ఫిన్లాండ్ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో భారత్‌-ఫిన్లాండ్ సంయుక్త ప్రకటన

March 05th, 08:03 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 4వ తేదీన ఢిల్లీ చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ అలెగ్జాండర్ స్టూబ్‌ 7వ తేదీవరకూ భారత్‌లో పర్యటిస్తారు. ప్రస్తుత హోదాలో తొలిసారి మన దేశానికి వచ్చిన ఆయన ప్రధానంగా న్యూఢిల్లీ, ముంబయి నగరాలను సందర్శిస్తారు. ఆయనతోపాటు ఫిన్లాండ్ వాతావరణ-పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి సారీ ముల్తాలా, ఉపాధి శాఖ మంత్రి శ్రీ మాటియస్ మార్టినెన్ సహా ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో 5వ తేదీన న్యూఢిల్లీలో 11వ దఫా రైసినా చర్చలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు స్టూబ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రధానోపన్యాసం చేశారు. భారత్‌ గత నెల ఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో పాల్గొన్న నేపథ్యంలో అధ్యక్షుడు స్టూబ్‌ ఇప్పుడు పర్యటిస్తున్నారు.

ప్రధానితో స్లోవాక్ దేశాధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని భేటీ

February 20th, 09:37 pm

ఢిల్లీలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ‌తో స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ పీటర్ పెల్లెగ్రిని సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన ఈ భేటీ అత్యంత ఫలప్రదంగా సాగింది.