మార్చి 28న పీఎం ఉత్తరప్రదేశ్‌ పర్యటన

March 26th, 09:52 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 28, 2026న ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 11:30కి గౌతమబుద్ధ నగర్‌లోని జేవార్ వద్దనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, టెర్మినల్ భవనాన్ని పరిశీలిస్తారు. 12 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ఫేజ్-Iను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

మార్చి 8న ఢిల్లీలో రూ. 33,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి

March 06th, 05:23 pm

మార్చి 8వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఢిల్లీలో రూ.33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముందు సరోజినీ నగర్‌లోని జీపీఆర్‌ఏ టైప్-5 వసతి గృహాలను సందర్శించి.. అక్కడ మహిళలకు కేటాయించిన నివాసాల ఇంటి తాళంచెవులను ప్రధానమంత్రి స్వయంగా అందజేస్తారు.