మహాత్మ అయ్యంకాళి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి

August 28th, 03:45 pm

మహాత్మా అయ్యంకాళిని న్యాయం, సాధికారతకు చిరస్మరణీయ రూపంగా స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్య, సమానత్వం పట్ల మహాత్మ అయ్యంకాళి ప్రదర్శించిన అచంచలమైన నిబద్ధతను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన వారసత్వం సమ్మిళిత అభివృద్ధి దిశగా దేశం సాధిస్తున్న సమష్టి ప్రయాణంలో స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.

అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ 2వ దశ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 24th, 10:39 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు.. హాజరైన నా తోటి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, సర్దార్‌ధామ్‌ వ్యవహారాలు చూసుకుంటున్న సోదరుడు శ్రీ గగ్జీ భాయ్, ట్రస్టీ వి.కె. పటేల్, దిలీప్ భాయ్, ఇతర ప్రముఖులు.. నా ప్రియమైన సోదరీ సోదరులారా, ముఖ్యంగా నా ప్రియమైన కుమార్తెలారా..

అహ్మదాబాద్‌లోని కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్ - II శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 24th, 10:25 pm

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కన్యా ఛత్రాలయలో సర్దార్‌ధామ్ ఫేజ్- II శంకుస్థాపన సందర్శంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల సేవ, విద్యకు అంకితమైన ఈ వసతి గృహం స్థాపన గురించి వివరిస్తూ.. సర్దార్ ధామ్ పేరు లాగే అది చేసే కృషి కూడా పవిత్రమైనదని ప్రధానమంత్రి అన్నారు. ఈ హాస్టల్లో వసతి పొందే బాలికలు...అనేక ఆకాంక్షల్నీ, ఆశయాలనీ కలిగి ఉంటారని, వాటిని నెరవేర్చుకొనేందుకు అనేక అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ అమ్మాయిలు స్వావలంబన, శక్తి సాధించినప్పుడు.. దేశ నిర్మాణంలో వారు సహజంగానే కీలకపాత్ర పోషిస్తారని, వారి కుటుంబాలు సాధికారత సాధిస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ వసతి గృహంలో ఉండే అవకాశం లభించిన బాలికలకు, వారి కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఆకాంక్షిస్తూ.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

వేసవి సెలవులను ఎదగడానికి, జ్ఞానార్జనకు ఉపయోగించుకోండి: యువతను ప్రోత్సహించిన ప్రధానమంత్రి

April 01st, 12:05 pm

దేశమంతటా యువ మిత్రులకు వేసవి సెలవులు మొదలవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సెలవుల కాలాన్ని ఆనందం, జ్ఞానార్జనలతోపాటు జీవితంలో వ్యక్తిగతంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలంటూ వారిని ప్రధాని ప్రోత్సహించారు.