ఝరియా మాస్టర్ ప్లాన్ సవరణ.. ఆమోదం తెలిపిన మంత్రిమండలి
June 25th, 03:14 pm
సవరించిన ఝరియా మాస్టర్ ప్లాన్కు (జేఎంపీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఝరియా బొగ్గు క్షేత్రంలో మంటలు చెలరేగడం, నేల కుంగడం వంటి సవాళ్లు ఎదురైతేనో, ప్రభావిత కుటుంబాలకు పునరావాసాన్ని కల్పించవలసివస్తేనో ఈ తరహా పరిస్థితులను తట్టుకొని ముందుకు పోవడానికి ఝరియా మాస్టర్ ప్లాన్ను సవరించారు. ఈ సవరించిన ప్లానును అమలు చేయడానికి మొత్తం రూ.5,940.47 కోట్లు ఖర్చవుతుంది. దశలవారీగా దీనిని అమలుపరిస్తే గనక మంటలు, నేల కుంగుబాటు సమస్యల్ని ఎదుర్కొనే స్థితికి తోడు ప్రభావిత కుటుంబాలకు అత్యంత ప్రమాదభరిత ప్రదేశాల నుంచి ప్రాథమ్య క్రమం ప్రాతిపదికన సురక్షిత పునరావాసాన్ని అందించేందుకు వీలు ఉంటుంది.