కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 28th, 02:39 pm

ఈ విశిష్ట సందర్భంలో మీ అందరితో మమేకం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయుర్వేద వైద్య విధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ తన 125 ఏళ్ల ప్రస్థానంలో ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించింది. ఈ నేపథ్యంలో ఆర్య వైద్యశాల వ్యవస్థాపకులైన వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాను. ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 28th, 02:25 pm

కేరళలోని ఆర్య వైద్యశాల ధార్మిక ఆస్పత్రి శతాబ్ది ఉత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇటువంటి పవిత్ర సందర్భంలో అందరితోనూ మమేకం కావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుర్వేద వైద్యవిధాన పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణలో ఆర్య వైద్యశాల కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన కొనియాడారు. ఈ మేరకు 125 ఏళ్ల ప్రస్థానంలో ఈ సంస్థ ఆయుర్వేదాన్ని శక్తిమంతమైన చికిత్సా విధానంగా నిరూపించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్యరత్నం పి.ఎస్.వారియర్ సేవలను స్మరించుకుంటూ, ఆయుర్వేదంపై ఆయన దృక్పథం, ప్రజా సంక్షేమంపై అంకితభావం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.3

ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాలు... రేపు న్యూఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి

June 27th, 05:06 pm

ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాలను రేపు.. అంటే ఈ నెల 28న.. ఉదయం దాదాపు 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

శ్రీ నారాయణ గురు, మహాత్మా‌గాంధీ చర్చల శతాబ్ది కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

June 24th, 11:30 am

బ్రహ్మర్షి స్వామి సచ్చిదానంద గారు, శ్రీమఠం స్వామి శుభాంగ నందా గారు, స్వామి శారదానంద గారు, గౌరవనీయులైన సాధువులందరూ, ప్రభుత్వంలో నా సహచరులు శ్రీ జార్జ్ కురియన్ గారు, పార్లమెంట్‌లో నా సహచరులు శ్రీ అదూర్ ప్రకాష్ గారు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు, గౌరవనీయులైన పెద్దలందరూ,

శ్రీ నారాయణ గురు, మహాత్మా‌గాంధీ మధ్య చారిత్రక చర్చ జరిగి శతాబ్ది అవుతోన్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

June 24th, 11:00 am

గొప్ప ఆధ్యాత్మిక, నైతిక విలువలు కలిగిన మహానుభావులు శ్రీ నారాయణ గురు.. మహాత్మా‌గాంధీల మధ్య జరిగిన చారిత్రక చర్చకు శతాబ్ధి అవుతోన్న సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన దేశ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టానికి ఈ వేదిక సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. మన స్వాతంత్రోద్యమానికి ఈ ఇద్దరు మహానుభావుల మధ్య జరిగిన చారిత్రక చర్చ కొత్త దిశానిర్దేశం చేసిందని.. స్వాతంత్య్ర లక్ష్యాలకు, స్వతంత్ర భారత్ కలకు నిర్దిష్ట అర్థాన్నించిందని పేర్కొన్నారు. “100 సంవత్సరాల క్రితం జరిగిన శ్రీ నారాయణ గురు- మహాత్మాగాంధీల సమావేశం నేటికీ స్ఫూర్తిదాయకంగా, సందర్భోచితంగా ఉంది. సామాజిక సామరస్యం, అభివృద్ధి చెందిన భారత్‌ విషయంలో సమష్టి లక్ష్యాల కోసం ఉత్తేజానిచ్చే వనరుగా పనిచేస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాక శతాబ్ధి సందర్భంగా శ్రీ నారాయణ గురు పాదాలకు నమస్కరించిన ప్రధాని.. మహాత్మా‌గాంధీకి నివాళులర్పించారు.

శ్రీ నారాయణ గురు-మహాత్మాగాంధీల సంభాషణ శతాబ్ది ఉత్సవాలను రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి

June 23rd, 05:24 pm

ఆధ్యాత్మికత, నైతిక విలువలను బోధించిన గొప్ప నాయకులు శ్రీ నారాయణ గురు - మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రాత్మక సంభాషణ శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM

January 09th, 10:15 am

PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.

ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

January 09th, 10:00 am

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.

ఈ నెల 25న ల‌ఖ్‌న‌వూ విశ్వ‌విద్యాల‌యం శ‌త వార్షిక స్థాప‌న దినోత్స‌వానికి హాజ‌రుకానున్న ప్ర‌ధాన మంత్రి

November 23rd, 01:13 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 25న ల‌ఖ్‌న‌వూ విశ్వ‌విద్యాల‌యం శ‌త వార్షిక స్థాప‌న దినోత్స‌వం లో ఆ రోజు సాయంత్రం 5:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పాలుపంచుకోనున్నారు. ఈ విశ్వ‌విద్యాల‌యాన్ని 1920వ సంవ‌త్స‌రం లో స్థాపించ‌డం జ‌రిగింది. ఇది త‌న 100వ‌ సంవ‌త్స‌ర ఉత్స‌వాన్ని జ‌రుపుకోనుంది.

మైసూరు విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్ర‌ధాన మంత్రి ప్రసంగ పాఠం

October 19th, 11:11 am

కర్ణాటక గవర్నర్, మైసూర్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ శ్రీ వాజు భాయ్ వాలా గారు, కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సి.ఎన్.అశ్వత్ నారాయణ్ గారు, మైసూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్.జి.హేమంత్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్! మొదటగా మీ అందరికీ, 'మైసూరు దసరా', 'నడ హబ్బా శుభాకాంక్షలు!

మైసూర్ విశ్వ‌విద్యాల‌య శ‌త‌వ‌సంత స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ.

October 19th, 11:10 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మైసూరు విశ్వ‌విద్యాల‌య శ‌తవ‌సంత స్నాత‌కోత్స‌వంలో వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్ర‌సంగించారు.

Our conduct as citizens will determine the future of India, it will decide the direction of new India: PM

February 16th, 11:57 am

PM Modi took part in the closing ceremony of centenary celebrations of Shri Jagadguru Vishwaradhya Gurukul in Varanasi. Addressing the gathering, PM Modi said, Country is not formed by governments alone. What is also important is fulfilling our duties as citizens...Our conduct as citizens will determine the future of India, it will decide the direction of new India.

ప్ర‌ధాన మంత్రి త‌న లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం వారాణ‌సీ ని సంద‌ర్శించారు; శ్రీ‌ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ వందేళ్ల కాలం ఉత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మాని కి ఆయన హాజ‌ర‌య్యారు

February 16th, 11:56 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ ని సంద‌ర్శించారు. ఆయ‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ లో జంగంవాడీ మ‌ఠం లో గ‌ల శ్రీ‌ జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శ‌త వార్షికోత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

ప‌ట్నా విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

October 14th, 11:29 am

ఇలా ఒక కార్య‌క్ర‌మం కోసం ప‌ట్నా విశ్వ‌విద్యాల‌యాన్నిసంద‌ర్శించిన మొట్ట‌మొద‌టి ప్ర‌ధాన‌ మంత్రిని నేనేన‌న్న సంగతిని మన ముఖ్య‌మంత్రి ద్వారా ఇప్పుడే తెలుసుకున్నాను.

పట్నా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో ప్రసంగించిన ప్రధాన మంత్రి

October 14th, 11:28 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పట్నా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో పాల్గొని ప్రసంగించారు. పట్నా విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం, విద్యార్థుల మధ్య గడపడం తనకు దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘‘ఈ బిహార్ గడ్డకు నేను ప్రణమిల్లుతున్నాను. ఈ విశ్వవిద్యాలయం దేశానికి ఘనమైన సేవలను అందించిన విద్యార్థులను తీర్చిదిద్దింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

రేపు బీహార్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

October 13th, 04:29 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 14, 2017న బీహార్ లో పర్యటిస్తారు.

భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; నర్మద జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేయడమైంది

May 22nd, 06:35 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది నర్మద నది జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేసేందుకు తోడ్పడుతుంది.

కచ్ కెనాల్ వద్ద స్టేషన్ పంపింగ్ స్టేషన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ

May 22nd, 06:32 pm

గుజరాత్ లోని కచ్ కెనాల్ వద్ద పంపింగ్ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రారంభోత్సవం తరువాత భారీ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ నీటిని పరిరక్షించాలని ఉద్ఘాటించారు. కచ్లోని ప్రజల నుండి నీటి సంరక్షణ గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. నర్మదా నది నీటిని కాలువలోకి ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ ఇవి ఈ ప్రాంత ప్రజల జీవితాలను మార్చివేస్తాయని చెప్పారు.

ఈశాన్యప్రాంత అభివృద్ధి మాకు ఎంతో ప్రధానమైనది: ప్రధాని మోదీ

May 07th, 01:15 pm

ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా షిల్లాంగ్లోని భారత్ సేవాశ్రమం సంఘం యొక్క శతోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వామి ప్రణవనంద యొక్క కృషిని గుర్తుచేస్తూ, శ్రీ మోదీ, స్వామీ ప్రణవనండు తన శిష్యులను సేవ మరియు ఆధ్యాత్మికతకు అనుసంధానం చేసారు. 'భక్తి', 'శక్తి' మరియు 'జన శక్తి' ద్వారా సామూహిక అభివృద్ధి స్వామి ప్రణవనండం చేత సాధించబడింది. అని అన్నారు. ఈశాన్య ప్రాంతంలో పరిశుభ్రత దిశగా పనిచేయాలని ప్రజలను పిలుపునిచ్చారు. ఈశాన్య అభివృద్ధి కేంద్రం కోసం ప్రాధాన్యత అని ఆయన అన్నారు.

సోషల్ మీడియా కార్నర్ - 10 ఏప్రిల్

April 10th, 08:29 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!