Prime Minister greets Indian Navy personnel on the Navy Day

December 04th, 08:41 am

The Prime Minister, Shri Narendra Modi has greeted all the personnel of Indian Navy on the Navy Day, today. Shri Modi stated that our Navy is synonymous with exceptional courage and determination. They safeguard our shores and uphold our maritime interests. I can never forget this year’s Diwali, which I spent with Naval personnel on board INS Vikrant. Wishing the Indian Navy the very best for their endeavours ahead, Shri Modi said.

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

October 21st, 09:30 am

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో భారతీయ నౌకాసేనతో కలిసి దీపావళి వేడుకలను నిర్వహించినప్పటి చిత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... అద్భుతమైన క్షణం.. అంతేకాకుండా అద్భుత సన్నివేశమని అన్నారు. ఒక వైపు విశాల మహాసముద్రం ఉంటే, మరో వైపు భరత మాత వీర సైనికుల అపార శక్తి కొలువుదీరిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఒక వైపు దిగంతం, ఆనంతాకాశం ఉంటే, మరో వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మాండ శక్తి ఉందనీ, ఇది అనంత శక్తికి ప్రతీక అనీ ఆయన చెప్పారు. సముద్రంపై ప్రసరిస్తున్న సూర్యకాంతి మెరుపులు దీపావళి వేళ వీర సైనికులు వెలిగించిన దీపాలా అన్నట్లుగా ఓ అపురూప దివ్య కాంతి మాలిక కనిపిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సారి దీపావళిని భారతీయ నావికా దళ యోధుల నడుమ నిర్వహించుకోవడం తనకు లభించిన సౌభాగ్యమని ఆయన అన్నారు

అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 20th, 10:30 am

ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.

ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు... 21వ శతాబ్దంలో భారత కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతలకు ఇది నిదర్శనం

October 20th, 10:00 am

ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... ఒక అద్భుతమైన క్షణం... ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఒక వైపు విశాలమైన సముద్రం... మరోవైపు ధైర్యవంతులైన భరతమాత సైనికుల అపారమైన బలం ఇక్కడ ఉందన్నారు. ఒక దిశ అనంతమైన ఆలోచనా పరిధిని... హద్దులులేని ఆకాశాన్ని ప్రదర్శిస్తుండగా, మరొక దిశలో అనంతమైన శక్తి గల ఐఎన్ఎస్ విక్రాంత్ అపార శక్తి ప్రదర్శితమవుతోందని ఆయన పేర్కొన్నారు. సముద్రంపై నుంచి కనిపిస్తున్న సూర్యకాంతి మెరుపులు ధైర్యవంతులైన మన సైనికులు వెలిగించిన దీపాల మాదిరిగా ప్రకాశిస్తూ.. దివ్య దీప మాలను తలపిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలకు మారుపేరైన భారత నావికాదళ సిబ్బందితో కలిసి ఈ దీపావళిని జరుపుకోవడం తనకు దక్కిన గౌరవమని ఆయన ఉద్ఘాటించారు.

అనువాదం: గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో నిర్వహించిన ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 20th, 11:00 am

భావ్‌నగర్‌లో ఒక ఉత్తేజకరమైన వాతావరణం కనిపిస్తోంది. వేదిక ముందున్న జన సంద్రం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద జనసమూహం నాకు ఆశీస్సులు ఇచ్చేందుకు వచ్చింది. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 20th, 10:30 am

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రూ. 34,200 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. 'సముద్ర సే సమృద్ధి' కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు. ఈ నెల 17న తనకు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు గొప్ప బలమన్నారు. దేశంలో విశ్వకర్మ జయంతి నుంచి గాంధీ జయంతి వరకు అంటే ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. గత 2-3 రోజుల్లో గుజరాత్‌లో అనేక సేవా కార్యక్రమాలు.. వందలాది ప్రదేశాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారన్నారు. ఇప్పటివరకు ఒక లక్ష మంది రక్తదానం చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు. అనేక నగరాల్లో నిర్వహించిన పరిశుభ్రతా కార్యక్రమాల్లో లక్షలాది మంది పౌరులు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30,000 కి పైగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామనీ, ప్రజలకు.. ముఖ్యంగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 15th, 11:08 am

జనవరి 15వ తేదీని సైనిక దినోత్సవంగా జరుపుకొంటాం. దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి వీర సైనికుడికి నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను, ఈ రోజున భరతమాత రక్షణలో నిమగ్నమైన సైనికులను, మహిళలను నేను అభినందిస్తున్నాను.

PM Modi dedicates frontline naval combatants INS Surat, INS Nilgiri & INS Vaghsheer to the nation

January 15th, 10:30 am

PM Modi dedicated three frontline naval combatants, INS Surat, INS Nilgiri and INS Vaghsheer, to the nation on their commissioning at the Naval Dockyard in Mumbai. “It is for the first time that the tri-commissioning of a destroyer, frigate and submarine was being done”, highlighted the Prime Minister. He emphasised that it was also a matter of pride that all three frontline platforms were made in India.

నైజీరియాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం

November 17th, 07:20 pm

మీరు ఈ రోజు అబుజాలో ఉల్లాసమైన వాతావరణాన్ని సృష్టించారు. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న ప్రతి అంశాన్ని నేను గమనిస్తున్నాను. నేను అబుజాలో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. భారత్‌లోని ఓ నగరంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. లాగోస్, కనో, కడునా, పోర్ట్ హర్కోర్ట్ తదితర విభిన్నమైన ప్రాంతాల నుంచి మీరు అబుజాకి వచ్చారు. మీ ముఖాల్లోని వెలుగు, మీరు చూపిస్తున్న ఉత్సాహం, ఇక్కడకు రావాలనే మీ తపనను తెలియజేస్తున్నాయి. నేను కూడా మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆత్రుతతో ఎదురుచూశాను. మీ ప్రేమాభిమానాలు నాకు గొప్ప నిధి లాంటివి. మీలో ఒకడిగా, మీతో కలసి పంచుకునే ఈ క్షణాలు నాకు జీవితాంతం మరపురాని అనుభవాలుగా మిగిలిపోతాయి.

నైజీరియాలోని భారతీయ సమాజ పౌరులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 17th, 07:15 pm

నైజీరియా దేశం అబూజాలో తన గౌరవార్థం స్థానిక భారతీయ సమాజం ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. స్థానిక భారతీయులు అందించిన ఘన స్వాగతనికి, చూపిన ఉత్సాహం, గౌరవాభిమానల పట్ల ఆనందం వెలిబుచ్చిన ప్రధాని, వారి స్నేహమే తనకు పెట్టుబడివంటిదన్నారు.

అయోధ్యలో బాల రాముడి (శ్రీ రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

January 22nd, 05:12 pm

గౌరవనీయమైన వేదిక తో పాటు సాధువులు, ఋషులు అందరూ, ప్రపంచంలోని నలుమూలలో మనందరితో పాటు ఈ దివ్య కార్యక్రమం తో అనుసంధానమవుతున్న రామ భక్తులందరూ., మీ అందరికీ అభినందనలు, అందరికీ రామ్ రామ్.

అయోధ్య లోక్రొత్త గా నిర్మించిన శ్రీ రామ జన్మభూమి మందిర్ లో శ్రీ రామ్ లలా యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

January 22nd, 01:34 pm

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య లో క్రొత్త గా నిర్మించిన శ్రీ రామ్ జన్మభూమి మందిర్ లో ఈ రోజు న జరిగినటువంటి శ్రీ రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణం లో తోడ్పాటు ను అందించిన శ్రమ జీవుల తో శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

The world is recognizing India’s potential and position in global trade: PM Modi

January 17th, 12:12 pm

PM Modi inaugurated three major infrastructure projects worth more than Rs 4,000s crore in Kochi, Kerala. The projects being inaugurated today include New Dry Dock at Cochin Shipyard Limited (CSL), International Ship Repair Facility of CSL, and LPG Import Terminal of IOCL at Puthuvypeen, Kochi. These major infrastructure projects are in line with the PM Modi's vision to transform India's ports, shipping, and waterways sector.

నాలుగు వేల కోట్లరూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయాల సంబంధి పథకాల ను కేరళ లోని కోచి లో దేశప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి

January 17th, 12:11 pm

నాలుగు వేల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన మౌలిక సదుపాయల రంగం సంబంధి ప్రాజెక్టుల ను మూడింటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళ లోని కోచి లో ఈ రోజు న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల లో కొచ్చిన్ శిప్ యార్డ్ లిమిటెడ్ (సిఎస్ఎల్) లో న్యూ డ్రై డాక్ (ఎన్‌డిడి) , సిఎస్ఎల్ లోనే ఇంటర్‌నేశనల్ శిప్ రిపేర్ ఫెసిలిటీ (ఐఎస్ఆర్ఎఫ్) మరియు కోచి లోని పుదువిపీన్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ కు చెందిన ఎల్‌పిజి ఇంపోర్ట్ టర్మినల్ లు భాగం గా ఉన్నాయి. ఈ ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన సంబంధి పథకాలు భారతదేశం లో ఓడరేవుల ను, శిపింగ్ ను మరియు జలమార్గాల రంగాన్ని మెరుగు పరచి సామర్థ్యాన్ని వృద్ధి చేయడం మరియు ఆ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా ఉన్నాయి.

మహారాష్ట్రలోని నాసిక్ లో 27వ జాతీయ యువజన ఉత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం

January 12th, 01:15 pm

మహారాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే జీ, నా మంత్రివర్గ సహచరులు అనురాగ్ ఠాకూర్, భారతీ పవార్, నిశిత్ ప్రామాణిక్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ జీ, ఇతర ప్రభుత్వ మంత్రులు, విశిష్ట ప్రముఖులు, నా యువ స్నేహితులు!

ఇరవై ఏడో జాతీయ యువజనోత్సవాన్ని మహారాష్ట్ర లోనినాసిక్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి

January 12th, 12:49 pm

ఇరవై ఏడో జాతీయ యువజన ఉత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని నాసిక్ లో ఈ రోజు న ప్రారంభించారు. స్వామి వివేకానంద మరియు రాజమాత జీజాబాయి ల చిత్ర పటాని కి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ని ఘటించారు. ‘వికసిత్ భారత్@2047: యువా కే లియే, యువా కే ద్వారా’ అనే ఇతివృత్తం తో సాగిన ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని, మరి రాష్ట్ర బృందం యొక్క మార్చ్ పాస్ట్ ను కూడా ఆయన వీక్షించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రిథమిక్ జిమ్నాస్టిక్స్, మల్లఖంబ్, యోగాసన మరియు జాతీయ యువజనోత్సవ గీతాలాపన చోటు చేసుకొన్నాయి.

India has a glorious history of victories, bravery, knowledge, sciences, skills and our naval strength: PM Modi

December 04th, 04:35 pm

PM Modi attended the program marking ‘Navy Day 2023’ celebrations at Sindhudurg. He also witnessed the ‘Operational Demonstrations’ by Indian Navy’s ships, submarines, aircraft and special forces from Tarkarli beach, Sindhudurg. Also, PM Modi inspected the guard of honor.

PM attends program marking Navy Day 2023 celebrations in Sindhudurg, Maharashtra

December 04th, 04:30 pm

PM Modi attended the program marking ‘Navy Day 2023’ celebrations at Sindhudurg. He also witnessed the ‘Operational Demonstrations’ by Indian Navy’s ships, submarines, aircraft and special forces from Tarkarli beach, Sindhudurg. Also, PM Modi inspected the guard of honor.

డిసెంబరు4వ తేదీ నాడు మహారాష్ట్ర ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

December 02nd, 04:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం లో డిసెంబరు 4 వ తేదీ నాడు మహారాష్ట్ర ను సందర్శించనున్నారు. సాయంత్రం పూట సుమారు 4 గంటల 15 నిమిషాల వేళ లో, ప్రధాన మంత్రి మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ కు చేరుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ప్రతిమ ను ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత, ప్రధాన మంత్రి సింధుదుర్గ్ లో ‘నేవీ డే 2023% ఉత్సవాలకు సూచకం గా ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ప్రధాన మంత్రి సింధుదుర్గ్ ప్రాంత తార్ కర్ లీ సముద్ర తీరం లో భారతీయ నౌకాదళం యొక్క నౌకలు, జలాంతర్గాములు, విమానాలు మరియు ప్రత్యేక బలగాల విశిష్ట విన్యాసాల ను కూడ చూడనున్నారు.

Aatmanirbharta in Defence: India First Soars as PM Modi Takes Flight in LCA Tejas

November 28th, 03:40 pm

Prime Minister Narendra Modi visited Hindustan Aeronautics Limited (HAL) in Bengaluru today, as the state-run plane maker experiences exponential growth in manufacturing prowess and export capacities. PM Modi completed a sortie on the Indian Air Force's multirole fighter jet Tejas.