నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతిపై ప్రధాని సంతాపం
July 14th, 11:45 am
నైజీరియా మాజీ అధ్యక్షుడు మహమ్మదు బుహారీ మృతిపట్ల భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఆయనతో జరిగిన సమావేశాలను, సంభాషణలను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. మహమ్మదు బుహారీ మేధస్సు, ఆత్మీయత, భారత్ - నైజీరియా మైత్రిపట్ల ఆయనకు గల అచంచలమైన నిబద్ధత చెప్పుకోదగ్గవన్నారు. మహమ్మదు బుహారీ కుటుంబానికి, నైజీరియా ప్రభుత్వానికి, ప్రజలకు... 140 కోట్ల భారతీయుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు శ్రీ మోదీ పేర్కొన్నారు.