ప్రధానమంత్రితో భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ భేటీ
February 16th, 08:16 pm
భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశంలో వారు అనేక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సామాజిక సామరస్యం, సోదరభావం, విద్యను మెరుగుపరచడానికి గ్రాండ్ ముఫ్తీ చేసిన ప్రశంసనీయమైన ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.