ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 22nd, 01:30 pm
బాబా ఔఘర్నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్ జాతికి అంకితం
February 22nd, 01:12 pm
మీరట్లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్' కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.జాతీయ క్రీడా దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి... మేజర్ ధ్యాన్ చంద్కు నివాళి
August 29th, 08:39 am
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ను తలుచుకొని గౌరవించుకొనే ఉద్దేశంతో ఏటా ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా దేశ ప్రజలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రీడారంగ ముఖచిత్రంలో నిరంతరంగా చోటుచేసుకొంటున్న మార్పులను ఆయన ప్రస్తావిస్తూ, క్రీడలతో పాటు దేహ దారుఢ్య సంస్కృతిని పెంపొందించడానికి ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. క్రీడాకారులకు సంస్థాపరమైన మద్దతును బలోపేతం చేస్తామనీ, దేశం నలు మూలల ఆధునిక శిక్షణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఆటల పోటీల నిర్వహణకు అనువైన మైదానాలను కూడా ఏర్పాటు చేస్తామనీ ఆయన స్పష్టం చేశారు.బీహార్లోని రాజ్గిర్లో జాతీయ క్రీడా దినోత్సవం నాడు పురుషుల హాకీ ఆసియా కప్ 2025 మొదలవుతున్న సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
August 28th, 09:33 pm
బీహార్లోని చారిత్రక నగరం రాజ్గిర్లో జాతీయ క్రీడా దినోత్సమైన ఆగస్టు 29న ప్రారంభమయ్యే పురుషుల హకీ ఆసియా కప్ 2025లో ఆసియా వ్యాప్తంగా పాల్గొనే జట్లు, క్రీడాకారులు, అధికారులు, వారి అభిమానులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025, ఆసియా రగ్బీ యూ20 సెవెన్స్ ఛాంపియన్షిప్ 2025, ఐఎస్టీఏఎఫ్ సెపక్తక్రా ప్రపంచ కప్ 2024, మహిళ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోపీ 2024 లాంటి కీలకమైన టోర్నమెంట్లను నిర్వహించడం ద్వారా ఇటీవలి కాలంలో శక్తిమంతమైన క్రీడాకేంద్రంగా తనదైన ముద్ర వేసిన బీహార్ను అమిభనందించారు.జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి
August 29th, 10:25 am
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పౌరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ కు ప్రధాని తన మన:పూర్వక శ్రద్ధాంజలి ఘటించారు.మహారాష్ట్రలోని నాసిక్ లో 27వ జాతీయ యువజన ఉత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
January 12th, 01:15 pm
మహారాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే జీ, నా మంత్రివర్గ సహచరులు అనురాగ్ ఠాకూర్, భారతీ పవార్, నిశిత్ ప్రామాణిక్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ జీ, ఇతర ప్రభుత్వ మంత్రులు, విశిష్ట ప్రముఖులు, నా యువ స్నేహితులు!ఇరవై ఏడో జాతీయ యువజనోత్సవాన్ని మహారాష్ట్ర లోనినాసిక్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 12th, 12:49 pm
ఇరవై ఏడో జాతీయ యువజన ఉత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని నాసిక్ లో ఈ రోజు న ప్రారంభించారు. స్వామి వివేకానంద మరియు రాజమాత జీజాబాయి ల చిత్ర పటాని కి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ని ఘటించారు. ‘వికసిత్ భారత్@2047: యువా కే లియే, యువా కే ద్వారా’ అనే ఇతివృత్తం తో సాగిన ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని, మరి రాష్ట్ర బృందం యొక్క మార్చ్ పాస్ట్ ను కూడా ఆయన వీక్షించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రిథమిక్ జిమ్నాస్టిక్స్, మల్లఖంబ్, యోగాసన మరియు జాతీయ యువజనోత్సవ గీతాలాపన చోటు చేసుకొన్నాయి.జాతీయ క్రీడల దినం సందర్భం లో క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 29th, 08:54 am
జాతీయ క్రీడల దినం నాడు క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.జాతీయ క్రీడల దినం సందర్భం లో క్రీడాకారిణుల కు, క్రీడాకారుల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 29th, 09:05 am
జాతీయ క్రీడల దినం సందర్భం లో క్రీడాకారిణుల కు, క్రీడాకారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ప్రసిద్ధ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి కి ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని కూడా సమర్పించారు.ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో బుందేల్ఖండ్ ఎక్స్ ప్రెస్వే ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 16th, 04:17 pm
ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, యుపి ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు మరియు అదే ప్రాంటానికి చెందిన శ్రీ బ్రజేష్ పాఠక్ గారు, శ్రీ భానుప్రతాప్ సింగ్ గారు, యుపి ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బుందేల్ ఖండ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు,ప్రధానమంత్రి యుపి సందర్శన; బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం
July 16th, 10:25 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుందేల్ ఖండ్ ఎక్స్ వేను ఉత్తర ప్రదేశ్ లో జలౌన్ జిల్లాలోని ఒరాయ్ తహసీల్ కు చెందిన కేథేరి గ్రామం వద్ద ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపాఠం
January 02nd, 01:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో మేజర్ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు."ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకు స్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ."
January 02nd, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో మేజర్ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు.జనవరి 2న ప్రధానమంత్రి మీరట్ సందర్శన;
December 31st, 11:11 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జనవరి 2న ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1:00 గంటకు ఆయన మేజర్ ధ్యాన్చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. మీరట్లోని సర్ధానా పట్టణ పరిధిలోగల సలావా, కైలి గ్రామాలలో రమారమి రూ.700 కోట్ల వ్యయంతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుంది. ప్రధాని ప్రముఖంగా దృష్టి సారించిన రంగాలలో క్రీడా సంస్కృతిని ప్రోదిచేయడం, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా భాగంగా ఉన్నాయి. మీరట్లో మేజర్ ధ్యాన్చంద్ క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణం ప్రధాని దార్శనికతను సాకారం చేసే కృషిలో కీలకమైన ముందడుగు కానుంది.ఇది భారతదేశ వృద్ధి కథ యొక్క మలుపు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 28th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం! ఈ రోజు మనం 'మన్ కీ బాత్' కోసం మరోసారి కలిశాం. రెండు రోజుల తర్వాత డిసెంబరు నెల కూడా మొదలవుతోంది. డిసెంబరు రాగానే సంవత్సరం గడిచిపోయినట్టే అనిపిస్తుంది. ఏడాదికి చివరి నెల కావడంతో కొత్త ఏడాదికి పునాదులు వేసుకుంటాం. దేశం అదే నెలలో నౌకా దళ దినోత్సవాన్ని,సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది. డిసెంబర్ 16వ తేదీన దేశం 1971 యుద్ధ స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భాలలోనేను దేశంలోని భద్రతా దళాలను గుర్తుకు తెచ్చుకుంటాను. మన వీరులను స్మరించుకుంటాను. అలాంటి వీరులకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులను గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పటిలాగేఈసారి కూడా నమో యాప్ ద్వారానూ మీ గవ్ ద్వారానూ మీ అందరి నుండి నాకు చాలా సూచనలు వచ్చాయి.మీరు నన్ను మీ కుటుంబంలో ఒక భాగంగా భావించి మీ జీవితంలోని సంతోషాలను, బాధలను పంచుకున్నారు. ఇందులో చాలా మంది యువకులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు. మన'మన్ కీ బాత్' కుటుంబం నిరంతరం అభివృద్ధి చెందుతుండడం నాకు సంతోషంగా ఉంటోంది. ఈ కార్యక్రమం మనస్సులతో అనుసంధానమవుతోంది. లక్ష్యాలతో అనుసంధానమవుతోంది. మన మధ్య లోతైన సంబంధంతో మనలో సానుకూల దృక్పథం నిరంతరం ప్రవహిస్తోంది.భారతదేశ యువత కొత్తగా మరియు పెద్ద ఎత్తున ఏదైనా చేయాలని కోరుకుంటుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 29th, 11:30 am
మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాన మంత్రి ధ్యాన్చంద్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిన మన ఒలింపియన్ల గురించి మాట్లాడారు. దేశంలోని యువత రిస్క్ తీసుకొని ముందుకు సాగగల సామర్థ్యం కోసం ఆయన ప్రశంసించారు. మా నైపుణ్యం కలిగిన మానవశక్తి కృషిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు మరియు భగవాన్ విశ్వకర్మకు నివాళులు అర్పించారు.ఇల్లు, విద్యుత్తు, టాయిలెట్లు, గ్యాస్, రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి ప్రాథమిక సౌకర్యాల లేమి మహిళల పైన, మరీ ముఖ్యం గా పేద మహిళల పైనప్రభావాన్ని చూపింది: ప్రధాన మంత్రి
August 10th, 10:43 pm
ఇంటి పై కప్పు నీటి చుక్కల తో కారుతూ ఉండడం, విద్యుత్తు సౌకర్యం లేకపోవడం, కుటుంబం లో సభ్యులు జబ్బు పడుతూ ఉండడం, బహిర్భూమి కి వెళ్లి రావడం కోసం చీకటి పడే వరకు వేచి ఉండవలసి రావడం, బడుల లో మరుగుదొడ్డి సదుపాయం కొరవడటం అనేవి మన మాతృమూర్తుల పై, మన పుత్రికల పై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింపచేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మన మాతృమూర్తులు పొగ, వేడిమి ల బారిన పడి సతమతం కావడాన్ని మన తరం గమనిస్తూ వచ్చిందని చెబుతూ ఆయన తన స్వీయ అనుభవాన్ని గురించి ప్రస్తావించారు.ఉజ్జ్వల యోజన ద్వారా ప్రజల జీవితాలు, ముఖ్యంగా వెలుగులు నింపిన మహిళల సంఖ్య అపూర్వమైనది: ప్రధాని మోదీ
August 10th, 12:46 pm
ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహోబా ఉత్తర ప్రదేశ్లో ఎల్పిజి కనెక్షన్లను అందజేయడం ద్వారా ప్రధాని మోదీ ఉజ్వల యోజన 2.0 ని ప్రారంభించారు. సోదరీమణుల ఆరోగ్యం, సౌలభ్యం మరియు సాధికారత నిర్ణయం ఉజ్జ్వల యోజన నుండి గొప్ప ప్రోత్సాహాన్ని పొందాయని ప్రధాన మంత్రి గుర్తించారు. ఈ పథకం మొదటి దశలో 8 కోట్ల మంది పేద, దళిత, వెనుకబడిన మరియు గిరిజన కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి.ఉజ్జ్వల 2.0 ను ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా నుంచి ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 10th, 12:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో ఎల్ పీజీ కనెక్షన్ లను లబ్ధిదారుల కు అప్పగించి, ‘ఉజ్జ్వల 2.0’ (ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన - (పిఎమ్ యువై) ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఉజ్జ్వల లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.ఖేల్ రత్న అవార్డు ను ఇక మీదట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుంది: ప్రధాన మంత్రి
August 06th, 02:15 pm
ఖేల్ రత్న అవార్డు ను మేజర్ ధ్యాన్ చంద్ పేరు తో వ్యవహారం లోకి తీసుకు రావాలని భారతదేశం వ్యాప్తంగా పౌరుల వద్ద నుంచి తనకు ఎన్నో అభ్యర్థన లు వస్తున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పౌరుల ఈ భావనల ను గౌరవిస్తూ ఖేల్ రత్న అవార్డు ను ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుందని ఆయన చెప్పారు.