జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జనవరి 12న జరగనున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో పాల్గొననున్న ప్రధాని

January 10th, 09:21 pm

\స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జరుపుకొంటున్న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జనవరి 12న ఉదయం 10 గంటలకు దిల్లీలోని భారత్ మండపంలో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే 3,000 మంది ప్రతిభావంతులైన యువ నాయకులతో ఆయన సంభాషించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.