శ్రీ నారాయణ్‌ గురు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

August 28th, 01:22 pm

శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. పరస్పర గౌరవం, కరుణతో కూడిన సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు, ప్రబోధకుడుగా శ్రీ నారాయణ గురును ఆయన అభివర్ణించారు.

పరస్పర అభ్యసన-శ్రవణ ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

August 26th, 10:05 am

పరస్పర అభ్యసనం-శ్రవణ ప్రాధాన్యాన్ని వివరించే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు. పరస్పర అవగాహనతో అధ్యయనం, శ్రవణం దిశగా ఉత్సాహం చూపేవారు జ్ఞానుల ప్రశంసలు పొందుతారనే ఆ సుభాషిత అర్థాన్ని ఆయన వివరించారు. అలాంటి వారు స్వార్థ త్యాగులుగా నిలవడమేగాక నిగూఢ యోచనల నుంచి విముక్తులవుతారని తెలిపారు. అలాగే, అన్ని విధాలా ఆనందోత్సాహాలలో వర్ధిల్లుతారని వ్యాఖ్యానించారు:

సత్యం, సేవ, జ్ఞానం, కర్మ.. ఈ సుగుణాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

June 18th, 09:23 am

సత్యానికి కట్టుబడి ఉంటే సంపద, నిస్వార్థంగా సేవలను అందిస్తే కీర్తి, నిరంతర అభ్యాసం ద్వారా జ్ఞానం, కర్మలతో వివేకం లభిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సుగుణాలు మనిషి స్వభావాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషించడంతో పాటు, సమాజ పురోగతిలో కూడా కీలక పాత్రను పోషిస్తాయని ఆయన తెలిపారు.

‘కర్మయోగి సాధనా సప్తాహ్’ సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

April 02nd, 10:40 am

ప్రధాన కార్యదర్శి శ్రీ పీకే మిశ్రా, కర్మయోగి భారత్ ఛైర్మన్ శ్రీ ఎస్. రామదొరై, సామర్థ్య నిర్మాణ కమిషన్ ఛైర్మన్ ఎస్ రాధా చౌహాన్, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

‘కర్మయోగి సాధన సప్తాహం’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 02nd, 10:31 am

సామర్థ్య నిర్మాణ కమిషన్ (సీబీసీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘కర్మయోగి సాధన సప్తాహం’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.

మహాత్మ అయ్యంకాళి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి

August 28th, 03:45 pm

మహాత్మా అయ్యంకాళిని న్యాయం, సాధికారతకు చిరస్మరణీయ రూపంగా స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్య, సమానత్వం పట్ల మహాత్మ అయ్యంకాళి ప్రదర్శించిన అచంచలమైన నిబద్ధతను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన వారసత్వం సమ్మిళిత అభివృద్ధి దిశగా దేశం సాధిస్తున్న సమష్టి ప్రయాణంలో స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.

అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ 2వ దశ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 24th, 10:39 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు.. హాజరైన నా తోటి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, సర్దార్‌ధామ్‌ వ్యవహారాలు చూసుకుంటున్న సోదరుడు శ్రీ గగ్జీ భాయ్, ట్రస్టీ వి.కె. పటేల్, దిలీప్ భాయ్, ఇతర ప్రముఖులు.. నా ప్రియమైన సోదరీ సోదరులారా, ముఖ్యంగా నా ప్రియమైన కుమార్తెలారా..

అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్ - II శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 24th, 10:25 pm

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్- II శంకుస్థాపన సందర్శంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల సేవ, విద్యకు అంకితమైన ఈ వసతి గృహం స్థాపన గురించి వివరిస్తూ.. సర్దార్ ధామ్ పేరు లాగే అది చేసే కృషి కూడా పవిత్రమైనదని ప్రధానమంత్రి అన్నారు. ఈ హాస్టల్లో వసతి పొందే బాలికలు...అనేక ఆకాంక్షల్నీ, ఆశయాలనీ కలిగి ఉంటారని, వాటిని నెరవేర్చుకొనేందుకు అనేక అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ అమ్మాయిలు స్వావలంబన, శక్తి సాధించినప్పుడు.. దేశ నిర్మాణంలో వారు సహజంగానే కీలకపాత్ర పోషిస్తారని, వారి కుటుంబాలు సాధికారత సాధిస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ వసతి గృహంలో ఉండే అవకాశం లభించిన బాలికలకు, వారి కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆకాంక్షిస్తూ.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

వేసవి సెలవులను ఎదగడానికి, జ్ఞానార్జనకు ఉపయోగించుకోండి: యువతను ప్రోత్సహించిన ప్రధానమంత్రి

April 01st, 12:05 pm

దేశమంతటా యువ మిత్రులకు వేసవి సెలవులు మొదలవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సెలవుల కాలాన్ని ఆనందం, జ్ఞానార్జనలతోపాటు జీవితంలో వ్యక్తిగతంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలంటూ వారిని ప్రధాని ప్రోత్సహించారు.