జనవరి 3న భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

January 01st, 05:39 pm

భగవాన్ బుద్దునికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను 2026 జనవరి 3వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ‘‘ద లైట్, ద లోటస్: రెలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్’’ అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా సాంస్కృతిక సముదాయంలో ఈ ప్రదర్శన జరగనుంది.