ప్రపంచ హోలోకాస్ట్ స్మారక కేంద్రం - యాద్ వషేమ్ ను సందర్శించిన ప్రధానమంత్రి

February 26th, 09:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెన్జమిన్ నెతన్యాహుతో కలిసి ప్రపంచ హోలోకాస్ట్ స్మారక కేంద్రం - యాద్ వషేమ్ - ను సందర్శించి, హోలోకాస్ట్ బాధితులకు నివాళులర్పించారు. అక్కడి స్మృతి మందిరంలో జరిగిన ఒక నివాళి కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అక్కడ కాంటర్ ఆలపించిన 'ఎల్ మలే రహిమీమ్’ అనే హృదయవిదారకమైన ప్రార్థన గీతంతో ఈ కార్యక్రమం సాగింది. అనంతరం, ప్రధానమంత్రి ‘బుక్ ఆఫ్ నేమ్స్ హాల్‘ ను సందర్శించారు. ఇక్కడ హోలోకాస్ట్ బాధితుల వ్యక్తిగత గాథలను ప్రదర్శించారు.

ఇజ్రాయెల్ అధ్యక్షునితో భారత ప్రధానమంత్రి సమావేశం

February 26th, 09:00 pm

2017లో తాను ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు, అలాగే 2023లో దుబాయ్‌లో సమావేశాల సందర్భంగా అధ్యక్షుడు హెర్జోగ్‌తో జరిపిన భేటీలను శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భారత్ - ఇజ్రాయెల్ సంబంధాలను శాంతి, ఆవిష్కరణ, అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం అనేది ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త ఆరంభమని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన నమ్మకానికి, పంచుకున్న ప్రజాస్వామ్య విలువలకు, విశిష్టమైన స్నేహానికి నిదర్శనమని వారు అభివర్ణించారు. వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, సంస్థలు, రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటి రంగాలలో ప్రస్తుతం కొనసాగుతున్న సహకారం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ప్రధానమంత్రి భేటీ

February 26th, 08:56 pm

భారత్ - ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలపై వారు సమగ్రమైన చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని, స్నేహాన్ని ప్రతిబింబిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను శాంతి, ఆవిష్కరణ, అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ స్థాయి పెంపు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర ప్రయోజనాల కలయికకు, సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం ఇరు దేశాలకున్న ఉమ్మడి దార్శనికతకు చిహ్నంగా నిలుస్తుంది.

భారత్‌-ఇజ్రాయెల్‌ సంయుక్త ప్రకటన

February 26th, 07:44 pm

భారత్‌-ఇజ్రాయెల్ దేశాల మధ్యగల సాన్నిహిత్యం, సద్భావన, ప్రగాఢ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆయనతో పాటు సీనియర్ మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. ఈ సందర్భంగా 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ చారిత్రక పర్యటనను, 2018లో ప్రధానమంత్రి నెతన్యాహు భారత పర్యటనను వారిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఈ పర్యటనలతో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారంలో నవశకం ప్రారంభమైంది. తద్వారా అత్యాధునిక సాంకేతికతలు, సైబర్ భద్రత, వ్యవసాయం, జల నిర్వహణ, ఆరోగ్యం, వ్యవస్థాపన, రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక బంధం విశేషంగా పురోగమించడంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని “శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు దిశగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించేందుకు ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఫలితాలు

February 26th, 07:41 pm

భూభౌతిక అన్వేషణ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో భారత ప్రధాని చేసిన ప్రకటన

February 26th, 03:30 pm

తొమ్మిదేళ్ల క్రితం, ఇజ్రాయెల్‌ను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా నిలిచే గౌరవం నాకు దక్కింది. ఈ చారిత్రక ఇజ్రాయెల్ గడ్డపై మరోసారి అడుగు పెట్టడం నాకు గర్వకారణం. ఇంకా అత్యంత భావోద్వేగపూరితమైన క్షణంగా అనిపిస్తోంది.

జెరూసలెంలో సాంకేతిక ప్రదర్శనను చూసిన ప్రధానమంత్రి

February 26th, 10:37 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్‌లో ఒక ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహూ ఉన్నారు. వివిధ రంగాల్లో ఇజ్రాయెల్ మార్గదర్శక నవకల్పనలను ఈ ఎగ్జిబిషన్లో కళ్లకు కట్టారు. వ్యవసాయ సంబంధిత సాంకేతికత, జల సాంకేతికత, వాతావరణ సాంకేతికత, ఆరోగ్య రంగ సాంకేతికత, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, క్వాంటమ్ సాంకేతిక రంగాలకు చెందిన అగ్రగామి కంపెనీలూ, పరిశోధన సంస్థలూ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి.

నెసెట్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

February 25th, 08:20 pm

ఈ విశిష్ట సభ ముందు నిలబడటం నాకు దక్కిన గౌరవం, అదృష్టం. భారత ప్రధానమంత్రిగా, ఒక ప్రాచీన నాగరికత ప్రతినిధిగా మరో నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. నా వెంట 1.4 బిలియన్ల మంది భారతీయులు అందించిన శుభాకాంక్షలను, స్నేహ సందేశాన్ని, గౌరవాన్ని, భాగస్వామ్యాన్ని తీసుకువచ్చాను.

ఇజ్రాయెల్ పార్లమెంట్ - నెసెట్ ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 25th, 08:00 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు జెరూసలేంలోని నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ప్రత్యేక ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు.

ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు చేరుకున్నారు

February 25th, 04:43 pm

ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి 2026 ఫిబ్రవరి 25-26 వరకు ఇజ్రాయెల్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఆయనకు ప్రధాని నెతన్యాహు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు మరియు విమానాశ్రయంలో సంప్రదాయ స్వాగతం పలికారు.

ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన

February 25th, 08:28 am

నా మిత్రుడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ ఆహ్వానం మేరకు ఆ దేశంలో 2026 ఫిబ్రవరి 25, 26 తేదీల్లో అధికారికంగా పర్యటిస్తాను.

సోషల్ మీడియా కార్నర్ 6 జూలై 2017

July 06th, 09:00 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

సిఈఓల ఫోరమ్ మొదటి సమావేశంలో సహ అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ, ఇస్రాయెలీ ప్రధాని నెతాన్యహు

July 06th, 07:30 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు టెల్ అవీవ్లో సిఈఓల ఫోరమ్ మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు. వ్యాపార సమావేశాల్లో ఉపన్యసిస్తూ, ప్రధాని మోదీ భారతదేశ-ఇజ్రాయెల్ భాగస్వామ్యంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైనట్లు పేర్కొన్నారు, ఇది రెండు దేశాల ప్రజల జీవితాల మెరుగుదలకు అవకాశాలను కల్పించింది.

ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు ఇండియా ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్

July 06th, 07:12 pm

ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు టెల్ అవీవ్లో టెక్నోలైజీ ప్రదర్శనకు హాజరయ్యారు. యువ నాయకులను ప్రోత్సహించటానికి మరియు మెరుగైన ప్రపంచానికి ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు భారత-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్ను నాయకులు ప్రారంభించారు.

మొబైల్ సముద్రపు నీటి డీశాలినేషన్ యూనిట్ ను సందర్శించిన ప్రధాని మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు

July 06th, 02:36 pm

మొబైల్ సముద్రపు నీటి డీశాలినేషన్ యూనిట్ ను ప్రధాని మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు సందర్శించారు. గాల్-మొబైల్ అనేది స్వతంత్రమైన, ఇంటిగ్రేటెడ్ నీటి శుద్దీకరణ వాహనం, ఇది అధిక నాణ్యత గల త్రాగునీటిని ఉత్పత్తి చేయడానికి రూపొందించబడింది. వరదలు, భూకంపాలు, కఠినమైన భూభాగాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో నీటి వినియోగం వంటివి ప్రకృతి వైపరీత్యాలలో ఇది ఉపయోగపడుతుంది. సముద్రపు నీటి రోజుకు 20,000 లీటర్ల వరకు మరియు రోజుకు 80,000 లీటర్ల ఉప్పునీటి / మడ్డీ లేదా కలుషితమైన నదీ జలాలను శుద్ధి చేసి దానిని WHO ప్రమాణాలకు తీసుకురావచ్చు.

హైఫాలోని భారతీయ యుద్ధ స్మశానంను సందర్శించిన ప్రధానమంత్రి మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు

July 06th, 02:00 pm

హైఫాలోని భారతీయ యుద్ధ స్మశానంను ప్రధానమంత్రి మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు సందర్శించారు. జెరూసలన్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రపంచ యుద్ధం సమయంలో తమ ప్రాణాలను అర్పించిన భారతీయ సైనికులకు నాయకులు నివాళులర్పించారు. వారు మేజర్ దల్పాత్ సింగ్ జ్ఞాపకార్థం ఒక ఫలకం ఆవిష్కరించారు.

List of MoUs/Agreements signed during the visit of Prime Minister to Israel (July 5, 2017)

July 05th, 11:52 pm

List of MoUs/Agreements signed during the visit of Prime Minister to Israel (July 5, 2017)

India-Israel Joint Statement during the visit of Prime Minister to Israel (July 5, 2017)

July 05th, 11:52 pm

Marking the 25th anniversary of the establishment of diplomatic relations between the two countries, Prime Minister Narendra Modi of India visited Israel from 4-6 July 2017 at the invitation of Prime Minister Benjamin Netanyahu of Israel. This historic first-ever visit by an Indian Prime Minister to Israel solidified the enduring friendship between their peoples and raised the bilateral relationship to that of a strategic partnership.

ఇజ్రాయెల్తో మన సంబంధాలు పరస్పర విశ్వాసం మరియు స్నేహం కలిగి ఉన్నాయి: ప్రధాని మోదీ

July 05th, 10:38 pm

నరేంద్ర మోదీ టెల్ అవీవ్లో కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దాని అభివృద్ధి ప్రయాణంలో ప్రశంసిస్తూ, ప్రధానమంత్రి మోదీ, ఇజ్రాయెల్ పరిమాణం కంటే పెద్దది, ఇది ముఖ్యమైనది ఆత్మ. వివిధ రంగాలలో తమ సహకారంతో జ్యూయిష్ కమ్యూనిటీ భారత్ను సమృద్ధిగా చేసింది. అన్నారు. మోదీ, తనకందించిన ఆతిథ్యం కోసం ప్రధాని నెతాన్యహు మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

PM Modi and Israeli PM Netanyahu meet young Moshe

July 05th, 10:12 pm

Prime Minister Modi and Israeli PM Netanyahu met young Moshe, the boy who survived the 26/11 Mumbai terror attack. Shri Modi also met young Moshe's maternal and paternal grandparents and Ms. Sandra Solomon, his nanny.