శ్రీ బిశ్వ బంధు సేన్ మృతికి ప్రధాని సంతాపం

December 26th, 11:46 am

త్రిపుర శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వ బంధు సేన్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. త్రిపుర పురోగతిని పెంపొందించడానికి, అనేక సామాజిక కార్యక్రమాల పట్ల నిబద్ధతతో చేసిన కృషికి ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారని శ్రీ మోదీ పేర్కొన్నారు.