ఆది శంకరాచార్యకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

April 21st, 01:09 pm

భారత్ మహనీయ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ఆది శంకరాచార్య జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆది శంకరాచార్య లోతైన బోధనలు, ఆలోచనలు, అద్వైత వేదాంత తత్త్వం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకంగా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు. ఆధ్యాత్మిక చింతనను పునరుత్తేజితం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలూ, దేశమంతటా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రాలూ కలకాలం స్ఫూర్తినిస్తాయన్నారు. ‘‘ఆయన జ్ఞ‌ానం మనకు దారి దీపంగా నిలవాలనీ, సత్యం, దయలతో పాటు సకల వర్గాల శ్రేయస్సుకు పాటుపడాలన్న మన నిబద్ధతను బలోపేతం చేయాలనీ కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

April 20th, 09:43 am

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ప్రధాని నివాళి

April 14th, 11:33 am

ఈ రోజు ఉదయం పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

జలియన్‌వాలా బాగ్ అమరులకు ప్రధానమంత్రి నివాళులు

April 13th, 09:39 am

జలియన్‌వాలా బాగ్‌లో తమ ధైర్య సాహసాల్ని చాటి అమరులైన వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకుంటూ, నివాళులు అర్పించారు. వారు చేసిన త్యాగం మన ప్రజల అజేయ స్ఫూర్తికి ఒక శక్తిమంతమైన ప్రమాణంగా నిలిచి ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.

పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మా పూలేకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

April 11th, 11:48 am

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ప్రకాశ్ పర్వ్ వేళ శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ప్రధానమంత్రి గౌరవ పూర్వక శ్రద్ధాంజలి

April 07th, 10:52 am

ఈ రోజు పవిత్ర ప్రకాశ్ పర్వ్.. ఈ సందర్భంగా, శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ ప్రపత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు.

శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీకి నివాళి అర్పించిన ప్రధాని

March 31st, 10:58 am

శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ సేవ, ఆధ్యాత్మికతలకు జీవితాన్ని అంకితం చేశారని, సమాజంపై చెరగని ముద్ర వేశారని శ్రీ మోదీ కొనియాడారు. పూజ్య స్వామీజీ అనేక సంస్థలను, పరిశోధన కేంద్రాలను స్థాపించారని, ప్రజల్లో విద్యావ్యాప్తిని పెంచడానికి ఎంతో నిబద్ధతతో కృషి చేశారని ప్రధానమంత్రి అన్నారు.

శ్యా‌మ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

March 30th, 09:50 am

భరత మాత వీర పుత్రుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్యామ్‌జీ కృష్ణ వర్మ విప్లవాత్మక ఆలోచనలతో స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక కొత్త చైతన్యాన్ని అందించారని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన జీవితం, ఆయన ఆదర్శాలు దేశానికి సేవలను అందించే దిశగా ప్రతి ఒక్క తరానికీ స్ఫూర్తిని ఇస్తున్నాయ’’ని శ్రీ మోదీ అన్నారు.

దండి యాత్రలో పాల్గొన్న వారికి ప్రధానమంత్రి నివాళులు సత్యానిదే జయమని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 12th, 10:34 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. 1930వ సంవత్సరం ఇదే రోజు మొదలైన దండి యాత్రలో పాల్గొన్న మహనీయులందరికీ నివాళులు అర్పించారు.

గొప్ప సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్‌కు నివాళులర్పించిన ప్రధానమంత్రి

February 15th, 02:49 pm

మహా సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులర్పించారు. “సత్యం, అహింస, ఉన్నతమైన నైతిక విలువల సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయన సమాజంలో సరికొత్త చైతన్యాన్ని నింపారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం దేశ ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జీకి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

February 11th, 10:19 am

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆదర్శాలూ, విలువలపై ఆధారపడిన ఆయన ఆలోచనలూ దేశంలో ప్రతి తరానికీ మార్గదర్శనం చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

February 01st, 09:15 am

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారు న్యాయాన్నీ, కరుణనీ ఇతర అన్ని భావనల కన్నా మిన్నగా తలచారనీ, ప్రజల సంక్షేమానికి మేం అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ భావనలే ఆధారంగా ఉన్నాయనీ శ్రీ మోదీ వివరించారు. ‘‘ఆయన వెలిగించిన సామాజిక సామరస్యం, సద్భావనల జ్యోతి దేశ ప్రజలు నడిచే దారిని ఎప్పటికీ ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

జాతిపిత మహాత్మాగాంధీకి రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

January 30th, 01:54 pm

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. బాపూజీ ఆశయాలు దేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామనీ, న్యాయం, సామరస్యం, మానవ సేవతో కూడిన భారతదేశ నిర్మాణానికి మా నిబద్ధతను ప్రకటిస్తున్నాం అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

జాతిపిత మహాత్మాగాంధీకి ప్రధానమంత్రి నివాళి

January 30th, 10:41 am

జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. స్వదేశీ భావనకు బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారని, ఇదే అభివృద్ధి చెందిన, స్వావలంబన సాధించిన భారత్ అనే సంకల్పానికి మూలాధారమని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన వ్యక్తిత్వం, చేసిన పనులు కర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలను ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్‌కి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

January 28th, 09:35 am

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. తల్లి భారతి బానిసత్వ సంకెళ్లు తెంచివేయడానికి ఆయన తన సర్వస్వాన్నీ ధారపోశారని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన జీవితం దేశంలో ప్రతి తరానికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు’’ అని శ్రీ మోదీ అన్నారు.

పార్వతీ గిరి జీ శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు

January 19th, 11:00 am

పార్వతీ గిరి జీ శత జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. వలసవాద పాలనను ముగించడానికి చేపట్టిన ఉద్యమంలో ఆమె పోషించిన పాత్రనూ, సమాజ సేవతో పాటు ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారిత, సంస్కృతి వంటి రంగాల్లో ఆమె చేసిన కృషినీ శ్రీ మోదీ ప్రశంసించారు.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని

January 12th, 09:17 am

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళి అర్పించారు. అభివృద్ధి చెందిన భారత్ సాధించాలనే సంకల్పానికి అవసరమైన శక్తిని స్వామి వివేకానంద వ్యక్తిత్వం, రచనలు అందిస్తూనే ఉంటాయని శ్రీ మోదీ అన్నారు. ‘‘ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు నూతన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని జాతీయ యువజన దినోత్సవం అందిస్తుందని ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దేశ సామూహిక చేతనను మేల్కొలపడంలో సోమనాథ్ ధామ్‌ది శాశ్వత భూమిక.. సుభాషితం ద్వారా స్పష్టం చేసిన ప్రధానమంత్రి

January 09th, 08:44 am

పవిత్ర సోమనాథ్ ధామంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. దేశ సామూహిక చేతనను మేల్కొలపడంలో సోమనాథ్ ధామ్ పోషిస్తున్న శాశ్వత పాత్రను ఆయన ప్రస్తావించారు.

భారత రత్న మహామన పండిట్ శ్రీ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

December 25th, 08:41 am

భారతరత్న మహామన పండిట్‌ శ్రీ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- మాతృభూమి సేవకే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారని కొనియాడారు. అలాగే “బానిసత్వ శృంఖలాల నుంచి దేశమాత విముక్తి కోసం సామాజిక సంస్కరణల దిశగా కృషి చేయడంతోపాటు జాతీయ చైతన్యం రగుల్కొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ విద్యా రంగాన్ని సుసంపన్నం చేయడంలో ఆ మహనీయుడి అసమాన కృషి చిరస్మరణీయం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి గురు పూజ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

October 30th, 12:35 pm

పూజ్యులు పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి గురు పూజ వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు.