మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

April 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

చిలీ అధ్యక్షుడు శ్రీ జోస్ ఆంటోనియో కాస్ట్ రిస్ట్ పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

March 13th, 12:54 pm

చిలీ అధ్యక్షునిగా శ్రీ జోస్ ఎంటోనియో కాస్ట్ రిస్ట్ పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, చిలీల మధ్య ఆత్మీయ, మైత్రీసంబంధాల్ని మరింత బలపరచడంతో పాటు వాణిజ్యం, సాంకేతిక విజ్ఞానం, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఆయనతో కలిసి పనిచేయాలని తాను ఎదురుచూస్తున్నట్లు శ్రీ మోదీ తెలిపారు.

చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్ ఫాంట్ కు ఢిల్లీలో ప్రధానమంత్రి ఆతిథ్యం

April 01st, 09:33 pm

భారత్-చిలీ భాగస్వామ్యంలో మరో కీలక అడుగుకి సంకేతంగా చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్ ఫాంట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో సాదర స్వాగతం పలికారు. లాటిన్ అమెరికాలో భారత్ కు చిలీ కీలక భాగస్వామి అని, అధ్యక్షుడు బోరిక్ కు ఆతిథ్యం ఇవ్వడం సంతోషాన్నిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.

భారత్ లో చిలీ రాష్ట్రపతి అధికారిక పర్యటన (2025, ఏప్రిల్ 01-05): ప్రభావం

April 01st, 06:45 pm

అంటార్కిటికా సహకారం పై ఆసక్తి వ్యక్తీకరణ

భారత్ - చిలీ సంయుక్త ప్రకటన (ఏప్రిల్ 01, 2025)

April 01st, 06:11 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చిలీ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయ గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ ఈ నెల 1 నుంచి 5వ తేదీ వ‌ర‌కూ భార‌త్‌లో తొలిసారి అధికారిక‌ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. రెండు దేశాల మధ్య దౌత్య‌సంబంధాల‌కు 76 ఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో ఆయ‌న మ‌న దేశాన్ని సంద‌ర్శించ‌డం విశేషం. అధ్యక్షుడు బోరిక్‌తోపాటు విదేశీ వ్యవహారాలు, వ్యవసాయం, గ‌నులు, మహిళలు-లింగ సమానత్వం-సంస్కృతులు, కళలు-వారసత్వం శాఖల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ అధికారులు సహా పెద్ద సంఖ్యలో అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. భారత్‌ రాజధాని న్యూఢిల్లీతోపాటు ఆగ్రా, ముంబయి, బెంగళూరు నగరాలను కూడా బోరిక్ సందర్శిస్తారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో 2024 నవంబరు నాటి జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు బోరిక్, ప్రధాని మోదీ మొదటిసారి కలుసుకున్నారు.

చిలీ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ పత్రికా ప్రకటన

April 01st, 12:31 pm

అధ్యక్షుడు బోరిక్ తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. ఈ దేశంపై ఆయనకుగల ఆప్తమిత్ర భావం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆయన నిబద్ధత నిజంగా అత్యద్భుతం. అందుకే, ఆయనకు నా హృదయపూర్వక నా అభినందనలు తెలుపుతూ వారితోపాటు విశిష్ట ప్రతినిధి బృందాన్ని మనసారా స్వాగతిస్తున్నాను.

చిలీ దేశాధ్యక్షుడితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ

November 20th, 08:36 pm

బ్రెజిల్ దేశ రాజధాని రియో డి జనీరోలో ఏర్పాటైన జి-20 సమావేశాల నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న చిలీ దేశపు అధ్యక్షుడు శ్రీ గాబ్రియల్ బోరిక్ ఫాంట్ తో తొలిసారి భేటీ అయ్యారు.

సోషల్ మీడియా కార్నర్ -6 సెప్టెంబర్

September 06th, 07:27 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!