క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులకు ప్రధాని నివాళి

August 09th, 10:32 am

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వారు చూపిన ధైర్యసాహసాలకూ, దృఢ సంకల్పానికీ నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చిన పిలుపు స్వాతంత్ర్య పోరాటంలో నూతనోత్తేజాన్ని నింపిందనీ, వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని ప్రతిబింబించిందని శ్రీ మోదీ అన్నారు.

జీవితంలో మీ ఉత్సుకతను సజీవంగా ఉంచుకోండి: ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ

August 08th, 11:15 am

ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని ఉత్సుకత, ధైర్యం మరియు నూతన ఆవిష్కరణ స్ఫూర్తితో స్వీకరించాలని వారిని కోరారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిశోధనలు కొనసాగించాలని, వికసిత భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి దోహదపడాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 08th, 11:00 am

ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ వేడుకకు ఉన్న భావోద్వేగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. క్యాంపస్‌లోని ఉత్సాహభరితమైన, కలలతో నిండిన వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో వర్చువల్‌గా హాజరైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... పట్టభద్రులైన విద్యార్థులతో నేరుగా ఈ కార్యక్రమానికి హాజరవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ క్యాంపస్‌లో మీతో ఈ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవటం నాకు కూడా ఎంతో ప్రత్యేకం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య150 వ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి

August 02nd, 08:38 pm

స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

చంద్రశేఖర్ ఆజాద్ జయంతి... శ్రద్ధాంజలి అర్పించిన ప్ర‌ధానమంత్రి

July 23rd, 08:22 am

చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. చంద్రశేఖర్ ఆజాద్ నిర్భయత్వాన్ని, ధైర్య సాహసాల్ని, తిరుగులేని దేశభక్తిని చాటి భారతదేశ స్వాతంత్య్రక సమర చరిత్రలో గౌరవాన్విత స్థానాన్ని సొంతం చేసుకున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు.

లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి

July 23rd, 08:12 am

లోకమాన్య తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహోన్నత వ్యక్తిగా లోకమాన్య తిలక్ జాతీయ భావాన్ని మేల్కొలిపారని, ప్రజాసేవకు తమను తాము అంకితం చేసుకొనేలా తరతరాలకు స్ఫూర్తినందించారని ప్రధాని కొనియాడారు.

విశిష్ట‌ విప్లవకారుడు శ్రీ మంగళ్ పాండేకి ప్రధానమంత్రి నివాళి

July 19th, 10:55 am

విశిష్ట విప్లవకారుడు శ్రీ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. బ్రిటిష్ పాల‌కుల‌పై తిరుగుబాటులో శ్రీ పాండే ప్ర‌ద‌ర్శించిన‌ ధైర్యసాహసాలు భార‌తీయులంద‌రికీ గర్వకారణమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆయన శౌర్యగాథ త‌ర‌త‌రాల‌కూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

బంకిం చంద్ర చటోపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళులు

June 26th, 12:50 pm

మహనీయుడైన బంకిం చంద్ర ఛటోపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన రచనలు తరతరాల భారతీయ ప్రజల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని రగిలించాయని అన్నారు. ఒక మహోన్నత సాహిత్యవేత్తగా ఆయనను ప్రధానమంత్రి స్మరించుకున్నారు.

వీర్‌ సావర్కర్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

May 28th, 09:52 am

నేడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన్ను స్మరించుకున్నారు. సావర్కర్‌ అసాధారణ ధైర్యసాహసాలకు, దేశభక్తికి, సమాజ సంస్కరణలకు ఆయన చేసిన కృషికి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.

మహారాణా ప్రతాప్‌ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళులు

May 09th, 09:06 am

మహాయోధుడు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

శ్యా‌మ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

March 30th, 09:50 am

భరత మాత వీర పుత్రుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్యామ్‌జీ కృష్ణ వర్మ విప్లవాత్మక ఆలోచనలతో స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక కొత్త చైతన్యాన్ని అందించారని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన జీవితం, ఆయన ఆదర్శాలు దేశానికి సేవలను అందించే దిశగా ప్రతి ఒక్క తరానికీ స్ఫూర్తిని ఇస్తున్నాయ’’ని శ్రీ మోదీ అన్నారు.

Prime Minister pays tribute to Bhagat Singh, Rajguru, and Sukhdev on Shaheed Diwas

March 23rd, 08:29 am

On the occasion of Shaheed Diwas, PM Modi paid rich tributes to the great freedom fighters Bhagat Singh, Rajguru and Sukhdev. Lauding their bravery, he observed that the martyrdom of these iconic heroes for the nation remains deeply etched in India's collective memory. He highlighted that they chose the path of sacrifice with conviction, placing the nation above their own lives..

పుదుచ్చేరిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 01st, 12:00 pm

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె. కైలాస నాథన్, స్పీకర్ శ్రీ ఆర్.సెల్వం, ముఖ్యమంత్రి శ్రీ ఎన్.రంగసామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ మన్సుఖ్ మాండవీయ, పుదుచ్చేరి హోంశాఖ మంత్రి శ్రీ ఎ.నమశ్శివాయం, ఇతర నాయకులుసహా ప్రియమైన సోదరీసోదరులారా... వణక్కం! (నమస్కారం)

పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 01st, 11:45 am

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. “ సిద్ధులు, సాధువులు, కవులు, స్వాతంత్ర్య సమరయోధుల నిలయం పుదుచ్చేరి. ఇక్కడే మహాకవి సుబ్రహ్మణ్య భారతి జాతీయవాద స్ఫూర్తిని రగిలించగా.. శ్రీ అరబిందో, మదర్... ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించారు” అని వ్యాఖ్యానించారు.

వీర్ సావర్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని

February 26th, 11:25 am

మహోన్నత విప్లవకారుడు వీర్ సావర్కర్ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

Prime Minister Shares Sanskrit Subhshitam Highlighting the lessons from the life of Veer Savarakar ji

February 26th, 10:47 am

On Veer Savarkar Ji's Punya Tithi, PM Modi noted that he would continue to guide the path of the countrymen. Lauding his bravery, the PM shared a Sanskrit verse that states: “Brave and resolute persons are capable of overcoming grief and achieving success in their lives. Such inpiduals become prosperous and accomplished. Therefore, patience and courage are always the best means to achieve success in life.”

రాజాజీ ఉత్సవాన్ని భారత రాష్ట్రపతి నిర్వహించడం ప్రశంసనీయం: ప్రధానమంత్రి

February 23rd, 05:12 pm

రాష్ట్రపతి భవన్‌లోని అశోక్ మండపం సమీపంలో గ్రాండ్ ఓపెన్ మెట్ల వద్ద ఏర్పాటు చేసిన చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు.

గాంధీ స్మృతి వద్ద ప్రార్థనా సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి

January 30th, 07:32 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గాంధీ స్మృతి వద్ద ఇవాళ జరిగిన ప్రార్థనా సమావేశానికి హాజరయ్యారు. మన స్వాతంత్ర్య పోరాట గమనాన్ని బాపు కృషి మార్చేసిందని, భారతదేశ ప్రస్థానంపై ఆయన చెరగని ముద్ర వేశారని, అది తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అండమాన్, నికోబార్ దీవుల్లో పరాక్రమ దివస్ సందర్భంగా పీఎం ప్రసంగం

January 23rd, 05:15 pm

అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె జోషి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ట్రస్ట్ ఛైర్మన్ బ్రిగేడియర్ ఆర్.ఎస్. చికారా, భారత స్వాతంత్ర్య సమరయోధులు, ఐఎన్ఏ అజరామరుడు లెఫ్టినెంట్ ఆర్.మాధవన్...

అండమాన్, నికోబార్ దీవుల్లో జరిగిన పరాక్రమ్ దివస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 23rd, 05:00 pm

అండమాన్, నికోబార్ దీవుల్లో నిర్వహించిన పరాక్రమ్ దివస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అని, ఇది ఒక అద్భుతమైన, గర్వించదగ్గ రోజు అని పేర్కొన్నారు. నేతాజీ వీరత్వం, ధైర్యసాహసాలు మనకు ఎల్లప్పుడూ స్పూర్తినిస్తాయని, ఆయన పట్ల మనకు గౌరవభావాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో పరాక్రమ్ దివస్ దేశ స్ఫూర్తిలో ఒక అంతర్భాగమైన పండుగగా మారిందని ఆయన వెల్లడించారు. జనవరి 23 పరాక్రమ్ దివస్, జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, జనవరి 29 బీటింగ్ రిట్రీట్, జనవరి 30 పూజ్య బాపూజీ వర్ధంతి ఇలా వరుసగా రావడం గణతంత్ర మహోత్సవాన్ని జరుపుకునే కొత్త సంప్రదాయాన్ని సృష్టిస్తోందని అన్నారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.