ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు

October 06th, 04:28 pm

న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత పారా అథ్లెట్ బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఈ పోటీల్లో భారత్ అత్యుత్తమ సంఖ్యలో పతకాలను సాధించింది. 6 స్వర్ణాలతో సహా 22 పతకాలను సొంతం చేసుకుని, జాతీయ పారా క్రీడల ప్రయాణంలో సరికొత్త విజయాన్ని నమోదు చేసింది. ఈ తరహా ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మొదటిసారి భారత్‌లో నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారతీయ బృందం బ్రహ్మాండమైన ప్రదర్శన: ప్రధానమంత్రి అభినందనలు

June 02nd, 03:01 pm

దక్షిణ కొరియాలో ఇటీవల నిర్వహించిన 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొని బ్రహ్మాండమైన ప్రదర్శనను ఇచ్చిన భారతీయ దళాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘‘క్రీడాకారుల్లో ప్రతి ఒక్కరి కఠోర శ్రమ, దృఢ సంకల్పం అన్ని పోటీల్లో స్పష్టంగా కనిపించాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

సెపక్ తక్రా వరల్డ్ కప్- 2025లో భారత్ కు తొలి స్వర్ణం: పురుషుల రెగు జట్టుకు ప్రధాని అభినందన

March 26th, 03:59 pm

సెపక్ తక్రా ప్రపంచకప్ 2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత సెపక్ తక్రా జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. భారత్ కు తొలి స్వర్ణాన్ని తెచ్చిపెట్టారంటూ జట్టును ఆయన ప్రశంసించారు.

ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతాకాల క్రీడల్లో 33 పతకాలను గెలిచిన భారతీయ క్రీడాకారులకు ప్రధానమంత్రి అభినందనలు

March 18th, 02:40 pm

ఇటలీలోని ట్యూరిన్‌లో నిర్వహించిన ‘ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతాకాల క్రీడలు 2025’లో విశిష్ట ప్రదర్శనను కనబరచినందుకు భారతీయ క్రీడాకారులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతీయ క్రీడాకారుల బృందం 33 పతకాలను గెలిచి ప్రపంచ వేదికపై భారత్‌ గర్వపడేటట్లు చేసింది.

10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు 2024లో చరిత్రాత్మక ప్రదర్శన చేసిన భారత బృందానికి ప్రధాని అభినందనలు

December 10th, 08:19 pm

కౌలాలంపూర్‌లో జరిగిన 10వ ఆసియా పసిఫిక్ బధిరుల క్రీడలు 2024లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.