మహిళల 60 కెజిల బాక్సింగ్లో కాంస్యపతకం సాధించిన జైస్మైన్కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
August 06th, 10:06 pm
2022 బర్మింగ్హామ్ కామన్ వెల్త్ క్రీడలలో మహిళల 60 కేజిల బాక్సింగ్లో కాంస్య పతకం సాధించిన జైస్మైన్ను అభినందించిన ప్రధానమంత్రి 2022 బర్మింగ్హామ్ కామన్ వెల్త్ క్రీడలలో మహిళల 60 కేజిల బాక్సింగ్లో కాంస్య పతకం సాధించిన జైస్మైన్ను అభినందిస్తూ ప్రధానమంత్రి ఒక ట్వీట్ లో , భారత క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడలలో వివిధ క్రీడాంశాలలో అద్భుత ప్రతిభ కనబరిచారు. జైస్మైన్ లాంబోరియా బాక్సింగ్లో కాంస్యపతకం సాధించారని తెలసి ఆనందంగా ఉంది. ఆమె విజయం భారతదేశ బాక్సింగ్ భవిష్యత్ కు మంచి సూచన. రాగల సంవత్సరాలలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.అని తెలిపారు.