ఎగుమతిదారుల కోసం రుణ భరోసా పథకం (సీజీఎస్ఈ)... మంత్రివర్గం ఆమోదం

November 12th, 08:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఎగుమతిదారుల కోసం రుణ భరోసా పథకం (సీజీఎస్ఈ)ను ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈలు సహా అర్హులైన ఎగుమతిదారులకు రూ. 20,000 కోట్ల వరకు అదనపు రుణ సౌకర్యాలను అందించడం కోసం.. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీజీటీసీ) ఈ పథకం ద్వారా సభ్యత్వమున్న రుణ సంస్థలకు (ఎంఎల్ఐ) 100% క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని అందిస్తుంది.