ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి

September 06th, 06:11 pm

ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్ ద్వారా సంభాషించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

August 21st, 06:30 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈరోజు ఫోన్‌లో సంభాషించారు.

భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి

August 15th, 07:26 pm

మన దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అందించిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

June 18th, 02:57 pm

కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అనేక అంశాలపై నేతలు ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. మన భూమి హితాన్ని కోరుతూ భారత్, ఫ్రాన్స్ సన్నిహితంగా పనిచేస్తూనే ఉంటాయని వారు ఉద్ఘాటించారు.

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

June 07th, 02:00 pm

విపత్తు నిరోధక సుస్థిర మౌలిక సదుపాయాల (డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పై అంతర్జాతీయ సదస్సు 2025 కు స్వాగతం. యూరప్ లో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు నిర్వహణకు మద్దతు అందించిన నా మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ కు, ఫ్రాన్స్ ప్రభుత్వానికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సముద్రాలపై త్వరలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సదస్సు (యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ కాన్ఫరెన్స్) సందర్భంగా కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

విపత్తు నిరోధక సుస్థిర మౌలిక సదుపాయాలు 2025పై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 07th, 01:26 pm

విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సు 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యూరప్ లో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ “డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2025” అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సదస్సును నిర్వహించడంలో సహకరించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు, ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే ఐక్యరాజ్యసమితి సముద్రాల సదస్సు సందర్భంగా కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది

April 24th, 03:29 pm

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలు బలిగొంది, ప్రపంచ నాయకుల నుండి బలమైన సంఘీభావం లభించింది. ప్రపంచ మద్దతుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు, భారతదేశం ఉగ్రవాదులను మరియు వారి మద్దతుదారులను భూమి చివరల వరకు వెంబడిస్తుంది అని ప్రతిజ్ఞ చేశారు.

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన: వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు ఏఐ సహకారానికి మార్గదర్శకత్వం

February 13th, 03:06 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన దౌత్య పర్యటన భారతదేశ ప్రపంచ సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆర్థిక సంస్కరణలు మరియు చారిత్రక సంబంధాలను గౌరవించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి, ఆర్థిక సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింతగా పెంచడం పట్ల భారతదేశ నిబద్ధతను ఈ సమగ్ర పర్యటన ప్రదర్శించింది.

PM Modi and President of France jointly inaugurate the Consulate General of India in Marseille

February 12th, 05:29 pm

PM Modi and President Emmanuel Macron inaugurated the Consulate General of India in Marseille. The new Consulate will boost economic, cultural, and people-to-people connections across four French regions. PM Modi deeply appreciated President Macron’s special gesture, as both leaders received a warm welcome from the Indian diaspora.

మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు

February 12th, 04:57 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ఉదయం మాసే లోని మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించి మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో అసువులు బాసిన భారత వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. యుద్ధవీరుల త్యాగాలకు నివాళిగా ఇరువురు నేతలూ పుష్ప గుచ్ఛాలను ఉంచారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

February 12th, 03:24 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్ష విమానంలో పారిస్ నుంచి మార్సిలే వరకు మంగళవారం కలిసి ప్రయాణించారు. ఇద్దరు నాయకుల మధ్య సాన్నిహిత్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు, కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై వారు పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం మార్సిలే చేరుకున్న తర్వాత ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. గత 25 సంవత్సరాలుగా బహుముఖంగా, స్థిరంగా అభివృద్ధి చెందుతున్న భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల బలమైన నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు.

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా భార‌త్‌-ఫ్రాన్స్‌ సంయుక్త ప్రకటన

February 12th, 03:22 pm

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10-12 తేదీల్లో ఫ్రాన్స్‌ను సందర్శించారు. ఈ రెండు రోజుల్లో అక్కడ నిర్వహించిన కృత్రిమ మేధ (ఎఐ) కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు రెండు దేశాలూ సంయుక్తంగా అధ్యక్షత వహించాయి. బ్లెచ్లీ పార్క్ (2023 నవంబర్), సియోల్ (2024 మే) శిఖరాగ్ర సదస్సులు తీర్మానించిన మేరకు సాధించిన కీలక విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై ఈ సదస్సు చర్చించింది. ఇందులో వివిధ దేశాల-ప్రభుత్వాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతోపాటు చిన్న-పెద్ద వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు సహా కళాకారులు-పౌర సమాజ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉపయోగకర సామాజిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో సత్ఫలితాల సాధనకు అంతర్జాతీయ కృత్రిమ మేధ రంగం సారథ్యం వహించేలా నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి అంకిత భావంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సును విజయవంతంగా నిర్వహించారంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. తదుపరి శిఖరాగ్ర సదస్సును భారత్‌ నిర్వహించనుండటంపై ఫ్రాన్స్ హర్షం వ్యక్తం చేసింది.

పారిస్ లో భారత్-ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని ప్రసంగం

February 12th, 12:45 am

‘సృజన, సహకారం, అభ్యున్నతి’ని మంత్రప్రదంగా భావించి మీరు ముందుకు సాగుతుండడాన్ని నేను గమనించాను. మీరు కేవలం ఉన్నతాధికారుల మధ్య వారధులు మాత్రమే కాదు.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీరు బలోపేతం చేస్తున్నారు.

భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 12th, 12:25 am

ఈ రోజు ప్యారిస్‌లో నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్‌...ప్రసంగించారు. ఈ ఫోరమ్ ఇరు పక్షాలకు చెందిన వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓల)ను ఒక చోటుకు చేర్చింది. ఇది రక్షణ, ఏరోస్పేస్, కీలక టెక్నాలజీలు-కొత్తగా ఉనికిలోకి వస్తున్న టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, కృత్రిమ మేధ, వైద్య ఆరోగ్య శాస్త్రాలు, జీవనశైలిలతోపాటు ఆహారం, ఆతిథ్య రంగాలపై దృష్టిని కేంద్రీకరించింది.

ప్యారిస్ ‘ఏఐ ఏక్షన్ సమిట్’ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం

February 11th, 05:35 pm

నేటి చర్చల వల్ల ఒక విషయం తేటతెల్లమయ్యింది – సమావేశాల్లో పాల్గొన్నభాగస్వాములందరూ ఒకే ఆశయాన్ని, ఒకే లక్ష్యాన్నీ కలిగి ఉన్నారు.

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

February 11th, 03:15 pm

మీ వైద్య సంబంధ రిపోర్టును కృత్రిమ మేధ (ఏఐ)తో నడిచే యాప్ లో మీరు అప్లోడ్ చేస్తే.. సులభంగా అర్థమయ్యే భాషలో, ఎలాంటి వృత్తిపరమైన ప్రామాణిక పదజాలమూ లేకుండా మీ ఆరోగ్య సమాచారాన్ని అది వివరించగలదు. కానీ, మీరు అదే యాప్‌ ను ఎడమ చేతితో రాసే వ్యక్తి చిత్రాన్ని గీయమని అడిగితే, అది చాలావరకు కుడి చేతితో రాసే వారి చిత్రాన్నే గీస్తుంది. ఎందుకంటే ట్రైనింగ్ డేటాలో ఎక్కువ భాగం అదే ఉంటుంది.

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత ఏఐ ఈ శతాబ్దపు మానవీయతను రచిస్తోంది: ప్రధానమంత్రి

February 11th, 03:00 pm

పారిస్ లో జరిగిన కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత వహించారు. వారం పాటు సాగిన సదస్సు ఈనెల 6-7 తేదీల్లో సైన్స్ దినోత్సవాలతో ప్రారంభమైంది. తర్వాతి రెండు రోజులు సాంస్కృతిక వారాంతపు కార్యక్రమాలు నిర్వహించారు. ఉన్నత స్థాయి ముగింపు కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖులు, విధాన నిర్ణేతలు, నిపుణులు హాజరయ్యారు.

ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

February 10th, 10:30 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పారిస్‌కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చర్చలు జరుపుతారు, ఏఐ యాక్షన్ సమ్మిట్ మరియు అనేక ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధానమంత్రి ప్రకటన

February 10th, 12:00 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ఈ కింది విధంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు:

భారత్ 76వ గణతంత్ర దినోత్సవం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఐర్లాండ్ ప్రధానిల శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి

January 27th, 11:06 am

భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్‌కు, ఐర్లాండ్ ప్రధాని శ్రీ మేఖేల్ మార్టిన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ధన్యవాదాలు తెలియజేశారు.