ముంబయి ‘వేవ్స్‌ సమ్మిట్‌’లో ప్రధానమంత్రి ప్రసంగం

May 01st, 03:35 pm

వేవ్స్‌ సమ్మిట్‌ వేదికపై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫఢన్‌వీస్‌, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ ఎల్.మురుగన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన సృజనాత్మక లోక ప్రముఖులు, వివిధ దేశాల సమాచార-ప్రసార, కమ్యూనికేషన్, కళ-సాంస్కృతిక శాఖల మంత్రులు, రాయబారులు, సృజనాత్మక లోక ప్రసిద్ధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, గౌరవనీయ అతిథులారా!

వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

May 01st, 11:15 am

మొట్టమొదటి ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ - వేవ్స్ 2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు, రాయబారులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులను స్వాగతిస్తూ.. వేవ్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. 100కు పైగా దేశాకు చెందిన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కలసి అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, సృజనాత్మక వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ‘‘వేవ్స్ కేవలం సంక్షిప్త పదం కాదు.. సంస్కృతిని, సృజనాత్మకతను, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం’’ అని వర్ణించారు. అలాగే ఈ సదస్సు సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథలు చెప్పడానికి సంబంధించిన విస్తృతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తుందని ప్రధాని అన్నారు. అదే సమయంలో కళాకారులు, రూపకర్తలకు భాగస్వామ్యాలు పెంచుకొనేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీ మనోజ్ కుమార్ కన్నుమూత.. ప్రధానమంత్రి సంతాపం

April 04th, 08:34 am

ప్రముఖ నటుడు, చలనచిత్ర దర్శకుడు శ్రీ మనోజ్ కుమార్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. శ్రీ మనోజ్ కుమార్ భారతీయ చలనచిత్ర రంగంలో ఓ దిగ్గజం, ముఖ్యంగా ఆయన చలనచిత్రాల్లో దేశభక్తి భావాన్ని ప్రస్ఫుటం చేసినందుకుగాను ఆయనను స్మరించుకొంటూ ఉంటామంటూ ప్రధాని ప్రశంసలు కురిపించారు.

శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్‌ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

December 26th, 10:16 am

మలయాళ సినిమా, సాహిత్య రంగాల్లో ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. మానవ భావోద్వేగాలపై లోతైన అన్వేషణతో సాగిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ రచనలు తరాలను తీర్చిదిద్దాయని, భవిష్యత్తులోనూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.

ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ శ్యామ్ బెనెగల్ కన్నుమూత: ప్రధానమంత్రి సంతాపం

December 23rd, 11:00 pm

ప్రముఖ సినీదర్శకుడు శ్రీ శ్యామ్ బెనెగల్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

దిగ్గజ నటుడు రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని

December 14th, 11:17 am

దిగ్గజ నటుడు శ్రీ రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. ఆయన దూరదృష్టి గల సినీ రూపకర్త, నటుడు, వెండితెర సార్వభౌముడనీ ప్రధాని కొనియాడారు. శ్రీ రాజ్ కపూర్ చిత్ర దర్శకుడు మాత్రమే కాదని భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సాంస్కృతిక రాయబారిగా వర్ణిస్తూ, అనేక తరాలపాటు సినిమా దర్శకులు, నటులు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని శ్రీ మోదీ అన్నారు.

శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

June 10th, 11:44 am

చలనచిత్ర దర్శకుడు, మేధావి, కవి శ్రీ బుద్ధదేబ్ దాస్ గుప్త కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.