భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 03rd, 12:00 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 11:30 am
న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్లో ఇవాళ ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.నేపాల్లో జరిగిన 2566వ బుద్ధ జయంతి మరియు లుంబినీ దినోత్సవం 2022 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
May 16th, 09:45 pm
గతంలో కూడా, వైశాఖ పూర్ణిమ రోజున, భగవాన్ బుద్ధునికి సంబంధించిన దివ్య స్థలాలను, ఆయనతో సంబంధం ఉన్న కార్యక్రమాల కోసం సందర్శించే అవకాశాలు నాకు లభిస్తున్నాయి. మరియు ఈ రోజు, భారతదేశానికి స్నేహితుడైన నేపాల్లోని బుద్ధ భగవానుడి పవిత్ర జన్మస్థలమైన లుంబినీని సందర్శించే అవకాశం నాకు లభించింది. కొంతకాలం క్రితం మాయాదేవి ఆలయాన్ని సందర్శించే అవకాశం కూడా నాకు మరచిపోలేనిది. బుద్ధ భగవానుడు జన్మించిన ప్రదేశం, అక్కడి శక్తి, చైతన్యం, అది భిన్నమైన అనుభూతి. 2014లో ఈ స్థలంలో నేను సమర్పించిన మహాబోధి వృక్షం యొక్క మొక్క ఇప్పుడు చెట్టుగా అభివృద్ధి చెందడం చూసి నేను కూడా సంతోషిస్తున్నాను.నేపాల్లోని లుంబినిలో బుద్ధజయంతి వేడుకలు
May 16th, 03:11 pm
నేపాల్లోని లుంబినీలోగల అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన సతీమణి డాక్టర్ అర్జు రానా దేవ్బా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నేపాల్లోని లుంబినీలో మాయాదేవి ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
May 16th, 11:59 am
నేపాల్లో ఒకరోజు పర్యటనలో భాగంగా 2022 మే 16న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందుగా అక్కడి లుంబినీలోగల మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. గౌరవనీయులైన నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్బా, ఆయన సతీమణి డాక్టర్ అర్జు రానా దేవ్బా కూడా ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధుని కచ్చితమైన జన్మస్థలాన్ని సూచించే ఆలయ ప్రాంగణంలోని శిలవద్ద దేశాధినేతలిద్దరూ నివాళి అర్పించారు. అటుపైన బౌద్ధ సంప్రదాయాల ప్రకారం నిర్వహించిన పూజా కార్యక్రమాలకూ వారు హాజరయ్యారు.