బీహార్‌లోని నలందలో ప్రమాదం.. ప్రాణనష్టంపై పీఎం సంతాపం పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

March 26th, 11:19 am

బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.