హల్వారా విమానాశ్రయంలో టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని... పంజాబ్ ప్రజలకు.. ముఖ్యంగా లూధియానా, పరిసర ప్రాంత వాసులకు ఇది సంతోషదాయక క్షణమని వ్యాఖ్య

February 01st, 07:18 pm

హల్వారా విమానాశ్రయంలో టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం పంజాబ్ ప్రజలకూ.. ముఖ్యంగా లూథియానా, పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యంత సంతోషదాయకమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర భారతదేశంలో లూథియానా ఒక కీలక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రమని, ఈ నగరానికి వైమానిక అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఆధునిక విమానాశ్రయం కోసం జరుగుతున్న పనులు ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతున్నాయన్నారు.