అక్టోబరు 29న ముంబయిలో పర్యటించనున్న ప్రధానమంత్రి

October 27th, 10:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 29న సాయంత్రం ముంబయిలో పర్యటించనున్నారు. ముంబయిలోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇండియా మారిటైమ్ వీక్-2025లో సుమారు 4 గంటల వేళకు ఆయన మారిటైమ్ లీడర్స్ కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గ్లోబల్ మారిటైమ్ సీఈఓ ఫోరానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు.