గుజరాత్లోని వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 08th, 12:30 pm
గుజరాత్లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.గుజరాత్లోని వడోదరాలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు
September 08th, 12:00 pm
గుజరాత్లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ప్రపంచం ఇప్పుడు భారతీయ స్టార్టప్ల వైపు చూస్తూ ఉండాలి: స్పేస్ స్టార్టప్ సీఈఓలతో సంభాషణ సందర్భంగా ప్రధాని మోదీ
August 23rd, 11:42 am
ప్రధాని మోదీ స్పేస్ స్టార్టప్ సీఈఓలతో సంభాషిస్తూ, ఒక కొత్త రంగంలోకి ప్రవేశించేందుకు వారు చూపిన ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ సంభాషణలో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం, భారతీయ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు, రోబోటిక్ అంతరిక్ష నౌకలు, తరచుగా జరిగే రాకెట్ ప్రయోగాలు మరియు భారతదేశపు మొట్టమొదటి స్పేస్-ఫార్మా స్టార్టప్ వంటి అనేక ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది.అంతరిక్ష స్టార్టప్ సీఈఓలతో ముచ్చటించిన ప్రధాని మోదీ
August 23rd, 11:30 am
ప్రధాని మోదీ అంతరిక్ష స్టార్టప్ సీఈఓలతో ముచ్చటించి, ఒక కొత్త రంగంలోకి ప్రవేశించేందుకు వారు చూపిన ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ ముచ్చటలో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం, భారతీయ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు, రోబోటిక్ అంతరిక్ష నౌకలు, తరచూ రాకెట్ ప్రయోగాలు, భారతదేశపు మొట్టమొదటి స్పేస్-ఫార్మా స్టార్టప్ వంటి పలు ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది.అంతరిక్ష రంగ అంకుర సంస్థల సీఈవోలు, వ్యవస్థాపకులతో ప్రధాని సమావేశం
August 21st, 02:21 pm
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను, కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షించే దాని సామర్థ్యాన్ని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, పరిశ్రమల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, యువతను అంతరిక్షం వైపు ప్రోత్సహించేందుకు మరింతగా కృషి చేయాలని ఆయన ప్రోత్సహించారు.Prime Minister shares Sanskrit Subhashitam highlighting respect for nature and environmental stewardship
July 30th, 10:26 am
PM Modi shares a Sanskrit Subhashitam highlighting that respect for nature, the environment and all creation lies at the core of our existence. He encourages everyone to serve nature with gratitude and work together towards building a healthy, prosperous and strong nation.16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం జపాన్లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
July 02nd, 10:39 pm
సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఏఐతో కూడిన సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత, స్వచ్ఛ సాంకేతికత, ఔషధాలు వంటి కీలక రంగాల్లో ఉమ్మడి దృఢత్వాన్ని పెంపొందించడం కోసం ప్రాజెక్ట్ ఆధారిత సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ కీలక రంగంలో పెరుగుతున్న భారత్-జపాన్ జీటూజీ (ప్రభుత్వాల మధ్య), బీటూబీ (వ్యాపారాల మధ్య) భాగస్వామ్యాన్ని 'ఇండియా-జపాన్ ఫ్యాక్ట్ షీట్ 2.0' స్పష్టంగా తెలియజేస్తుంది.చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్లందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
July 01st, 12:50 pm
చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం ఈ రోజు. దీనిని పురస్కరించుకొని చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్లు చాలా కాలం నుంచీ భారత ఆర్థిక పయనంలో విశ్వసనీయ భాగస్వాములుగా ఉంటున్నారని శ్రీ మోదీ కొనియాడారు. పారదర్శకతకీ, వృత్తికౌశలానికీ చార్టర్డ్ అకౌంటెంట్లు నిబద్ధులై దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారనీ, వాణిజ్య వ్యవస్థకు మద్దతునిస్తున్నారనీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారనీ, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మేల్కొలిపారనీ ఆయన అన్నారు.సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 05:00 pm
ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.ప్రధానమంత్రికి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారంతో సీషెల్స్ సత్కారం
June 28th, 03:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సీషెల్స్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ పాట్రిక్ హర్మినీ ఇవాళ ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ విశిష్ట పురస్కారంతో సత్కరించారు. కాలుష్య రహిత భూగోళం లక్ష్యంగా నాయకత్వం వహిస్తున్నందుకు, వర్ధమాన దేశాల ప్రయోజనాల కోసం గళమెత్తిన ఆయనను ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ బిరుదుతో గౌరవించారు. అలాగే, నీలి ఆర్థిక వ్యవస్థ వికాసం, వాతావరణ ప్రభావ ఉపశమన చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, వర్ధమాన చిన్న ద్వీపదేశాల అభివృద్ధి ఆకాంక్షలను ప్రోత్సహించడంలో ఆయన దీర్ఘకాలిక నిబద్ధతకు గుర్తింపుగా ప్రధానమంత్రికి ఈ గౌరవం లభించింది. ఈ విశిష్ట పురస్కారం ప్రత్యేకంగా ఏర్పరచి, ఒక అంతర్జాతీయ నాయకుడికి ప్రదానం చేయడం ఇదే తొలిసారి.సీషెల్స్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
June 28th, 02:02 pm
అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.2026 వ సంవత్సరం జూన్ 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 135 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 28th, 11:30 am
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ ఆరు నెలల్లో ‘మన్ కీ బాత్’ లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఇటీవల నాకు లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీ వరకు ప్రతి పనీ స్వదేశీయులే చేశారు.మహిళల నాయకత్వంలో విభిన్న రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి
June 12th, 12:39 pm
మహిళల నాయకత్వంలో అభివృద్దిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తోందనీ, ఇది అన్ని రంగాలలో స్పష్టంగా కనిపిస్తోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు చేరవేయడం మొదలు ఔత్సాహిక పారిశ్రామికత్వం, విద్య, ఆరోగ్యసంరక్షణ, స్వచ్ఛత, గృహనిర్మాణం, క్రీడలు, విజ్ఞానశాస్త్రం, పరిపాలన.. ఇలా వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు.నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని
June 11th, 08:09 pm
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ ఏడాది సమావేశాన్ని ‘వికసిత్ భారత్- 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ సమావేశానికి 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులుగా ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు హాజరయ్యారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2ఎ (కోటేశ్వర్ రోడ్ నుంచి ఎయిర్పోర్టు కారిడార్)ను ఆమోదించిన కేబినెట్
June 10th, 01:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్.. 5 స్టేషన్లతో (4 ఎలివేటెడ్, 1 అండర్ గ్రౌండ్), 6.032 కి.మీ. పొడవైన కారిడార్ అయిన అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2(ఎ)కు ఆమోదం తెలిపింది. ఫేజ్-2(ఎ) అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య 77.63 కిలోమీటర్ల మేర క్రియాశీల మెట్రో రైలు వ్యవస్థ ఉంటుంది. ఫేజ్-2(ఎ) కారిడార్లోని స్టేషన్ల పేర్లు… ఆశ్రమ్ రోడ్, కోటేశ్వర్ ప్రాచీన్ మందిర్, సబర్మతి నది, సర్దార్ నగర్, ఎయిర్పోర్టు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
June 10th, 01:52 pm
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయ వసతి నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.పర్యావరణ పరిరక్షణలో ఘనతను సాధించిన అస్సాం ప్రజలను అభినందించిన ప్రధానమంత్రి
June 05th, 11:42 pm
పర్యావరణ పరిరక్షణలో ప్రశంసనీయమైన ఘనతను సాధించినందుకు అస్సాం ప్రజలకు, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీశక్తికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సుస్థిరమైన భూమండలాన్ని సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ గొప్ప ప్రయత్నంలో ఆ రాష్ట్ర నారీశక్తి ముందుండి నడిపించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.తల్లి పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ చారిత్రాత్మక రికార్డు... ప్రజలను అభినందించిన ప్రధాని
June 05th, 11:40 pm
దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచే అద్భుతమైన ఘనతను సాధించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంతో ముడిపడి ఉన్న ఈ అద్భుత విజయం పర్యావరణ పరిరక్షణకు ప్రజలు ఎంతగా కట్టుబడి ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్లో మొక్కను నాటిన ప్రధానమంత్రి
June 05th, 10:11 pm
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'తల్లి పేరు మీద ఒక చెట్టు' కార్యక్రమంలో భాగంగా సూరత్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొక్కను నాటారు.భారత్లో 100వ రామ్సర్ స్థలంగా జై ప్రకాశ్ నారాయణ్ పక్షుల అభయారణ్యం.. ప్రధానమంత్రి హర్షం
June 05th, 11:58 am
భారత్.. రామ్సర్ స్థలాల్లో ‘సెంచరీ’ని సాధించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర్ప్రదేశ్.. బలియాలో గల జై ప్రకాశ్ నారాయణ్ పక్షుల అభయారణ్యాన్ని (సురహా తాల్) దేశంలో 100వ రామ్సర్ స్థలంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు.