
మారిషస్లో అటల్ బిహారీ వాజ్పేయీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నొవేషన్ను కలిసి ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ నవీన్చంద్ర రాంగులామ్
March 12th, 03:13 pm
మారిషస్లోని రెడుయిట్లో అటల్ బిహారీ వాజ్పేయీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నొవేషన్ను మారిషస్ ప్రధాని శ్రీ నవీన్చంద్ర రాంగులామ్తోపాటు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. భారత్-మారిషస్ అభివృద్ధి భాగస్వామ్యంలో ఓ భాగమైన ఈ ముఖ్య ప్రాజెక్టు మారిషస్లో సామర్థ్యాలను పెంచే కార్యక్రమాల పట్ల భారత్ ఎంత నిబద్ధతతో ఉందీ చెప్పకనే చెబుతోంది.