అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి

December 11th, 08:50 pm

అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మాట్లాడారు.

దీపావళి శుభాకాంక్షలు చెప్పిన యూఎస్ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు

October 22nd, 08:25 am

దీపావళికి స్వయంగా ఫోన్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలను చెప్పినందుకు అమెరికా అధ్యక్షుడు గౌరవ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మనసారా కృతజ్ఞ‌తలు తెలియజేశారు.

బందీల విడుదలను స్వాగతించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 13th, 07:59 pm

రెండు సంవత్సరాలకు పైగా బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. బందీల కుటుంబాల ధైర్యానికీ, శాంతి కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.

గాజా శాంతి ప్రణాళిక విజయవంతం పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందించిన ప్రధానమంత్రి

October 09th, 09:31 pm

చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఆయనకు అభినందనలు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికలో ఒకటో దశ ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి

October 09th, 09:55 am

అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికలో ఒకటో దశపై ఒప్పందం కుదిరినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వాగతించారు.

గాజాలో శాంతి స్థాపన దిశగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి

October 04th, 07:58 am

గాజాలో శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. బందీల విడుదలకు వస్తున్న సంకేతాలు.. మానవతావాద, దౌత్యపరమైన ప్రయత్నాల్లో కీలక ముందడుగని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

గాజా సంఘర్షణకు స్వస్తి పలికే దిశగా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ చేపట్టిన శాంతి సాధన యత్నాలను స్వాగతించిన ప్రధానమంత్రి

September 30th, 09:19 am

గాజా సంఘర్షణను సమాప్తం చేయడానికి అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జే ట్రంప్ నడుం కట్టి ఒక సమగ్ర ప్రణాళికను ప్రకటించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

September 16th, 11:30 pm

తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారత్ - అమెరికా సమగ్ర, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు మీలాగే నేను కూడా పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశగా మీరు తీసుకునే చర్యలకు సహకరిస్తాం’’ అని శ్రీ మోదీ అన్నారు.

President Trump conveys warm birthday greetings to PM Modi

September 16th, 10:13 pm

US President Donald Trump called PM Modi on his 75th birthday, extending warm greetings and friendship. Both leaders reaffirmed their commitment to strengthen the India-US Comprehensive Global Strategic Partnership and shared views on key regional and global issues. PM Modi also voiced India’s support for Trump’s efforts toward a peaceful resolution in Ukraine.

భారత్ - అమెరికా మధ్య బలమైన సంబంధాలున్నాయని స్పష్టం చేసిన ప్రధాని

September 10th, 07:52 am

భారత్ - అమెరికా మధ్య బలమైన సత్సంబంధాలున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల ప్రజలకు ఉజ్వలమైన, మరింత సుసంపన్నమైన భవిష్యత్తును అందించడం లక్ష్యంగా ఇరుదేశాలూ కలిసి పనిచేస్తాయని శ్రీ మోదీ అన్నారు.

ట్రంప్ భావాలు.. సానుకూల దృక్పథం అభినందనీయం: ప్రధానమంత్రి

September 06th, 10:27 am

భారత్-అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలు, సానుకూల దృక్పథం అభినందనీయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్-అమెరికా మంచి భవిష్యత్తును.. సమగ్రమైన, ప్రాపంచిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడి మధ్య టెలిఫోన్ సంభాషణపై విదేశాంగ కార్యదర్శి ప్రకటన

June 18th, 12:32 pm

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావాల్సి ఉంది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే అమెరికాకు తిరిగిరావాల్సి వచ్చింది. దీంతో సమావేశం జరగలేదు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది

April 24th, 03:29 pm

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలు బలిగొంది, ప్రపంచ నాయకుల నుండి బలమైన సంఘీభావం లభించింది. ప్రపంచ మద్దతుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు, భారతదేశం ఉగ్రవాదులను మరియు వారి మద్దతుదారులను భూమి చివరల వరకు వెంబడిస్తుంది అని ప్రతిజ్ఞ చేశారు.

భారతదేశంపై ఈ వారం ప్రపంచం

April 22nd, 12:27 pm

దౌత్యపరమైన ఫోన్ కాల్స్ నుండి సంచలనాత్మక శాస్త్రీయ ఆవిష్కరణల వరకు, ఈ వారం ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క ఉనికి సహకారం, ఆవిష్కరణ మరియు సాంస్కృతిక గర్వంతో గుర్తించబడింది.

అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి

April 21st, 08:56 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు గౌరవనీయ జే.డి. వాన్స్‌, రెండో మహిళ శ్రీమతి ఉషా వాన్స్, వారి పిల్లలు, అమెరికా పరిపాలన యంత్రానికి చెందిన సీనియర్ అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు.

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గౌరవ తులసీ గబ్బార్డ్ భేటీ

March 17th, 08:52 pm

అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గౌరవ తులసీ గబ్బార్డ్ ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం

March 16th, 11:47 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 16th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్‌మాన్‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్‌మాన్‌ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

The World This Week On India

February 18th, 04:28 pm

This week, India reinforced its position as a formidable force on the world stage, making headway in artificial intelligence, energy security, space exploration, and defence. From shaping global AI ethics to securing strategic partnerships, every move reflects India's growing influence in global affairs.

మెగా ఇండియా-యుఎస్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్న ప్రధాని మోదీ, ట్రంప్

February 14th, 06:46 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ఒక చిరస్మరణీయ సందర్భం, ఇది రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక, ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. తన పర్యటనలో, ప్రధాని మోదీ అమెరికా నాయకులు, వ్యాపార దిగ్గజాలు మరియు భారతీయ ప్రవాసులతో రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత మరియు దౌత్యం వంటి కీలక రంగాలను కవర్ చేస్తూ ఉన్నత స్థాయి సమావేశాలు మరియు చర్చలలో పాల్గొన్నారు. ఈ పర్యటన భారతదేశం మరియు అమెరికా మధ్య బలమైన సంబంధాన్ని పునరుద్ఘాటించింది, కొత్త ప్రపంచ క్రమాన్ని రూపొందించడంలో రెండు దేశాలను ప్రపంచ భాగస్వాములుగా ఉంచింది.