధిస్తూ నూతన సాంకేతికతను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తోంది: ప్రధానమంత్రి

February 12th, 02:02 pm

గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ శ్రీ సుందర్ పిచెయ్ తో సమావేశం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పై శ్రీ పిచెయ్ చేసిన పోస్టుకు ఇలా స్పందించారు:

పారిస్ లో భారత్-ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని ప్రసంగం

February 12th, 12:45 am

‘సృజన, సహకారం, అభ్యున్నతి’ని మంత్రప్రదంగా భావించి మీరు ముందుకు సాగుతుండడాన్ని నేను గమనించాను. మీరు కేవలం ఉన్నతాధికారుల మధ్య వారధులు మాత్రమే కాదు.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీరు బలోపేతం చేస్తున్నారు.

భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 12th, 12:25 am

ఈ రోజు ప్యారిస్‌లో నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్‌...ప్రసంగించారు. ఈ ఫోరమ్ ఇరు పక్షాలకు చెందిన వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓల)ను ఒక చోటుకు చేర్చింది. ఇది రక్షణ, ఏరోస్పేస్, కీలక టెక్నాలజీలు-కొత్తగా ఉనికిలోకి వస్తున్న టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, కృత్రిమ మేధ, వైద్య ఆరోగ్య శాస్త్రాలు, జీవనశైలిలతోపాటు ఆహారం, ఆతిథ్య రంగాలపై దృష్టిని కేంద్రీకరించింది.

పారిస్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌తో ప్రధాని మోదీ చర్చలు

February 12th, 12:19 am

పారిస్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మరియు ఆయన కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వారు వివిధ అంశాలపై అద్భుతమైన సంభాషణ జరిపారు.

ఎస్తోనియా అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

February 11th, 06:19 pm

భారత్, ఎస్తోనియా ల మధ్య నెలకొన్న స్నేహపూర్వక సంబంధాలు ప్రజాస్వామ్యం, న్యాయపాలన, స్వాతంత్య్రం, సామ్యవాదం వంటి ఆదర్శాల ప్రాతిపదికగా ఏర్పడిందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఐటీ, డిజిటల్, సాంస్కృతిక సంబంధాలు, పర్యాటకం, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు సహా ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందడం పట్ల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సైబర్ భద్రత అంశంలో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారాన్ని గురించి నేతలు చర్చించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఎస్తోనియా ప్రభుత్వాన్నీ కంపెనీలనూ శ్రీ మోదీ ఆహ్వానించారు.

ప్యారిస్ ‘ఏఐ ఏక్షన్ సమిట్’ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం

February 11th, 05:35 pm

నేటి చర్చల వల్ల ఒక విషయం తేటతెల్లమయ్యింది – సమావేశాల్లో పాల్గొన్నభాగస్వాములందరూ ఒకే ఆశయాన్ని, ఒకే లక్ష్యాన్నీ కలిగి ఉన్నారు.

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

February 11th, 03:15 pm

మీ వైద్య సంబంధ రిపోర్టును కృత్రిమ మేధ (ఏఐ)తో నడిచే యాప్ లో మీరు అప్లోడ్ చేస్తే.. సులభంగా అర్థమయ్యే భాషలో, ఎలాంటి వృత్తిపరమైన ప్రామాణిక పదజాలమూ లేకుండా మీ ఆరోగ్య సమాచారాన్ని అది వివరించగలదు. కానీ, మీరు అదే యాప్‌ ను ఎడమ చేతితో రాసే వ్యక్తి చిత్రాన్ని గీయమని అడిగితే, అది చాలావరకు కుడి చేతితో రాసే వారి చిత్రాన్నే గీస్తుంది. ఎందుకంటే ట్రైనింగ్ డేటాలో ఎక్కువ భాగం అదే ఉంటుంది.

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత ఏఐ ఈ శతాబ్దపు మానవీయతను రచిస్తోంది: ప్రధానమంత్రి

February 11th, 03:00 pm

పారిస్ లో జరిగిన కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత వహించారు. వారం పాటు సాగిన సదస్సు ఈనెల 6-7 తేదీల్లో సైన్స్ దినోత్సవాలతో ప్రారంభమైంది. తర్వాతి రెండు రోజులు సాంస్కృతిక వారాంతపు కార్యక్రమాలు నిర్వహించారు. ఉన్నత స్థాయి ముగింపు కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖులు, విధాన నిర్ణేతలు, నిపుణులు హాజరయ్యారు.

ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

February 10th, 10:30 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పారిస్‌కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చర్చలు జరుపుతారు, ఏఐ యాక్షన్ సమ్మిట్ మరియు అనేక ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు.

పారిస్ లో సి ఇ ఒ ల ఫోరం లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం

July 15th, 07:03 am

భారత ప్రధాన మంత్రి శ్రీ న రేంద్ర మోదీ, రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా 2023 జూలై 14న పారిస్ లోని క్వాయ్ డి ఓర్సేలో ప్రముఖ భారత , ఫ్రెంచ్ సి ఇ ఒ ల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

India & France have long-standing people-to-people contacts: PM Modi during press meet with President Macron

July 15th, 01:47 am

Prime Minister Narendra Modi at press meet with President Macron of France.

రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాన మంత్రి సమావేశం

July 15th, 01:42 am

రక్షణ, భద్రత, పౌర అణు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు సహా ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.

భారత-ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ రోడ్ మ్యాప్

July 14th, 11:10 pm

భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మకంగా నిలిచిన శక్తులు కావడంతో పాటు భారత పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామ్యం గల దేశాలు. హిందూ మహాసముద్రంలో భారత-ఫ్రెంచి భాగస్వామ్యం ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన అంశం. ‘‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత-ఫ్రాన్స్ వ్యూహాత్మక సహకార విజన్’’పై 2018 సంవత్సరంలో ఉభయ దేశాలు ఒక అంగీకారం కుదుర్చుకున్నాయి. మనం ఇప్పుడు దాన్ని పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి ప్రయత్నాలకు విస్తరించాయి.

ఒకసారి వాడకపు ప్లాస్టిక్‌ నిషేధంపై ఫ్రాన్స్‌-భారత్ దృఢ సంకల్పం

July 14th, 11:00 pm

ఒకసారి వాడకపు ప్లాస్టిక్‌ ఉత్పత్తుల కాలుష్య నిర్మూలన దిశగా ఫ్రాన్స్‌-భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నాయి. ఈ మేరకు స్వల్ప ప్రయోజనం, అధిక చెత్తకు దారితీసే ఒకసారి వాడకపు ప్లాస్టిక్ ఉత్పత్తులపై రెండు దేశాల్లోనూ నిషేధం విధించబడింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు విపరీతంగా పోగుపడటంతోపాటు వాటి అపసవ్య నిర్వహణ ప్రపంచ పర్యావరణానికి ముప్పుగా మారింది. అందువల్ల ఈ సమస్యను తక్షణం పరిష్కరించాల్సి ఉంది. ఇది సాధారణంగా పర్యావరణ వ్యవస్థలపైనా, ప్రత్యేకించి సముద్ర పర్యావరణ వ్యవస్థల మీద విపరీత ప్రతికూల ప్రభావం చూపుతుంది. (80 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలకు భూమే మూలం… ఎలాగంటే- 1950 నుంచి 9.2 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి కాగా, ఇందులో 7 బిలియన్ టన్నుల వ్యర్థాలు ఏర్పడ్డాయి. ఏటా 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. దీనిలో మూడింట ఒక వంతు ఒకసారి వాడకం కోసమే కాగా, దాదాపు 10 మిలియన్ టన్నుల మేర సముద్రంలో వేయబడుతోంది).