అస్సాంలో ఎన్ హెచ్ -715 లోని కాలీబోర్ - నుమాలిగఢ్ సెక్షన్ రహదారిని
October 01st, 03:26 pm
అస్సాంలో కాజీరంగా జాతీయ పార్కు (కేఎన్పీ) మార్గంలో ప్రతిపాదించిన వన్యప్రాణుల సంరక్షణ చర్యలను అమలు చేయడంతో సహా, జాతీయ రహదారి 715 లోని కాలీబోర్ - నుమాలిగఢ్ సెక్షన్ రహదారిని నాలుగు లైన్లుగా వెడల్పు చేయడానికి, మెరుగుపరచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్ స్ట్రక్షన్ (ఈపీపీ) పద్ధతిలో మొత్తం 85.675 కిలోమీటర్ల పొడవున రూ 6957 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.2047లో అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారానే సాగుతుంది: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
July 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.అస్సాం గౌహతిలో ఏర్పాటైన ఝుమోయిర్ బినందిని కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 24th, 06:40 pm
గౌరవనీయ అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు డాక్టర్ ఎస్. జయశంకర్, శ్రీ సర్బానంద్ సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, కళాకారులు, అస్సాం సోదర సోదరీమణులు...అస్సాంలోని గౌహతిలో ఝుమోయిర్ బినందిని కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి
February 24th, 06:39 pm
అస్సాంలోని గౌహతిలో ఒక భారీ ఝుమోర్ కార్యక్రమం అయిన ‘ఝుమోర్ బినందిని 2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఆహూతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమంలో ఎటు చూసినా శక్తి, ఉత్సాహం, ఉత్సుకత వెల్లివిరుస్తున్నాయన్నారు. ఝుమోయిర్ కళాకారులు వారు పనిచేసే తేయాకు తోటల్లోని సుగంధాన్ని, శోభను తమ నృత్యంలో ఆవిష్కరించారంటూ ఆయన ప్రశంసలను కురిపించారు. ఝూమోయిర్తోనూ, తేయాకు తోటల సంస్కృతితోనూ ప్రజలకొక విశిష్ట అనుబంధం ఉన్నట్లే ఈ విషయంలో తాను కూడా ఇదే తరహా అనుభూతిని పొందానని ఆయన అభివర్ణించారు. ఇంత పెద్ద సంఖ్యలో కళాకారులు ఈ రోజు ప్రదర్శించిన ఝూమోయిర్ నృత్యం ఒక రికార్డును సృష్టించగలదని కూడా ఆయన అన్నారు. 2023లో తాను అస్సాంను సందర్శించినప్పుడు కూడా 11,000 మంది కళాకారులు బిహూ నృత్యం చేయగా అదొక రికార్డును సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. అది తాను మరచిపోలేని ఓ జ్ఞాపకమని చెబుతూ అలాంటి ఒక సమ్మోహక ప్రదర్శనను తిలకించడానికి తాను సంసిద్ధుడినై వచ్చినట్లు చెప్పారు. ఒక ఉజ్వల సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు అస్సాం ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ రోజు అస్సాంకూ, తేయాకు తోటల్లో పనిచేసేవారికి, వేడుకల్లో పాలుపంచుకొనే ఆదివాసీలకు గర్వించాల్సిన రోజు అని ఆయన అన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున అందరికీ ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు.ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా వాటి పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ప్రధానమంత్రి పునరుద్ఘాటన
September 22nd, 12:17 pm
ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ఖడ్గమృగాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత్లో ఎక్కువ సంఖ్యలో ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఉన్న అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కును సందర్శించాలని ఆయన ప్రజలను కోరారు.Development of Northeast is imperative for a Viksit Bharat: PM Modi
March 09th, 01:50 pm
PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone for multiple development projects worth more than Rs 17,500 crores in Jorhat, Assam. He said, “Veer Lachit Borphukan is the symbol of Assam’s valor and determination and said Vikas bhi, Virasat bhi is our development model.అస్సాంలోని జోర్హాట్లో రూ. 17,500 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి, దేశానికి అంకితం చేశారు
March 09th, 01:14 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అస్సాంలోని జోర్హాట్లో రూ. 17,500 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు. మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులలో ఆరోగ్యం, చమురు, గ్యాస్, రైలు, గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి.అస్సాంలో కజిరంగా జాతీయ పార్కును సందర్శించిన ప్రధాని
March 09th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం అస్సాంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కజిరంగా జాతీయ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా కజిరంగా జాతీయ పార్కును భారత పౌరులంతా సందర్శించాలని, ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ఈ పార్కు పరిరక్షణ ద్వారా పర్యావరణ సంరక్షణలో పాలుపంచుకుంటున్న ‘వన దుర్గ’ మహిళా అటవీ గార్డుల బృందంతో ప్రధాని కొంతసేపు ముచ్చటించారు. ఈ సహజ వారసత్వ సంపద రక్షణలో వారి అంకితభావాన్ని, సాహసాన్ని ఆయన ప్రశంసించారు. పార్కు సందర్శన సమయంలో అక్కడి గజత్రయం ‘లఖిమాయి, ప్రద్యుమ్న, ఫూల్మాయి’లకు చెరకు గడలు అందిస్తూ, ఆ దృశ్యాలను ప్రజలతో పంచుకున్నారు.Prime Minister Narendra Modi to visit Assam, Arunachal Pradesh, West Bengal and Uttar Pradesh
March 08th, 04:12 pm
Prime Minister will visit Assam, Arunachal Pradesh, West Bengal and Uttar Pradesh on 8th-10th March, 2024