చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్ ఫాంట్ కు ఢిల్లీలో ప్రధానమంత్రి ఆతిథ్యం

April 01st, 09:33 pm

భారత్-చిలీ భాగస్వామ్యంలో మరో కీలక అడుగుకి సంకేతంగా చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్ ఫాంట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో సాదర స్వాగతం పలికారు. లాటిన్ అమెరికాలో భారత్ కు చిలీ కీలక భాగస్వామి అని, అధ్యక్షుడు బోరిక్ కు ఆతిథ్యం ఇవ్వడం సంతోషాన్నిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.

భారత్ లో చిలీ రాష్ట్రపతి అధికారిక పర్యటన (2025, ఏప్రిల్ 01-05): ప్రభావం

April 01st, 06:45 pm

అంటార్కిటికా సహకారం పై ఆసక్తి వ్యక్తీకరణ

భారత్ - చిలీ సంయుక్త ప్రకటన (ఏప్రిల్ 01, 2025)

April 01st, 06:11 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చిలీ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయ గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ ఈ నెల 1 నుంచి 5వ తేదీ వ‌ర‌కూ భార‌త్‌లో తొలిసారి అధికారిక‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. రెండు దేశాల మధ్య దౌత్య‌సంబంధాల‌కు 76 ఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో ఆయ‌న మ‌న దేశాన్ని సంద‌ర్శించ‌డం విశేషం. అధ్యక్షుడు బోరిక్‌తోపాటు విదేశీ వ్యవహారాలు, వ్యవసాయం, గ‌నులు, మహిళలు-లింగ సమానత్వం-సంస్కృతులు, కళలు-వారసత్వం శాఖల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ అధికారులు సహా పెద్ద సంఖ్యలో అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. భారత్‌ రాజధాని న్యూఢిల్లీతోపాటు ఆగ్రా, ముంబయి, బెంగళూరు నగరాలను కూడా బోరిక్ సందర్శిస్తారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో 2024 నవంబరు నాటి జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు బోరిక్, ప్రధాని మోదీ మొదటిసారి కలుసుకున్నారు.

చిలీ దేశాధ్యక్షుడితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ

November 20th, 08:36 pm

బ్రెజిల్ దేశ రాజధాని రియో డి జనీరోలో ఏర్పాటైన జి-20 సమావేశాల నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న చిలీ దేశపు అధ్యక్షుడు శ్రీ గాబ్రియల్ బోరిక్ ఫాంట్ తో తొలిసారి భేటీ అయ్యారు.