'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.
May 31st, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.భారతదేశం యొక్క టీకా కార్యక్రమం ప్రపంచానికి ఒక కేస్ స్టడీ కావచ్చు: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 27th, 11:30 am
మన్ కి బాత్ సందర్భంగా, రాబోయే టోక్యో ఒలింపిక్స్తో సహా పలు అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు, దివంగత మిల్కా సింగ్ మరియు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. కొనసాగుతున్న టీకాల ప్రచారంపై ప్రధాని మోదీ వెలుగు చూశారు మరియు ఇది ప్రపంచానికి కేస్ స్టడీ కావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడిన ఆయన ఎటువంటి పుకార్లకు బలైపోవద్దని, వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత, అమృత్ మహోత్సవ్ మరియు మరెన్నో గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు.ప్రముఖ అథ్లెట్ శ్రీ మిల్కాసింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
June 19th, 08:45 am
ప్రముఖ అథ్లెట్ శ్రీ మిల్కాసింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీ మిల్కాసింగ్ ను గొప్ప క్రీడాకారుడిగా అభివర్ణించిన ప్రధానమంత్రి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసి భారత ప్రజల హృదయాలలో ఆయన సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు.