ప్రధాన మంత్రితో ఉస్తాద్ అమ్ జద్ అలీ ఖాన్ భేటీ

June 13th, 12:47 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని సరోద్ వాదన నిపుణుడు ఉస్తాద్ శ్రీ అమ్ జద్ అలీ ఖాన్ ఈ రోజు కలుసుకున్నారు. భారతదేశ శాస్త్రీయ సంగీత రంగంలో మహా విద్వాంసులైనటువంటి 20 మంది జీవితం గురించి, వారికి సంబంధించిన విశేషాలను గురించి సీనియర్ సంగీతకారుడు మరియు సరోద్ మేస్ట్రో శ్రీ అమ్ జద్ అలీ ఖాన్ తాను రచించిన గ్రంథం ‘మాస్టర్ ఆన్ మాస్టర్స్’ ను ప్రధాన మంత్రికి అందజేశారు.