న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళనం 2025 ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 31st, 07:00 pm

ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు సర్దార్ సాహెబ్ 150వ జయంతి. ఏక్తానగర్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దాని వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఇక్కడికి సకాలంలో చేరుకోలేనందుకు చింతిస్తున్నాను. ఈ విషయంలో మీ అందరినీ క్షమాపణలను కోరుతున్నాను. సభ ప్రారంభంలో మనం విన్న మంత్రాల శక్తి ఇప్పటికీ మనకి తెలుస్తూనే ఉంది. మీ మధ్య ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అనుభవం దైవికంగా, అద్భుతంగా ఉంటుంది. ఇది స్వామి దయానందుల వారి ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాల పట్ల మనందరికీ ఉన్న గౌరవంతో పాటు ఇక్కడున్న మేధావులైన మీ అందరితోనూ దశాబ్దాలుగా నాకున్న వ్యక్తిగత అనుబంధం వల్లే మళ్లీ మళ్లీ మీ మధ్య ఉండే అవకాశం నాకు లభిస్తోంది. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ, మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాలో ప్రత్యేకమైన శక్తి, స్ఫూర్తి నిండుతాయి. ఇలాంటి మరో తొమ్మిది హాళ్లను ఏర్పాటు చేశారని ఇప్పుడే నాకు చెప్పారు. అక్కడ మన ఆర్యసమాజ్ సభ్యులంతా వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారిని నేను నేరుగా చూడలేనప్పటికీ.. ఇక్కడి నుంచే వారికి నమస్కరిస్తున్నాను.

దేశంలోని ప్రజలను కలిపే ఓ ప్రజా ఉద్యమం ద్వారా నిర్మించిన ‘ఐక్యతా విగ్రహం’.. సర్దార్ పటేల్‌కు ఘన నివాళి: ప్రధానమంత్రి

October 31st, 12:43 pm

‘ఐక్యతా విగ్రహం’ (‘స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ) సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా నిర్మించిన స్మారక చిహ్నం. ఇది ప్రజా ఉద్యమానికి అద్భుతమైన ఉదాహరణ. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా గ్రామాల ప్రజలు ఈ ప్రతిష్ఠాత్మక విగ్రహంతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

Prime Minister pays tributes to Sardar Vallabhbhai Patel at the Statue of Unity in Kevadia

October 31st, 12:41 pm

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Sardar Vallabhbhai Patel at the ‘Statue of Unity’ in Kevadia.

కెవాడియాలోని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 31st, 09:00 am

సర్దార్ పటేల్ 150వ జయంతి చరిత్రాత్మక సందర్భం. ఏక్తానగర్‌లో ఈ నాటి దివ్యమైన ఉదయం...ముఖ్యంగా ఈ విశాల దృశ్యం గొప్ప ఆరాధనా భావాన్ని కలిగిస్తోంది. సర్దార్ సాహెబ్ పాదాల వద్ద మనమంతా సామూహికంగా ఐక్యతా స్ఫూర్తిని చాటుతున్న ఒక గొప్ప సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగులో పాల్గొంటున్న కోట్లాది మంది భారతీయుల ఉత్సాహం ద్వారా మనం నవ భారత సంకల్పాన్ని కార్యాచరణలో చూస్తున్నాం. నిన్న సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శన సహా ఇటీవల ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాలు గత కాలపు సంప్రదాయాన్ని, వర్తమానపు శ్రమనీ- శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించాయి. సర్దార్ సాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఒక స్మారక నాణెంతో పాటు పోస్టల్ స్టాంపును విడుదల చేశాం. సర్దార్ సాహెబ్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 140 కోట్ల మంది దేశవాసులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

గుజరాత్‌లోని కెవాడియాలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 31st, 08:44 am

గుజరాత్‌లోని కెవాడియాలో ఈ రోజు నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ 150వ జయంతి ఒక చరిత్రాత్మక సందర్భమని అన్నారు. ఏక్తా నగర్‌లోని ఉదయం దివ్యమైన, విశాల దృశ్యంగా ఆరాధనా భావాన్ని కలిగిస్తోందని అభివర్ణించిన శ్రీ మోదీ... సర్దార్ పటేల్ పాదాల వద్ద చేరిన నేటి ఈ జన సమూహపు ఐక్యతా స్ఫూర్తితో దేశం ఒక చిరస్మరణీయ అనుభవాన్ని పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని... ఆ కార్యక్రమంలో కోట్లాది మంది భారతీయుల ఉత్సాహంతో కూడిన భాగస్వామ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ద్వారా నవ భారత్ సంకల్పం స్పష్టంగా అవగతమవుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, నిన్నటి సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శనను ప్రస్తావిస్తూ... అవి గత కాలపు సంప్రదాయాలను, వర్తమానపు శ్రమనూ-శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఒక స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. సర్దార్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అక్టోబర్ 30,31 తేదీల్లో గుజరాత్‌లో ప్రధాని పర్యటన

October 29th, 10:58 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 30, 31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు. అక్టోబర్ 30 సాయంత్రం 5:15 సమయంలో కేవడియాలోని ఏక్తానగర్లో ఈ-బస్సులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు ఏక్తానగర్‌లో రూ.1,140 కోట్లకు పైగా విలువైన వివిధ మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.

గుజరాత్‌లోని కేవడియాలో ఏకతా విగ్రహాన్ని సందర్శించిన శ్రీ ఒమర్ అబ్దుల్లా.. ప్రధానమంత్రి ప్రశంసలు

July 31st, 11:05 pm

శ్రీ ఒమర్ అబ్దుల్లా గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక ఏకతా విగ్రహాన్ని, సబర్మతి రివర్‌ఫ్రంటును సందర్శించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతించి, ప్రశంసించారు.

గుజరాత్‌లోని కేవడియాలో కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

October 30th, 09:07 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కేవడియాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులు కేవడియాలో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాయి.

అక్టోబరు 30, 31 లలో ప్రధాన మంత్రి గుజరాత్ పర్యటన ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకల్లో ప్రధాన మంత్రి

October 29th, 03:35 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30, 31 తేదీలలో గుజరాత్‌లో పర్యటించనున్నారు. అక్టోబరు 30న సాయంత్రం సుమారు 5:30 గంటలకు ప్రధాని కేవడియాలోని ఏక్తా నగర్ కు వెళ్తారు. రూ.280 కోట్లకు పైగా విలువైన అనేక మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలలో పాలుపంచుకొంటారు. సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో ఆయన, ‘ఆరంభ్ 6.0’ లో భాగంగా ఉన్న 99వ కామన్ ఫౌండేషన్ కోర్సు తాలూకు శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్టోబరు 31న ఉదయం 7:15గంటలకు ప్రధాని ఏక్తా విగ్రహం వద్దకు చేరుకొని, పుష్పాంజలి సమర్పిస్తారు. ఆ తరువాత, ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ వేడుకల్లో పాల్గొంటారు.

TV episode on ‘Statue of Unity’ will make you want to visit Kevadia at the very earliest!: PM

March 14th, 01:16 pm

The Prime Minister, Shri Narendra Modi has shared a television episode on the majestic ‘Statue of Unity’ and said that it will be an eye opening experience and make one want to visit Kevadia at the very earliest.

గుజరాత్ లోని కెవాడియాలో రూ.160 కోట్ల విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన ప్రధానమంత్రి

October 31st, 07:14 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కెవాడియాలో రూ.160 కోట్ల విలువ గల అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేసి, మరి కొన్నింటిని ప్రారంభించారు.

31 October has become a festival of spirit of nationalism in every corner of the country: PM Modi

October 31st, 10:00 am

PM Modi participated in the Rashtriya Ekta Diwas-related events. Addressing the gathering, the PM Modi remarked that Rashtriya Ekta Diwas celebrates the strength of the unity of India’s youth and its warriors. “In a way, I can witness the form of mini India '', PM Modi emphasized. He underlined that even though the languages, states and traditions are different, every person in the country is weaved in the strong thread of unity.

గుజరాత్ లోనికేవడియా లో జరిగిన రాష్ట్రీయ ఏకత దివస్ వేడుకల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

October 31st, 09:12 am

జన సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం లో యువతీ యువకులు మరియు యోధుల యొక్క ఏకత శక్తి ని రాష్ట్రీయ ఏకత దివస్ అనేది చాటిచెబుతోంది అని అభివర్ణించారు. ‘‘ఒక విధం గా ఇక్కడ బుల్లి భారతదేశాన్ని నేను చూస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భాషలు, రాష్ట్రాలు మరియు సంప్రదాయాలు వేరైనప్పటికీ దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి ఏకత తాలూకు బలమైన పాశం తో ముడిపడ్డారు అని ఆయన నొక్కి చెప్పారు. ‘‘పూస లు అనేకం ఉన్నా గానీ దండ మాత్రం ఒక్కటే, మనం భిన్నం గా ఉన్నప్పటికీ ఒక్కటి గా ఉంటున్నాం’’ అని ఆయన అన్నారు. ఆగస్టు లో 15 వ తేదీ ని స్వాతంత్య్ర దినం గా మరియు జనవరి లో 26 వ తేదీ ని గణతంత్ర దినం గా జరుపుకొన్నట్లే అక్టోబరు 31 వ తేదీ ని దేశవ్యాప్తం గా ‘ఏకత’ తాలూకు పండుగ రోజు గా పాటిస్తున్నట్లు ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఎర్రకోట లో జరిగే స్వాతంత్య్ర దిన ఉత్సవాలు, కర్తవ్య పథ్ లో జరిగే గణతంత్ర దిన కవాతు, మరి నర్మద మాత తీర ప్రాంతం లో గల స్టేట్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరిగే రాష్ట్రీయ ఏకత దివస్ వేడుక లు.. ఈ మూడూ జాతీయ చైతన్యాని కి ప్రతీక లు అని ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. ఈ రోజు న నిర్వహించుకొంటున్న కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఎవరైతే ఏకత నగర్ ను సందర్శిస్తారో వారు స్టేట్యూ ఆఫ్ యూనిటీ ని వీక్షించడం ఒక్కటే కాకుండా, సర్ దార్ సాహబ్ యొక్క జీవనం మరియు భారతదేశ జాతీయ అఖండత కు ఆయన అందించిన సేవల ను సైతం దర్శిస్తారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘స్టేట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆదర్శాల కు ప్రతినిధిత్వాన్ని వహిస్తున్నది’’ అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆ విగ్రహ నిర్మాణం లో పౌరులు అందించిన తోడ్పాటుల ను గురించి ఆయన చెప్తూ, రైతులు ఈ కార్యం కోసం వారి ఉపకరణాల ను విరాళం గా ఇచ్చిన ఉదాహరణ ను ప్రస్తావించారు. వాల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం కోసం భారతదేశం లో వివిధ ప్రాంతాల నుండి మట్టి ని తీసుకు వచ్చి, ఆ మట్టి భాగాల ను ఒక చోట కలపడం జరిగింది అని కూడా ఆయన అన్నారు. దేశవ్యాప్తం గా ‘రన్ ఫర్ యూనిటీ’ మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల లో పాలుపంచుకోవడం ద్వారా రాష్ట్రీయ ఏకత దివస్ వేడుకల లో కోట్ల కొద్దీ పౌరులు జతపడ్డారు అని ప్రధాన మంత్రి తెలియ జేశారు. ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావన ను ఒక పండుగ లాగా జరుపుకోవడం కోసం ముందుకు వచ్చిన 140 కోట్ల మంది పౌరుల లో సర్ దార్ సాహబ్ యొక్క ఆదర్శాలు మూర్తీభవించాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సర్ దార్ పటేల్ గారి కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని సమర్పించి, పౌరుల కు రాష్ట్రీయ ఏకత దివస్ సందర్భం లో అభినందనల ను తెలియ జేశారు.

ఈ నెల 30-31 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన

October 29th, 02:20 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30-31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు. తొలిరోజున ఉదయం 10:30 గంటలకు అంబాజీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మెహసానాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. రెండో రోజున ఉదయం 8:00 గంటలకు ఆయన కేవాడియా వెళ్తారు. అక్కడ జాతీయ ఐక్యత దినోత్సవాల్లో భాగంగా ఐక్యతా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్టారు. అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అటుపైన సుమారు 11:15 గంటలకు ‘ఆరంభ్ 5.0’ ముగింపు సందర్భంగా 98వ కామన్ ఫౌండేషన్ కోర్సు శిక్షణార్థి అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 18th, 11:30 am

మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది 'మన్ కీ బాత్' శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు. నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్‌జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

We stamped out terrorism in the last eight years with resolute actions: PM Modi in Jamnagar

November 28th, 02:15 pm

Addressing his third public meeting of the day, The Prime Minister said, “It is equally important for a developed India to be a self-reliant India. And that's why Gujarat's industries, MSMEs-small scale industries have a huge role to play. Jamnagar's brass industry and bandhani art have received a lot of support over the years. Today, Jamnagar produces everything from pins to aeroplane parts”.

From once manufacturing cycles, Gujarat is now moving towards manufacturing aeroplanes: PM Modi in Rajkot

November 28th, 02:05 pm

Addressing his third public meeting of the day, The Prime Minister said, “It is equally important for a developed India to be a self-reliant India. And that's why Gujarat's industries, MSMEs-small scale industries have a huge role to play. Jamnagar's brass industry and bandhani art have received a lot of support over the years. Today, Jamnagar produces everything from pins to aeroplane parts”.

BJP does not consider border areas or border villages as the last village of the country but as the first village: PM Modi in Anjar

November 28th, 01:56 pm

PM Modi came down heavily on the Congress for colluding with those who opposed the delivery of water to Kutch. PM Modi said, “The Congress has always been encouraging those who opposed the Sardar Sarovar Dam. The people of Kutch can never forget such a party, which created hurdles for the people of Kutch.” PM Modi further talked about how the Kutch Branch Canal is changing lives, PM Modi said, “The hard work of the BJP government is paying off for Kutch. Today many agricultural products are exported from Kutch”.

BJP has done the work of making Gujarat a big tourism destination of the country: PM Modi in Palitana

November 28th, 01:47 pm

Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed a public meeting in Palitana, Gujarat. PM Modi started his first rally of the day by highlighting that the regions of Bhavnagar and Saurashtra are the embodiment of ‘Ek Bharat, Shreshtha Bharat’.

PM Modi addresses public meetings in Palitana, Anjar, Jamnagar & Rajkot, Gujarat

November 28th, 01:46 pm

Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed public meetings in Palitana, Anjar & Jamnagar, Gujarat. In his first rally of the day, PM Modi said that the region of Saurashtra embodies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. In his second address at Anjar, PM Modi talked about Kutch’s recovery from the earthquake in 2001. In his last two public meetings for the day, PM Modi talked about the economy and the manufacturing sector of Gujarat.