న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన భారత్ – రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధాని ప్రసంగం

December 05th, 03:45 pm

భారత్ - రష్యా బిజినెస్ ఫోరంలో, ఇంతపెద్ద ప్రతినిధి బృందంతో నేడు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చూపిన చొరవ అత్యంత కీలకమైనదిగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. నేడు మీ అందరి మధ్య ఉండడం చాలా సంతోషాన్నిస్తోంది. ఈ ఫోరంలో పాల్గొని తన విలువైన అభిప్రాయాలను పంచుకున్న నా మిత్రుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వ్యాపారం కోసం సరళీకృత సానుకూల యంత్రాంగాలను ఏర్పాటు చేస్తున్నాం. భారత్, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య ఎఫ్‌టీఏపై చర్చలు మొదలయ్యాయి.

రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్‌తో కలసి భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 05th, 03:30 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్‌ కూడా పాల్గొన్నారు. తన ప్రసంగంలో అధ్యక్షుడు పుతిన్‌కు, దేశవిదేశాలకు చెందిన నాయకులకు, విశిష్ట అతిథులకు ప్రధాని నమస్కరించారు. అతి పెద్ద ప్రతినిధి బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్ చూపిన చొరవను ఈ బిజినెస్ ఫోరం ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ స్వాగతం పలుకుతూ.. వారి మధ్య ఉండటం తనకు ఆనందాన్నిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, విలువైన సూచనలను అందించిన తన స్నేహితుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వాణిజ్యానికి సరళమైన, విశ్వసనీయమైన వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే, భారత్, యురేషియన్ ఆర్థిక సంఘంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు.

స్వదేశీ ఉత్పత్తులు, వోకల్ ఫర్ లోకల్ : మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పండుగ పిలుపు

September 28th, 11:00 am

ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, భగత్ సింగ్ మరియు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వారికి నివాళులర్పించారు. భారతీయ సంస్కృతి, మహిళా సాధికారత, దేశవ్యాప్తంగా జరుపుకునే వివిధ పండుగలు, ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల ప్రయాణం, పరిశుభ్రత మరియు ఖాదీ అమ్మకాల పెరుగుదల వంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. దేశాన్ని స్వావలంబన చేసుకునే మార్గం స్వదేశీని స్వీకరించడంలోనే ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.

జాతీయ పురస్కారాలందుకున్న ఉపాధ్యాయుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 04th, 05:35 pm

మన సంప్రదాయంలో ఉపాధ్యాయులపై సహజమైన గౌరవం ఉంది. వారు సమాజానికి గొప్ప బలం కూడా. ఉపాధ్యాయులను ఆశీర్వాదాల కోసం నిలబడేలా చేయడం తప్పు. నేను అలాంటి పాపం చేయాలనుకోను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరినీ కలవడం నాకు అద్భుతమైన అనుభవం. మీలో ప్రతి ఒక్కరికి మీ సొంత కథ ఉండి ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా మీరు ఈ స్థాయికి చేరుకునేవారు కాదు. ఆ కథలన్నింటినీ తెలుసుకోవడానికి తగినంత సమయం దొరకడం కష్టం. కానీ మీ నుంచి నేను నేర్చుకోగలిగినది నిజంగా స్ఫూర్తిదాయకం.. దాని కోసం నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ జాతీయ పురస్కారం అందుకోవడం ముగింపు కాదు. ఈ పురస్కారం అందుకున్న తర్వాత అందరి దృష్టి మీపైనే ఉంటుంది. దీని అర్థం మీ పరిధి గణనీయంగా విస్తరించింది. గతంలో మీ ప్రభావం, ఆదేశం పరిధి పరిమితమే. ఇప్పుడు ఈ గుర్తింపు తర్వాత అది చాలా విస్తృతంగా పెరుగుతుంది. ఇది ప్రారంభం అని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీలో ఉన్న ప్రతిభను మీరు వీలైనంత వరకు అందరితో పంచుకోవాలి. మీరు అలా చేస్తే మీలో సంతృప్తి పెరుగుతుంది. మీరు ఆ దిశలో కృషి చేస్తూనే ఉండాలి. ఈ పురస్కారానికి మీరు ఎంపిక కావడం మీ కృషికి, నిరంతర అంకితభావానికి నిదర్శనం. అందుకే ఇది సాధ్యమైంది. ఒక ఉపాధ్యాయుడు వర్తమానానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తు తరాలను కూడా రూపొందిస్తాడు.. భవిష్యత్తును మెరుగుపరుస్తాడు. ఇది దేశానికి చేసే సేవ కంటే తక్కువ కాదని నేను నమ్ముతున్నాను. నేడు మీవంటి కోట్లాది మంది ఉపాధ్యాయులు అదే దేశభక్తి, నిజాయితీ, అంకితభావంతో దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. అందరికీ ఇక్కడికి వచ్చే అవకాశం లభించకపోవచ్చు. బహుశా చాలామంది ప్రయత్నించి ఉండకపోవచ్చు.. కొందరు గమనించి ఉండకపోవచ్చు. అలాంటి సామర్థ్యాలు గల ఉపాధ్యాయులు అనేకమంది ఉన్నారు. వారందరి సమిష్టి కృషి వల్లే దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.. భావి తరాలూ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. దేశం కోసం జీవించే అందరి సహకారం దీనిలో ఉంటుంది.

Prime Minister Narendra Modi addresses National Awardee Teachers

September 04th, 05:33 pm

During a meeting with National Awardee Teachers, PM Modi remarked that teachers shape not only the present but also the future generation, highlighting India’s guru-disciple tradition. He announced that from 22nd September, the GST reforms will take effect, making essentials cheaper for millions of families. The PM emphasized that every home adopt Swadeshi, with teachers promoting it in schools.

25 మే 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 122 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 25th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం... నేడు యావద్దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితమై ఉంది. ఆగ్రహంతో ఉంది. సంకల్పబద్ధంగా ఉంది. నేడు ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే. మిత్రులారా! 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మన సైన్యాలు చూపిన పరాక్రమం ప్రతి హిందుస్థానీ శిరస్సును ఉన్నతంగా నిలిపింది. సరిహద్దు దాటి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో మన సైన్యాలు చూపిన ఖచ్చితత్వం, స్పష్టత అద్భుతం. 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది.

'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

September 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

పిఎం శ్రీ నరేంద్ర మోదీ యు ట్యూబ్ ప్రయాణం : 15 సంవత్సరాల గ్లోబల్ ప్రభావం

September 27th, 11:29 pm

మీ యు ట్యూబ్ సహచరుడుగా నేను ఈ రోజు మీ మధ్య ఉండడం ఆనందదాయకం. నేను కూడా మీ వంటి వాడినే. అంతకన్నా వేరు కాదు. గత 15 సంవత్సరాలుగా యు ట్యూబ్ చానెల్ ద్వారా నేను కూడా దేశంతో అనుసంధానమై ఉన్నాను. నాకు కూడా మంచి సంఖ్యలోనే సబ్ స్క్రయిబర్లున్నారు.

‘భారత యూట్యూబ్‌ అభిమానుల వేడుక-2023’ సందర్భంగా యూట్యూబర్లను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

September 27th, 11:23 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ‘యూట్యూబ్ ఫ్యాన్‌ఫెస్ట్ ఇండియా-2023’ కార్యక్రమంలో ‘యూట్యూబర్ల’నుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా యూట్యూబ్‌తో తన అనుబంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్త ప్రభావం సృష్టించడంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.

యశోభూమిని జాతికి అంకితం చేసి, పిఎం విశ్వకర్మ పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

September 17th, 06:08 pm

నేడు భగవాన్ విశ్వకర్మ జయంతి మహోత్సవం. మన సాంప్రదాయిక కళాకారులు, హస్తకళాకారులకు ఈ రోజు అంకితం. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ నా హృద‌యపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వకర్మ మిత్రులతో కూడా ఈ సందర్భంగా అనుసంధానం అయ్యే అవకాశం నాకు కలిగింది. కొద్ది సమయం క్రితమే నేను విశ్వకర్మ సోదరసోదరీమణులతో నేను సంభాషించాను. వారితో సంభాషిస్తూ ఉండడం వల్లనే నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా అద్భుతమైనది, అది వదిలి వెళ్లాలని నేను భావించలేకపోయాను. దాన్ని సందర్శించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రదర్శన మరో రెండు మూడు రోజులుంటుందని నాకు చెప్పారు. ప్రదర్శనను సందర్శించాలని నేను ఢిల్లీ ప్రజలను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.

న్యూఢిల్లీలో భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి

September 17th, 12:15 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం’ (ఐసిఇసి) ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అద్భుతమైన సదస్సుల వేదిక, బహుళ ప్రదర్శనశాలలు, ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. మరోవైపు విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారుల కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది. అలాగే ‘పీఎం విశ్వకర్మ’ లోగో, నినాదం, పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపుల ఫలకం, ఉపకరణసమూహ కరదీపికలతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

With the spirit of Vocal for Local, the citizens are buying indigenous products wholeheartedly and it has become a mass movement: PM Modi

August 07th, 04:16 pm

PM Modi addressed the National Handloom Day Celebration at Bharat Mandapam. The Prime Minister expressed satisfaction that the schemes implemented for the textile sector are becoming a major means of social justice as he pointed out that lakhs of people are engaged in handloom work in villages and towns across the country.

న్యూ ఢిల్లీ లో జాతీయ చేనేత దినం ఉత్సవం కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 07th, 12:30 pm

జాతీయ చేనేత దినం ఉత్సవాన్ని ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో నిర్వహించగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫేశన్ టెక్నాలజీ రూపుదిద్దిన ఇ-పోర్టల్ అయిన ‘భారతీయ వస్త్ర ఏవమ్ శిల్ప కోశ్ - ఎ రిపాజిటరి ఆఫ్ టెక్స్ టైల్స్ ఎండ్ క్రాఫ్ట్స్’ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను సైతం ప్రధాన మంత్రి సందర్శించి, నేతకారుల తో మాట్లాడారు.

నవంబర్ 19వ తేదీ నాడు అరుణాచల్ ప్రదేశ్ ను మరియు ఉత్తర్ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

November 17th, 03:36 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర 2022 నవంబర్ 19వ తేదీ నాడు అరుణాచల్ ప్రదేశ్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. ఆ రోజు న ఉదయం ఇంచుమించు 9:30 గంటల కు ప్రధాన మంత్రి ఈటానగర్ లో డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. 600 ఎమ్ డబ్ల్యు సామర్థ్యం కలిగినటువంటి కామెంగ్ జల విద్యుత్తు కేంద్రాన్ని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసి కి చేరుకొని, అక్కడ మధ్యాహ్నం పూట దాదాపు 2 గంటల వేళ లో ‘కాశీ తమిళ్ సంగమం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రపంచం అంగీకరించింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

September 25th, 11:00 am

ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.

Those who do politics of short-cut never build new airports, highways, medical colleges: PM

July 12th, 03:56 pm

Prime Minister Narendra Modi today addressed a public meeting in Deoghar, Jharkhand. PM Modi started his address by recognising the enthusiasm of people. PM Modi said, “The way you have welcomed the festival of development with thousands of diyas, it is wonderful. I am experiencing the same enthusiasm here as well.”

PM Modi addresses public meeting in Deoghar, Jharkhand

July 12th, 03:54 pm

Prime Minister Narendra Modi today addressed a public meeting in Deoghar, Jharkhand. PM Modi started his address by recognising the enthusiasm of people. PM Modi said, “The way you have welcomed the festival of development with thousands of diyas, it is wonderful. I am experiencing the same enthusiasm here as well.”

మణిపూర్ 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 21st, 10:31 am

మణిపుర్ 50వ స్థాపన దినం సందర్భం లో మణిపుర్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయన మాట్లాడుతూ, ఈ వైభవోపేతమైనటువంటి ప్రస్థానాని కి తోడ్పాటు ను అందించిన ప్రతి ఒక్క వ్యక్తి చేసిన ప్రయాసల కు మరియు త్యాగాల కు నమస్సుల ను సమర్పించారు. మణిపుర్ చరిత్ర లో అనుకూలత లు, ప్రతికూలత లు ఎదురైన వేళ ఆ రాష్ట్ర ప్రజలు కనబరచినటువంటి ఐకమత్యం, సంయమనం వారి నిజమైన శక్తి అని ఆయన అన్నారు. మణిపుర్ రాష్ట్ర ప్రజల ఆశల, ఆకాంక్షల గురించి స్వయం గా తెలుసుకొనే ప్రయత్నాల ను తాను కొనసాగిస్తూ ఉంటానని, ఈ ప్రయత్నాలు వారి భావనల ను, వారి ఆకాంక్షల ను ఉత్తమమైన పద్ధతి లో అర్థం చేసుకోవడాని కి, అలాగే రాష్ట్రం సమస్యల ను పరిష్కరించే మార్గాల ను అన్వేషించడానికి తోడ్పడ్డాయి అని ఆయన పునరుద్ఘాటించారు. శాంతి అనేటటువంటి వారి మహత్తర ఆశయాన్ని మణిపుర్ ప్రజలు నెరవేర్చుకోగలగడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘మణిపుర్ కు బందుల బారి నుంచి, దిగ్బంధాల బారి నుంచి విముక్తిని పొంది శాంతి ని మరియు స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడానికి అర్హత ఉన్నది’’ అని ఆయన అన్నారు.

మణిపుర్ 50వ రాష్ట్ర స్థాపన దినం నాడు ప్రధాన మంత్రి చేసినప్రసంగం

January 21st, 10:30 am

మణిపుర్ 50వ స్థాపన దినం సందర్భం లో మణిపుర్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయన మాట్లాడుతూ, ఈ వైభవోపేతమైనటువంటి ప్రస్థానాని కి తోడ్పాటు ను అందించిన ప్రతి ఒక్క వ్యక్తి చేసిన ప్రయాసల కు మరియు త్యాగాల కు నమస్సుల ను సమర్పించారు. మణిపుర్ చరిత్ర లో అనుకూలత లు, ప్రతికూలత లు ఎదురైన వేళ ఆ రాష్ట్ర ప్రజలు కనబరచినటువంటి ఐకమత్యం, సంయమనం వారి నిజమైన శక్తి అని ఆయన అన్నారు. మణిపుర్ రాష్ట్ర ప్రజల ఆశల, ఆకాంక్షల గురించి స్వయం గా తెలుసుకొనే ప్రయత్నాల ను తాను కొనసాగిస్తూ ఉంటానని, ఈ ప్రయత్నాలు వారి భావనల ను, వారి ఆకాంక్షల ను ఉత్తమమైన పద్ధతి లో అర్థం చేసుకోవడాని కి, అలాగే రాష్ట్రం సమస్యల ను పరిష్కరించే మార్గాల ను అన్వేషించడానికి తోడ్పడ్డాయి అని ఆయన పునరుద్ఘాటించారు. శాంతి అనేటటువంటి వారి మహత్తర ఆశయాన్ని మణిపుర్ ప్రజలు నెరవేర్చుకోగలగడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘మణిపుర్ కు బందుల బారి నుంచి, దిగ్బంధాల బారి నుంచి విముక్తిని పొంది శాంతి ని మరియు స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడానికి అర్హత ఉన్నది’’ అని ఆయన అన్నారు.