అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో రేపు (22 సెప్టెంబర్) ప్రధానమంత్రి పర్యటన
September 21st, 09:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , త్రిపుర రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో 5,100 కోట్ల రూపాయల పైగా విలువైన అనేక అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. బహిరంగసభలో ప్రసంగిస్తారు.