ఇటలీ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

May 20th, 07:21 pm

అత్యున్నత స్థాయి సమావేశాలు వేగవంతం కావడాన్నీ, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన వృద్ధినీ, వైవిధ్యాన్నీ ఇద్దరు ప్రధానమంత్రులు స్వాగతించారు. భారత్-ఇటలీ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకు వెళ్లేందుకు వారు అంగీకరించారు. బహుపాక్షిక కార్యక్రమాల సందర్భంగా వార్షిక మంత్రిత్వ స్థాయి, సంస్థాగత స్థాయి సమావేశాలతో సహా నాయకుల వార్షిక సమావేశాలను కూడా నిర్వహించేందుకు వారు అంగీకరించారు.

కీలక కార్యక్రమాల నిమిత్తం ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ

May 20th, 12:30 am

ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితమే ఇటలీలోని రోమ్‌కు చేరుకున్నారు. ఆయన ఇటలీ గణతంత్ర అధ్యక్షులు శ్రీ సెర్గియో మట్టరెల్లాను మర్యాదపూర్వకంగా కలుస్తారు; అలాగే ప్రధానమంత్రి మెలోనితో చర్చలు జరుపుతారు. ఈ చర్చలు ప్రధానంగా ‘భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్’ (IMEC) పై కేంద్రీకృతమై ఉంటాయి.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ప్రధానమంత్రి భేటీ

February 26th, 08:56 pm

భారత్ - ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలపై వారు సమగ్రమైన చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని, స్నేహాన్ని ప్రతిబింబిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను శాంతి, ఆవిష్కరణ, అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ స్థాయి పెంపు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర ప్రయోజనాల కలయికకు, సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం ఇరు దేశాలకున్న ఉమ్మడి దార్శనికతకు చిహ్నంగా నిలుస్తుంది.