హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్‌కు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటనలో సంయుక్త పత్రికా ప్రకటన

December 16th, 03:56 pm

హేషమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 15, 16 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు.

భారత్‌-జోర్డాన్‌ బిజినెస్‌ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 16th, 12:24 pm

కాలుష్య రహిత వృద్ధి లేనిదే నేటి ప్రపంచం ముందడుగు వేయడం సాధ్యం కాదు. అందువల్ల కాలుష్య రహిత ఇంధనం ఇక ఎంతమాత్రం ఐచ్ఛికం కాదు... అదొక అవసరంగా మారిపోయింది. ఆ మేరకు భారత్‌ ఇప్పటికే సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ సహా ఇంధన నిల్వలో పెట్టుబడిదారుగా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో జోర్డాన్‌కు అపార సామర్థ్యం ఉంది కాబట్టి, దాన్ని రెండు దేశాలూ సంయుక్తంగా మరింత సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి, కింగ్ అబ్దుల్లా II

December 16th, 12:23 pm

అమ్మాన్‌లో ఈ రోజు నిర్వహించిన ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి జోర్డాన్ యువరాజు హుస్సేన్, ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, పెట్టుబడుల మంత్రి కూడా హాజరయ్యారు. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవాల్సిన ప్రాధాన్యాన్ని రాజు, ప్రధాని ఇద్దరూ గుర్తించారు. సామర్థ్యాన్ని, అవకాశాలను వృద్ధిగా, సంక్షేమంగా మార్చాలని రెండు దేశాల పారిశ్రామిక వేత్తలను కోరారు. దక్షిణాసియా, పశ్చిమాసియా పరిధి దాటి విస్తరించిన ఆర్థిక కారిడార్‌ను తయారుచేయడానికి జోర్డాన్ స్వేచ్ఛాయుత వ్యాపార ఒప్పందాలను, భారత ఆర్థిక శక్తిని ఏకం చేయాలని జోర్డాన్ రాజు తెలిపారు.

List of Outcomes Visit of Prime Minister to Jordan

December 15th, 11:52 pm

During the meeting between PM Modi and HM King Abdullah II of Jordan, several MoUs were signed. These include agreements on New and Renewable Energy, Water Resources Management & Development, Cultural Exchange and Digital Technology.

జోర్డాన్ రాజు గౌరవ అబ్దుల్లా-IIతో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

December 15th, 11:00 pm

నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. భారత్-జోర్డాన్ మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సానుకూల ఆలోచనలను మీరు ప్రతిపాదించారు. మీ స్నేహానికి, భారత్ పట్ల చూపిన ప్రాధాన్యతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

జోర్డాన్ రాజు గౌరవ అబ్దుల్లా-II గారితో ప్రధానమంత్రి భేటీ

December 15th, 10:58 pm

జోర్డాన్ రాజు అబ్దుల్లా IIగారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారు. అల్ హూస్సేనియా ప్యాలెస్‌కు చేరుకున్న మోదీకి అబ్దుల్లా II రాజుగారు లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.

జోర్డాన్‌లోని అమ్మాన్‌కు చేరుకున్న భారత ప్రధానమంత్రికి ప్రత్యేక స్వాగతం

December 15th, 04:48 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మాన్‌కు చేరుకున్నారు. అమ్మాన్ విమానాశ్రయానికి వచ్చిన భారత ప్రధానమంత్రిని.. గౌరవ జోర్డాన్ ప్రధానమంత్రి డాక్టర్ జాఫర్ హసన్ సాదరంగా ఆహ్వానించి, లాంఛనంగా స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇది ప్రతీక.

జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన

December 15th, 08:15 am

ఈ రోజు నేను మూడు దేశాలు- హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా, ఒమన్ సుల్తానేట్‌లో పర్యటించేందుకు బయలుదేరి వెళుతున్నాను. ఈ మూడు దేశాలతోనూ భారత్‌కు ప్రాచీన నాగరిక సంబంధాలు, సమకాలీన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి.

జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లలో ప్రధాని పర్యటన

December 11th, 08:43 pm

మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబరు 15 – 16 తేదీల్లో హషేమైట్ రాజ్యమైన జోర్డాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా గౌరవ మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్‌తో భారత ప్రధానమంత్రి సమావేశమై.. భారత్, జోర్డాన్ మధ్య సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించడంతోపాటు పలు ప్రాంతీయ అంశాలపైనా చర్చిస్తారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. భారత్ - జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పర వృద్ధి, సంక్షేమం కోసం సహకారానికి కొత్త మార్గాల అన్వేషణకు, అలాగే.. ప్రాంతీయ శాంతి, సమృద్ధి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో అంకితభావాన్ని పునరుద్ఘాటించేందుకు ఇదో మంచి అవకాశం.

జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో ప్రధానమంత్రి సంభాషణ

October 23rd, 07:12 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ- జోర్డాన్‌ రాజు అబ్దుల్లా IIతో మాట్లాడారు. పశ్చిమాసియా ప్రాంతంలో పరిణామాలపై ఇరువురూ పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఉగ్రవాదం, హింస, పౌరుల ప్రాణనష్టం గురించిన ఆందోళనను కూడా శ్రీ మోదీ పంచుకున్నారు. భద్రత, మానవతా పరిస్థితులను త్వరగా పరిష్కరించేందుకు సంఘటిత ప్రయత్నాల అవసరాన్ని నొక్కి చెప్పారు.

జోర్డాన్ దేశ వ్య‌వ‌స్థాప‌క శ‌త వార్షికోత్స‌వం సంద‌ర్భంగా జోర్డాన్‌ప్ర‌జ‌ల‌కు, రాజు అబ్దుల్లా -2కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.

April 14th, 08:58 am

జోర్డాన్ శ‌త వార్షికోత్స‌వం సంద‌ర్భంగా జోర్డాన్ ప్ర‌జ‌ల‌కు, రాజు అబ్దుల్లా -2కు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, వీడియో సందేశం ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.

జోర్డాన్ దేశ శ‌త‌వార్షికోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి శుభాకాంక్ష‌ల సందేశం

April 14th, 08:53 am

జోర్డాన్ దేశ శ‌త‌వార్షికోత్స‌వాల ను పురస్క‌రించుకుని నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేసుకుంటున్నాను. రాజు అబ్దుల్లాకు , జోర్డాన్ ప్ర‌జ‌ల‌కు నా శుభాకాంక్ష‌లు.

Telephone Conversation between PM and King of Hashemite Kingdom of Jordan

April 16th, 07:54 pm

Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with His Majesty King Abdullah II of the Hashemite Kingdom of Jordan.

జోర్డాన్ రాజు కు మ‌రియు ప్ర‌ధాన మంత్రి కి మ‌ధ్య రియాద్ లో జ‌రిగిన స‌మావేశం

October 29th, 02:18 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కింగ్ డ‌మ్ ఆఫ్ జోర్డాన్ యొక్క రాజు శ్రీ అబ్దుల్లాహ్ ద్వితీయ బిన్ ఎల్-హుసేన్ తో సౌదీ అరేబియా లోని రియాద్ లో ఈ రోజు న ఫ్యూచ‌ర్ ఇన్‌ వెస్ట్‌ మెంట్ ఇనీశియేటివ్ (ఎఫ్ఐఐ) జ‌రిగిన సంద‌ర్భం గా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భం గా- 2018వ సంవత్సరం లో ఫిబ్రవరి 27వ తేదీ నుండి అదే సంవత్సరం లో మార్చి నెల ఒకటో తేదీ వరనకు జోర్డాన్ రాజు భారతదేశంలో జరిపిన యాత్ర సందర్భం లో సంతకాలైన ఎంఒయు లు మరియు ఒప్పంద పత్రాల ను గురించిన చర్చ సహా- ద్వైపాక్షిక సంబంధాల ను మరింత బ‌ల‌ప‌ర‌చుకోవ‌డం గురించి నేత లు ఉభ‌యులు ఒక‌రి అభిప్రాయాల ను మ‌రొక‌రి కి వెల్ల‌డించుకొన్నారు. వారు మ‌ధ్య ప్రాచ్య శాంతి ప్ర‌క్రియ ను గురించి, అలాగే ఇత‌ర ప్రాంతీయ ఘటనల‌ ను గురించి కూడాను చ‌ర్చించారు. ఉగ్ర‌వాదాన్ని ఎదురించడం లో స‌హ‌కారం అంశం పై సైతం చ‌ర్చించడమైంది.

జోర్డాన్ రాజు భారతదేశం లో పర్యటించిన సందర్భంగా సంతకాలైన ఎమ్ఒయు లు/ ఒప్పందాల జాబితా

March 01st, 05:07 pm

జోర్డాన్ రాజు భారతదేశం లో పర్యటించిన సందర్భంగా సంతకాలైన ఎమ్ఒయు లు/ ఒప్పందాల జాబితా

దేశంలో ఉన్న గొప్ప వైవిధ్యం గురించి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు: ప్రధాని మోదీ

March 01st, 11:56 am

ఇస్లామిక్ హెరిటేజ్పై సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా మతాలు భారతదేశంలో వృద్ధి చెందాయి, దేశంలోని గొప్ప వైవిధ్యం గురించి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. మొత్తం ప్రపంచం ఒక కుటుంబం అనే 'వసుధైవ కుటుంబకం' తత్వశాస్త్రంపై భారతదేశం విశ్వసించింది. అలాగే, 'సబ్కా సాత్, సబ్కా వికాస్' మంత్రాన్ని హైలైట్ చేస్తూ, అభివృద్ధి ప్రయాణంలో ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లడంపై భారతదేశం విశ్వసిస్తుందని అన్నారు.

జోర్డాన్కు చెందిన హెచ్ఎం కింగ్ అబ్దుల్లా II ని కలిసిన ప్రధాని

February 09th, 08:58 pm

ప్రధాని నరేంద్ర మోదీ నేడు జోర్డాన్ హెచ్ఎం కింగ్ అబ్దుల్లా II ను కలిసి ఉత్పాదక చర్చలు చేపట్టారు.

జోర్డాన్ లోని అమ్మన్ చేరుకున్న ప్రధాని మోదీ

February 09th, 06:50 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్ లోని అమ్మన్ కు చేరుకున్నారు. జోర్డాన్ యొక్క రాజు అబ్దుల్లా II తో ప్రధాని సమావేశమవుతారు.

ప్రధాన మంత్రి తో జోర్డాన్ కు చెందిన రాయల్ హాశిఎయిట్ కోర్టు ప్రముఖుడు డాక్టర్ ఫైజ్ తారవానెహ్ భేటీ

March 10th, 10:55 pm

Dr. Fayez Tarawneh, Chief of The Royal Hashemite Court of Jordan met Prime Minister Narendra Modi. They discussed the shared commitment to strengthen bilateral engagement and the many opportunities in this regard. Dr. Fayez Tarawneh also exchanged views with Prime Minister on the situation in West Asia and the scourge of terrorism that calls for a comprehensive international response.

Sufism is the voice of peace, co-existence, compassion and equality; a call to universal brotherhood: PM Modi

March 17th, 08:20 pm