అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద్ సింగ్, మాతా సాహిబ్ కౌర్‌ల ‘జోరే సాహిబ్’

September 19th, 04:28 pm

సిక్కు ప్రతినిధుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద సింగ్, మాతా సాహిబ్ కౌర్‌ల ‘జోరే సాహిబ్’ సంరక్షణ, ప్రదర్శనపై ప్రతినిధులు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ‘జోర్ సాహిబ్’ వంటి పవిత్ర స్మృతి చిహ్నాలు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవనీ, విశేషమైన సిక్కు చరిత్రలో ఒక భాగమనీ, దేశ సంస్కృతికి మూలాలనీ పేర్కొన్నారు. ‘‘శ్రీ గురు గోవింద్ సింగ్ చూపిన ధైర్యం, ధర్మం, న్యాయం, సామాజిక సామరస్య మార్గాన్ని అనుసరించేలా భవిష్యత్ తరాలకు పవిత్రమైన ఈ స్మృతి చిహ్నాలు స్ఫూర్తినిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.