ప్రముఖ తెలుగు కవి, గేయ రచయిత, రచయిత శ్రీ సి. నారాయణ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

June 12th, 06:48 pm

తెలుగు కవి, గేయ రచయిత, రచయిత శ్రీ సి. నారాయణ రెడ్డి మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘శ్రీ సి. నారాయణ రెడ్డి మృతి సాహితీ ప్రపంచానికి పెద్ద లోటు. ఆయన రచనలు తరాలకు అతీతంగా ప్రజాబాహుళ్యాన్ని మెప్పించాయి. ఈ దు:ఖదాయక ఘడియలలో ఆయన కుటుంబం, ఆయన అభిమాన వర్గాలు శోకం నుండి తేరుకోవాలంటూ ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.