శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 28th, 03:35 pm

ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.

గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

November 28th, 03:30 pm

“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

కాశీ విశ్వనాథాలయ పూర్వ మహంత్ డాక్టర్ కులపతి తివారీ మృతిపై ప్రధానమంత్రి సంతాపం

June 26th, 08:45 pm

కాశీ విశ్వనాథ ఆలయ పూర్వ మహంత్ డాక్టర్ కులపతి తివారీ కన్నమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

ఆచార్యలక్ష్మీకాంత్ దీక్షిత్ యొక్క మృతి పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

June 22nd, 02:50 pm

ఆచార్య శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ యొక్క మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ పట్ల ఆచార్య శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ సమర్పణ భావాన్ని కలిగివుంటూ, రామ ఆలయం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

కాశీలోని డాక్ట‌ర్ సంపూర్ణానంద్ క్రీడా మైదాన ప్ర‌గ‌తిని స‌మీక్షించిన ప్రధాన మంత్రి

June 18th, 11:20 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో ఏర్పాటు చేసిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కిసాన్ స‌మ్మాన్ నిధి కార్య‌క్ర‌మం, గంగా హార‌తి, కాశీ విశ్వ‌నాధ ఆల‌యంలో ప్రార్థ‌న‌ల త‌ర్వాత ఆయ‌న డాక్ట‌ర్ సంపూర్ణానంద్ క్రీడా మైదాన నిర్మాణానికి సంబంధించి ఆక‌స్మిక త‌నిఖీ చేప‌ట్టారు. వార‌ణాసిలో నిర్మిస్తున్న స్టేడియం, క్రీడా స‌ముదాయాల‌ను సంద‌ర్శించి ప‌నుల ప్ర‌గ‌తిని నేరుగా తెలుసుకున్నారు.