జాతీయ రోప్‌వేల అభివృద్ధి కార్యక్రమం ‘పర్వతమాల పరియోజన’లో భాగంగా

March 05th, 03:08 pm

గోవింద్‌ఘాట్ నుంచి హేమ్‌కుండ్ సాహిబ్ జీ వరకు 12.4 కిలోమీటర్ల మేర రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.2,730.13 కోట్ల మొత్తం మూలధన వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు.