ప్రజల సమిష్టి ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 'మన్ కీ బాత్' ఒక అద్భుతమైన వేదిక: ప్రధాని మోదీ

November 30th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్‌లో, రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, వందేమాతరం 150వ వార్షికోత్సవం, అయోధ్యలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ, ఐఎన్‌ఎస్ 'మహే' ప్రవేశం మరియు కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవం వంటి నవంబర్‌లో జరిగిన కీలక సంఘటనలను ప్రధాని మోదీ హైలైట్ చేశారు. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు & తేనె ఉత్పత్తి, భారతదేశ క్రీడా విజయాలు, మ్యూజియంలు మరియు సహజ వ్యవసాయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కాశీ-తమిళ సంగమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ప్రధాని కోరారు.

శుభాన్షు శుక్లాతో ప్రధాని సంభాషణ

August 19th, 09:43 am

తప్పకుండా మీకో భిన్నమైన అనుభవమే కదా ఇది. మీ అనుభూతులను తెలుసుకోవాలనుకుంటున్నాను.

అంతరిక్ష యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 19th, 09:42 am

రోదసీ యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతరిక్ష యానం అందించిన పరివర్తనాత్మక అనుభవాన్ని గురించి ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, అలాంటి ముఖ్య ప్రస్థానాన్ని చేపట్టి ముగించిన తరువాత ఎవరైనా మార్పును అనుభూతి చెందితీరుతారన్నారు. ఈ మార్పు తాలూకు అనుభవాన్ని వ్యోమగాములు ఎలా అర్థం చేసుకుంటారో తెలుసుకోవాలని ఉందని శ్రీ మోదీ అన్నారు. శ్రీ శుభాంశు శుక్లా జవాబిస్తూ, రోదసిలో స్థితి అచ్చంగా వేరేగా ఉంటుందని, భూమ్యాకర్షణ శక్తి లోపించడం దీనికి ఒక కీలక కారణమన్నారు.

అంతరిక్ష అన్వేషణపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని చేసిన ప్రసంగం

May 07th, 12:00 pm

గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ కాన్ఫరెన్స్-2025లో మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. అంతరిక్షం కేవలం ఓ గమ్యస్థానం కాదు. అది ఆసక్తి, ధైర్యం, సమష్టి ప్రగతిని ప్రకటించే అంశం. భారతీయ అంతరిక్ష ప్రయాణం ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 1963లో ఓ చిన్న రాకెట్ ప్రయోగం నుంచి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా ఎదిగేంత వరకు మా ప్రయాణం అత్యద్భుతం. మా రాకెట్లు పేలోడ్లను మించిన బరువును మోస్తున్నాయి. 1.4 బిలియన్ల మంది భారతీయుల కలలను అవి మోస్తున్నాయి. భారత్ సాధించిన విజయాలు శాస్త్ర రంగంలో గొప్ప మైలురాళ్లు. వీటన్నింటినీ మించి, మానవ స్ఫూర్తి... గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తుందనడానికి ఇది గొప్ప రుజువు. 2014లో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకొని భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై నీటి జాడను కనుగొనేందుకు చంద్రయాన్-1 తోడ్పడింది. చంద్రయాన్-2 అధిక స్పష్టత ఉన్న చంద్రుని ఛాయాచిత్రాలను మనకు పంపింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై మన అవగాహనను చంద్రయాన్–3 పెంచింది. మేం రికార్డు సమయంలో క్రయోజనిక్ ఇంజిన్లను తయారుచేశాం. ఒకే ప్రయోగంలో 100 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. మా వాహక నౌకల ద్వారా 34 దేశాలకు చెందిన 400 ఉపగ్రహాలను కక్ష్యంలో ప్రవేశపెట్టాం. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను పూర్తి చేశాం. ఇది పెద్ద విజయం.

అంత‌రిక్ష శోధ‌న‌పై అంత‌ర్జాతీయ స‌ద‌స్సు-2025 (జిఎల్ఇఎక్స్‌)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

May 07th, 11:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అంత‌రిక్ష శోధ‌న‌పై అంత‌ర్జాతీయ స‌ద‌స్సు-2025 (జిఎల్ఇఎక్స్‌)ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత ప్రపంచవ్యాప్తంగాగల విశిష్ట ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యోమగాములను ఆయన స్వాగతించారు. అంతరిక్ష రంగంలో భారత్‌ అద్భుత పయనం గురించి జిఎల్ఇఎక్స్‌- 2025లో పాల్గొంటున్నవారికి ప్రముఖంగా వివరించారు. ““అంతరిక్షమంటే కేవలం ఒక గమ్యం కాదు.. ఉత్సుకత-సాహ‌సం-స‌మ‌ష్టి ప్ర‌గతిని ప్ర‌స్ఫుటం చేసే సంక‌ల్పం” అని ఆయన అభివర్ణించారు. భారత్‌ 1963లో ఓ చిన్న రాకెట్‌ను ప్రయోగించిన నాటినుంచి చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపిన తొలి దేశం స్థాయి ఎదగడం వరకూ సాధించిన విజయాలు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఆయన స్పష్టం చేశారు. “భారతీయ రాకెట్లు త‌మ‌ కార్య‌భారాన్ని మించి... అంటే- 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష‌ల‌ను మోస్తూ తమ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తాయి” అని వ్యాఖ్యానించారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు శాస్త్రవిజ్ఞానంలో కీలక ఘట్టాలని, సమస్యలను అధిగమించడంలో మానవాళి స్ఫూర్తికినిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌ 2014నాటి తన తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకోవడం ద్వారా చారిత్రక విజయం సాధించిందని గుర్తుచేశారు. జాబిలిపై జలం జాడను పసిగట్టడంలో చంద్రయాన్-1 ప్రయోగం తోడ్పడిందని పేర్కొన్నారు. తదుపరి చంద్రయాన్-2 ప్రయోగం చంద్ర ఉపరితల సుస్పష్ట (అత్యధిక రిజల్యూషన్) చిత్రాలను అందించిందని, ఇక తాజా చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువంపై మానవాళి అవగాహనను మరింత పెంచిందని విశదీకరించారు. “భారత్‌ రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజిన్లను రూపొందించింది. ఒకే రాకెట్‌ ద్వారా 100 ఉపగ్రహాలను ప్రయోగించింది.. భారత ప్రయోగ వాహనాల ద్వారా 34కుపైగా దేశాలకు చెందిన 400కు మించి ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో నిలిపింది” అని వివిధ విజయాలను ప్రధాని ఏకరవు పెట్టారు. ఇదే క్రమంలో ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధానం ద్వారా భారత్‌ సాధించిన తాజా విజయాన్ని ప్రస్తావిస్తూ- అంతరిక్ష పరిశోధనలో ఇదొక కీలక ముందడుగని పేర్కొన్నారు.

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

April 27th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నా మనసులో మాట చెప్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడినా.. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు. ఉగ్రవాదుల దాడి చిత్రాలను చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని తెలియజేస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొని ఉన్న తరుణంలో పాఠశాలలు , కళాశాలల్లో చైతన్యం వచ్చింది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇది నచ్చలేదు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు, వారి యజమానులు కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగింది. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో మనకున్న అతిపెద్ద బలాలు. ఈ ఐక్యత ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఆధారం. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును ఎదుర్కొనేందుకు మనం మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. ఉగ్రవాద దాడి తర్వాత యావద్దేశం ఒక్క గొంతుతో మాట్లాడుతోంది.

Armed forces have taken India’s pride to new heights: PM Modi in Lepcha

November 12th, 03:00 pm

PM Modi addressed brave jawans at Lepcha, Himachal Pradesh on the occasion of Diwali. Addressing the jawans he said, Country is grateful and indebted to you for this. That is why one ‘Diya’ is lit for your safety in every household”, he said. “The place where jawans are posted is not less than any temple for me. Wherever you are, my festival is there. This is going on for perhaps 30-35 years”, he added.

హిమాచల్ ప్రదేశ్‘లోని లెప్చాలో వీర సైనికులతో ప్రధానమంత్రి దీపావళి వేడుకలు

November 12th, 02:31 pm

దీపావళి పండుగ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలో మన సాహస భద్రత దళాలతో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జవాన్లనుద్దేశించి మాట్లాడుతూ- దీపావళి పండుగనాడు ఈ కలయిక, జవాన్ల ధైర్యసాహసాల ప్రతిధ్వనులు దేశంలోని ప్రతి పౌరునికీ చైతన్యం కలిగించే క్షణాలని అభివర్ణించారు. దేశంలోని చివరి గ్రామంగా ఉండి, నేడు తొలి గ్రామంగా గుర్తింపు పొందిన లెప్చా పరిధిలో సరిహద్దు ప్రాంతాల జవాన్లతో సంయుక్తంగా ఆయన దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Chandrayaan Mission and PM Modi’s Penchant Towards Space Tech

September 03rd, 02:25 pm

Prime Minister Narendra Modi always had a keen interest in technology and an inclination towards space-tech long before he became the PM. In 2006, when Shri Modi was the Chief Minister of Gujarat, he accompanied the then President APJ Abdul Kalam to the Space Applications Centre (SAC), ISRO, Ahmedabad.

The fervour generated by the Chandrayaan success needs to be channelled into Shakti: PM Modi

August 26th, 01:18 pm

PM Modi arrived to a grand welcome in Delhi. Responding to the warm civic reception, the Prime Minister expressed his gratitude for the enthusiasm of the people for the success of the Chandrayaan-3. He said that India is creating a new impact on the basis of its achievement and successes and the world is taking note.

ఢిల్లీ చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం

August 26th, 12:33 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఢిల్లీ లో ఘన స్వాగతం ప లికారు. చంద్రయాన్ -3 మూన్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో ఇస్రో బృందంతో మాట్లాడిన అనంతరం ప్రధాని ఈ రోజు బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన అనంతరం ప్రధాని నేరుగా బెంగళూరు వెళ్లారు. శ్రీ జె.పి.నడ్డా ప్రధాన మంత్రికి స్వాగతం పలికారు, విజయవంతమైన పర్యటన, భారత శాస్త్రవేత్తల చిరస్మరణీయ విజయం పై ఆయనను అభినందించారు.

India is on the moon! We have our national pride placed on the moon: PM Modi

August 26th, 08:15 am

PM Modi visited the ISRO Telemetry Tracking and Command Network (ISTRAC) in Bengaluru after his arrival from Greece and addressed Team ISRO on the success of Chandrayaan-3. PM Modi said that this is not a simple success. He said this achievement heralds India’s scientific power in infinite space. An elated PM Modi exclaimed, “India is on the Moon, We have our national pride placed on the Moon.

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో బృందాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

August 26th, 07:49 am

ఇది అసాధారణ విజయమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ఘనత అనంత విశ్వంలో భారత వైజ్ఞానిక శక్తిసామర్థ్యాలను చాటుతుందన్నారు. “భారతదేశం చంద్ర మండలాన్ని జయించింది! మన జాతీయ ప్రతిష్ట సగర్వంగా చంద్రునిపై రెపరెపలాడింది” అని ఉప్పొంగిన హృదయంతో ప్రధాని హర్షం వెలిబుచ్చారు. ఈ అపూర్వ విజయాన్ని కొనియాడుతూ- “ఇదీ నేటి భారతం… జంకూగొంకూ లేని నిరంతర కృషికి పుట్టినిల్లు. సరికొత్త ఆలోచనలతో.. వినూత్న రీతిలో.. చీకటిని చీల్చుకుంటూ ప్రపంచానికి వెలుగులు వెదజల్లే భరతభూమి ఇది. ఈ 21వ శతాబ్దంలో ప్రపంచం ముందున్న పెను సవాళ్లకు పరిష్కారాలు చూపగల నవ భారతమిది” అని వేనోళ్ల ప్రశంసించారు. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిపై దిగిన క్షణం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. “చంద్రుని ఉపరితలాన్ని ముద్దాడిన ఆ క్షణం ప్రస్తుత శతాబ్దపు అత్యంత స్ఫూర్తిదాయక ఘట్టాల్లో ఒకటి. ప్రతి భారతీయుడూ దీన్ని తమ విజయంగా భావించారు” అని ఆయన చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి కొనియాడారు.

భార‌త‌దేశ స్వాతంత్య్ర స‌మ‌రం లో పాలుపంచుకొన్న మ‌హానుభావుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

March 12th, 03:21 pm

స్వాతంత్య్ర యోధులు అందరికీ, ఉద్య‌మాలకు, అల‌జ‌డి ల‌కు, స్వాతంత్య్ర ఉద్య‌మ సంఘర్షణ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఆయ‌న ప్రత్యేకించి భార‌త‌దేశ భ‌వ్య స్వాతంత్య్ర స‌మ‌ర గాథ లో లభించవ‌ల‌సినంతటి గుర్తింపు ల‌భించ‌ని ఉద్య‌మాల కు, పోరాటాల కు, విశిష్ట వ్య‌క్తుల‌ కు శ్ర‌ద్ధాంజ‌లి అర్పించారు. అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం లో ఈ రోజు న ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) ను ప్రారంభించిన అనంత‌రం ఆయన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 12th, 10:31 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్రవారం నాడు అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర‌ యాత్ర‌) ప్రారంభానికి గుర్తు గా పచ్చ‌ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) కార్య‌క్ర‌మాల ను ప్రారంభించారు. India@75 ఉత్స‌వాలకై ఉద్దేశించినటువంటి ఇత‌ర విభిన్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ను, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ‌గుజ‌రాత్ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త) శ్రీ ప్ర‌హ్లాద్ సింహ్ ప‌టేల్, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.

‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ India@75 కార్య‌క్ర‌మాల‌ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

March 12th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్రవారం నాడు అహ‌మ‌దాబాద్ లోని సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మం నుంచి ‘పాదయాత్ర’ (స్వాతంత్య్ర‌ యాత్ర‌) ప్రారంభానికి గుర్తు గా పచ్చ‌ జెండా ను చూపడం తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ (India@75) కార్య‌క్ర‌మాల ను ప్రారంభించారు. India@75 ఉత్స‌వాలకై ఉద్దేశించినటువంటి ఇత‌ర విభిన్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ను, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ‌గుజ‌రాత్ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర బాధ్య‌త) శ్రీ ప్ర‌హ్లాద్ సింహ్ ప‌టేల్, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ విజ‌య్ రూపాణీ లు పాలుపంచుకొన్నారు.

India has a rich legacy in science, technology and innovation: PM Modi

December 22nd, 04:31 pm

Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.

PM delivers inaugural address at IISF 2020

December 22nd, 04:27 pm

Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.

Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament

January 31st, 01:59 pm

In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.

చంద్రయాన్ మరియు కష్టపడి పనిచేసే ఇస్రో శాస్త్రవేత్తల గురించి ప్రధాని మోదీ చెప్పినది చదవండి ...

January 24th, 11:00 am

పరిక్ష పె చర్చా టౌన్‌హాల్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ చంద్రయాన్ ల్యాండింగ్ జీవితంలో వైఫల్యాలను అధిగమించడానికి సరైన ఉదాహరణ. చంద్రయాన్ ల్యాండింగ్ సమయంలో ఇస్రోకు నా సందర్శన మరియు కష్టపడి పనిచేసే మన శాస్త్రవేత్తలతో గడిపిన సమయాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను.