ప్రధానమంత్రి అధ్యక్షతన గిర్‌లో నేడు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ ఏడో సమావేశం

March 03rd, 04:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లో గిర్ నేషనల్ పార్కును సందర్శించారు. అక్కడ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏడో సమావేశాన్ని నిర్వహించగా, ఆ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

గత పదేళ్లలో, పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా కూడా పెరిగింది.. ఇది వన్యప్రాణుల సంరక్షణకు మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, వాటికి చాలా కాలం కొనసాగగల నివాసస్థానాలను కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో సూచిస్తోంది: ప్రధానమంత్రి

March 03rd, 12:36 pm

గత పది సంవత్సరాల్లో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా పెరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ, వన్యప్రాణులను సంరక్షించడానికి మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ ఎక్కువ కాలం కొనసాగగలిగే నివాసస్థానాలను వాటికి కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో ఈ పరిణామం తెలియజేస్తోందన్నారు.

భారతదేశం లో చిరుతపులులసంతతి వృద్ధి చెందడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

February 29th, 09:35 pm

భారతదేశం లో చిరుతపులుల సంతతి పెరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరుతపులుల సంఖ్య లో ఈ గణనీయ వృద్ధి జీవ వైవిధ్యం పట్ల భారతదేశానికి ఉన్న అచంచల సమర్పణ భావాన్ని కనబరుస్తోందనడాని కి ఒక నిదర్శన గా ఉంది అని ఆయన అన్నారు.

మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల స్మారకోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

April 09th, 01:00 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ భూపేందర్ యాదవ్ జీ, శ్రీ అశ్విని కుమార్ చౌబే జీ, ఇతర దేశాల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రతినిధులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు

April 09th, 12:37 pm

టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా క‌ర్ణాట‌క‌, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐ.బీ.సీ.ఏ) ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5వ సారాంశ నివేదిక - ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టి’ ప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5వ) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్‌ పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.

‘మన్ కీ బాత్’ రెండోవిడత 19వ సంచికలో భాగంగా 27.12.2020న ప్రధానమంత్రి ప్రసంగం

December 27th, 11:30 am

మిత్రులారా! దేశంలోని సామాన్యులు ఈ మార్పును అనుభవించారు. నేను దేశంలో అద్భుతమైన ఆశల ప్రవాహాన్ని కూడా చూశాను. చాలా సవాళ్లు ఉన్నాయి. చాలా సమస్యలు కూడా వచ్చాయి. కరోనా కారణంగా సప్లై చైన్ తో పాటు అనేక విషయాల్లో ప్రపంచంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. కాని మనం ప్రతి సంక్షోభం నుండి కొత్త పాఠాలు నేర్చుకున్నాం. దేశంలో కొత్త సామర్ధ్యం కూడా ఏర్పడింది. మాటల్లో చెప్పాలనుకుంటే ఈ సామర్ధ్యం పేరు 'స్వావలంబన'.

చిరుతల సంతతి వృద్ధి చెందుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

December 22nd, 11:53 am

భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతున్నందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ జంతువుల సంరక్షణ దిశ లో కృషి చేస్తున్న వారందరికి ఆయన అభినందనలు తెలిపారు.