ఫిబ్రవరి 28న పీఎం గుజరాత్ పర్యటన

February 27th, 03:38 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28, 2026న గుజరాత్‌లో పర్యటిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం 3:45 గంటలకు సనంద్‌లో మెక్రాన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్ట్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.