Prime Minister shares Sanskrit Subhashitam emphasising on the triumph of truth

March 12th, 10:34 am

PM Modi paid homage to all the great personalities who participated in the Dandi March, which began on this very day in 1930. He also shared a Sanskrit verse conveying that the truth always prevails and falsehood is ultimately destroyed, emphasising that one should follow the path on which the sages attained bliss and realised the supreme truth.

గొప్ప సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్‌కు నివాళులర్పించిన ప్రధానమంత్రి

February 15th, 02:49 pm

మహా సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులర్పించారు. “సత్యం, అహింస, ఉన్నతమైన నైతిక విలువల సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయన సమాజంలో సరికొత్త చైతన్యాన్ని నింపారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం దేశ ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జీకి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

February 11th, 10:19 am

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆదర్శాలూ, విలువలపై ఆధారపడిన ఆయన ఆలోచనలూ దేశంలో ప్రతి తరానికీ మార్గదర్శనం చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

February 01st, 09:15 am

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారు న్యాయాన్నీ, కరుణనీ ఇతర అన్ని భావనల కన్నా మిన్నగా తలచారనీ, ప్రజల సంక్షేమానికి మేం అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ భావనలే ఆధారంగా ఉన్నాయనీ శ్రీ మోదీ వివరించారు. ‘‘ఆయన వెలిగించిన సామాజిక సామరస్యం, సద్భావనల జ్యోతి దేశ ప్రజలు నడిచే దారిని ఎప్పటికీ ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

జాతిపిత మహాత్మాగాంధీకి రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

January 30th, 01:54 pm

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. బాపూజీ ఆశయాలు దేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామనీ, న్యాయం, సామరస్యం, మానవ సేవతో కూడిన భారతదేశ నిర్మాణానికి మా నిబద్ధతను ప్రకటిస్తున్నాం అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

జాతిపిత మహాత్మాగాంధీకి ప్రధానమంత్రి నివాళి

January 30th, 10:41 am

జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. స్వదేశీ భావనకు బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారని, ఇదే అభివృద్ధి చెందిన, స్వావలంబన సాధించిన భారత్ అనే సంకల్పానికి మూలాధారమని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన వ్యక్తిత్వం, చేసిన పనులు కర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలను ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్‌కి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

January 28th, 09:35 am

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. తల్లి భారతి బానిసత్వ సంకెళ్లు తెంచివేయడానికి ఆయన తన సర్వస్వాన్నీ ధారపోశారని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన జీవితం దేశంలో ప్రతి తరానికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు’’ అని శ్రీ మోదీ అన్నారు.

పార్వతీ గిరి జీ శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు

January 19th, 11:00 am

పార్వతీ గిరి జీ శత జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. వలసవాద పాలనను ముగించడానికి చేపట్టిన ఉద్యమంలో ఆమె పోషించిన పాత్రనూ, సమాజ సేవతో పాటు ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారిత, సంస్కృతి వంటి రంగాల్లో ఆమె చేసిన కృషినీ శ్రీ మోదీ ప్రశంసించారు.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని

January 12th, 09:17 am

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళి అర్పించారు. అభివృద్ధి చెందిన భారత్ సాధించాలనే సంకల్పానికి అవసరమైన శక్తిని స్వామి వివేకానంద వ్యక్తిత్వం, రచనలు అందిస్తూనే ఉంటాయని శ్రీ మోదీ అన్నారు. ‘‘ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు నూతన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని జాతీయ యువజన దినోత్సవం అందిస్తుందని ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దేశ సామూహిక చేతనను మేల్కొలపడంలో సోమనాథ్ ధామ్‌ది శాశ్వత భూమిక.. సుభాషితం ద్వారా స్పష్టం చేసిన ప్రధానమంత్రి

January 09th, 08:44 am

పవిత్ర సోమనాథ్ ధామంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. దేశ సామూహిక చేతనను మేల్కొలపడంలో సోమనాథ్ ధామ్ పోషిస్తున్న శాశ్వత పాత్రను ఆయన ప్రస్తావించారు.

భారత రత్న మహామన పండిట్ శ్రీ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

December 25th, 08:41 am

భారతరత్న మహామన పండిట్‌ శ్రీ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- మాతృభూమి సేవకే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారని కొనియాడారు. అలాగే “బానిసత్వ శృంఖలాల నుంచి దేశమాత విముక్తి కోసం సామాజిక సంస్కరణల దిశగా కృషి చేయడంతోపాటు జాతీయ చైతన్యం రగుల్కొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ విద్యా రంగాన్ని సుసంపన్నం చేయడంలో ఆ మహనీయుడి అసమాన కృషి చిరస్మరణీయం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి గురు పూజ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

October 30th, 12:35 pm

పూజ్యులు పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి గురు పూజ వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు.

నానాజీ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి

October 11th, 10:00 am

నానాజీ దేశ్‌ముఖ్ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. దార్శనికత గల సామాజిక సంస్కర్త, జాతి నిర్మాత.. స్వావలంబన, గ్రామీణ సాధికారత కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తిగా నానాజీ దేశ్‌ముఖ్‌ను ఆయన అభివర్ణించారు. ఆయన జీవితం.. అంకితభావం, క్రమశిక్షణ, సమాజ సేవకు ప్రతిరూపమని ప్రధాని అన్నారు.

Prime Minister pays homage to Loknayak Jayaprakash Narayan on his birth anniversary

October 11th, 09:30 am

The Prime Minister, Shri Narendra Modi paid tributes to Loknayak Jayaprakash Narayan on his birth anniversary. The Prime Minister described him as one of India’s most fearless voices of conscience and a tireless champion for democracy and social justice.

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని

October 02nd, 07:52 am

జాతిపిత మహాత్మా‌గాంధీ జయంతి సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.

Prime Minister pays tributes to all people who took part in Quit India Movement

August 09th, 08:44 am

The Prime Minister, Shri Narendra Modi today paid tributes with deep gratitude to all brave people who took part in the Quit India Movement under the inspiring leadership of Mahatma Gandhi.

సర్ గంగారాం ఆసుపత్రిలో శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించిన ప్రధాని

August 04th, 02:17 pm

శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించేందుకు సర్ గంగారాం ఆసుపత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు.

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

July 27th, 09:43 am

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళులర్పించారు. కలాం ఒక స్ఫూర్తిదాయకమైన దార్శనికుడు, అత్యుత్తమ శాస్త్రవేత్త, గురువు, గొప్ప దేశభక్తుడిగా గుర్తుండిపోతారని ప్రధాని అన్నారు.

శ్రీ కె.కామరాజ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

July 15th, 10:50 am

శ్రీ కె. కామరాజ్ గారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఈ రోజు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కామరాజ్ గారి ఉదాత్తమైన ఆదర్శాలతో పాటు సామాజిక న్యాయ సాధనకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం...మనకు ఎంతో ప్రేరణనిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.

నమీబియా జాతిపిత.. తొలి అధ్యక్షుడు డాక్టర్ సామ్ నుజోమాకు హీరోస్ ఎకర్ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి

July 09th, 07:42 pm

నమీబియా జాతిపిత.. ఆ దేశ తొలి అధ్యక్షుడు డాక్టర్ సామ్ నుజోమాకు హీరోస్ ఎకర్ స్మారక చిహ్నం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.