58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ విద్యార్థులను అభినందించిన ప్రధానమంత్రి
July 19th, 07:09 pm
ప్రతిష్ఠాత్మక 58వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో భారత బృందం నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. ఈ ప్రపంచస్థాయి పోటీలో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన దేబదత్త ప్రియదర్శి, హర్షిత్ సింఘాల్, కబీర్ చిల్లర్, సందీప్ కుచిలతో కూడిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఈ బృందం ప్రతిభ, అంకితభావం, విజ్ఞానశాస్త్రం పట్ల ఉన్న వారి అభిరుచి యావత్ దేశానికి గర్వకారణమన్నారు. ఇది అనేక మంది యువత రసాయన శాస్త్రాన్ని అభ్యసించి, అందులో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.