రూ.23,731 కోట్ల వ్యయంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి కోసం జాతీయ సమగ్ర పథకం గోబర్ధన్‌కు కేబినెట్ ఆమోదం

August 06th, 04:08 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో... మొత్తం రూ.23,731 కోట్ల వ్యయంతో చేపట్టే జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకమైన గోబర్ధన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సు సందర్భంగా సంయుక్త ప్రకటన

July 02nd, 10:22 pm

జూలై 1 నుంచి 3, 2026 వరకు జరిగే ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి తకాయిచి సనాయె భారత్‌కు విచ్చేశారు. ప్రధానమంత్రి తకాయిచితో పాటు ఉన్నతాధికారులు, సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్ పర్యటనకు వచ్చింది. ప్రధానమంత్రి తకాయిచి భారతదేశంలో అధికారికంగా పర్యటించటం ఇదే తొలిసారి.

జపాన్ ప్రధానమంత్రితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 02nd, 01:30 pm

ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ అన్ని రంగాల్లోనూ భారత్‌ వృద్ధి పయనంలో గత అనేక దశాబ్దాలుగా జపాన్ కీలక ఓ భాగస్వామి. పరస్పర విశ్వాసం, స్నేహబంధానికి ఇదొక అమూల్య పెన్నిధి.

హర్యానాలోని యమునా నగర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం/శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 14th, 12:00 pm

ప్రజాదరణ చూరగొన్న హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్‌ సింగ్‌ సైనీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహరల్‌ లాల్‌, ఇందర్‌జీత్‌ సింగ్‌, శ్రీ క్రిషన్‌పాల్‌, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు-శాసనసభ సభ్యులు సహా నా ప్రియ సోదరీసోదరులారా... హర్యానాలోని సహోదరులారా... మీకందరికీ ఇవే మోదీ శుభాకాంక్షలు!

హర్యానాలోని యమునానగర్ లో అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ

April 14th, 11:54 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని యమునా నగర్లో పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హర్యానా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవిత్ర భూమి హర్యానాకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. ఇది సరస్వతీ మాత జన్మస్థలం, మంత్రాదేవి నివాసం, పంచముఖి హనుమాన్ జీ స్థానం, అలాగే పవిత్ర కపాలమోచన్ సాహిబ్ ఉన్న ప్రదేశంగా పేర్కొంటూ, హర్యానా సంస్కృతి, భక్తి అంకితభావ సంగమం అని ఆయన వర్ణించారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. బాబాసాహెబ్ దార్శనికత, ప్రేరణ ఇప్పటికీ భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న హర్యానాలో పర్యటించనున్న ప్రధానమంత్రి

April 12th, 04:48 pm

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్యానాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10:15 గంటలకు హిసార్‌కు చేరుకుని, అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లే వాణిజ్య విమానాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అలాగే హిసార్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేసి, అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదం

October 21st, 10:25 am

ఎన్ డిటివి వరల్డ్ సమ్మిట్ కు హాజరైన గౌరవ అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సులో మీరు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

న్యూఢిల్లీలో ‘ఎన్‌డిటివి’ ప్రపంచ సదస్సు-2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

October 21st, 10:16 am

గ‌త నాలుగైదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచ భ‌విష్య‌త్తు సంబంధిత ఆందోళ‌న‌ల‌పై చ‌ర్చ‌లు ఒక సాధారణ ఇతివృత్తంగా మారిపోయాయయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ మహమ్మారి అనంతర ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ మార్పు సమస్యలు, కొనసాగుతున్న యుద్ధాలు, సరఫరా శ్రేణిలో వినూత్న మార్పులు, అమాయక జనం మరణాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి సంఘర్షణల సవాళ్లు వగైరాలన్నీ ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే సమయాన భార‌త్‌ మాత్రం తన శతాబ్ది వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నదని ప్రకటించారు. ‘‘ప్రపంచమంతా పీకల్లోతు సంక్షోభంలో మునిగితే, భారత్ ఆశాకిరణంగా ఉద్భవించింద’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులు, దాని ముందున్న సవాళ్లతో భారత్ ప్రభావితమైనప్పటికీ, వాటిని అధిగమించగల ఆశావహ దృక్పథం కొరవడలేదని స్పష్టం చేశారు.

స్వచ్చతా హీ సేవ - 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం

October 02nd, 10:15 am

నేడు పూజ్య బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి. ఈ భరతమాత గొప్ప కుమారులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను. గాంధీజీ, ఇతర మహనీయులు భారతదేశం కోసం కన్న కలను సాకారం చేసేందుకు కలిసి పనిచేయడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుంది.

స్వచ్ఛభారత్ దివస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 02nd, 10:10 am

పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన సామూహిక ఉద్యమాల్లో ఒకటైన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ 155వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ స్వచ్ఛభారత్ దివస్ 2024 కార్యక్రమం నిర్వహించారు. అమృత్, అమృత్ 2.0, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోబర్‌ధన్ పథకాల కింద పలు ప్రాజెక్టులతో పాటు మొత్తం రూ. 9600 కోట్ల విలువైన అనేక పారిశుధ్య, పరిశుభ్రతా ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. ‘స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత’ ఈ ఏడాది స్వచ్ఛతా హి సేవా నినాదం అని తెలిపారు.

Modernization of agriculture systems is a must for Viksit Bharat: PM Modi

February 24th, 10:36 am

PM Modi inaugurated and laid the foundation stone of multiple key initiatives for the Cooperative sector at Bharat Mandapam, New Delhi. Recalling his experience as CM of Gujarat, the Prime Minister cited the success stories of Amul and Lijjat Papad as the power of cooperatives and also highlighted the central role of women in these enterprises.

సహకార రంగానికి చెందిన పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన పిఎం

February 24th, 10:35 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార రంగానికి చెందిన అనేక కీలక ప్రాజెక్టులకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 24వ తేదీన శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. 11 రాష్ర్టాలకు చెందిన 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పిఏసిఎస్) ‘‘సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన నిల్వ వసతుల నిర్మాణ ప్రణాళిక’’ కింద ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా మరో 500 పిఏసిఎస్ లలో గిడ్డంగులు, ఇతర వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని వల్ల ఆహార ధాన్యాలు నిల్వ చేసే పిఏసిఎస్ గిడ్డంగులన్నీ ఆహార సరఫరా వ్యవస్థతో నిరంతరాయంగా అనుసంధానం అవుతాయి. నబార్డ్ మద్దతుతో జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ సిడిసి) నాయకత్వంలో సమన్వయపూర్వక కృషితో దేశంలో ఆహార సరఫరా వ్యవస్థ పటిష్ఠం చేయడంతో పాటు, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఎఐఎఫ్), వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులు (ఎఎంఐ) వంటి పథకాలన్నింటికీ ఒక్కటిగా చేయడం ద్వారా ఈ కొత్త ప్రాజెక్టును అమలుపరుస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలు, వడ్డీ రాయితీలు వంటివి పిఏసిఎస్ లు ఉపయోగించుకుని ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు వీలు కలుగుతుంది. అలాగే ‘‘సహకార్ సే సమృద్ధి’’ అనే విజన్ కు దీటుగా సహకార వ్యవస్థను పునరుజ్జీవింపచేసి; చిన్నకారు, సన్నకారు రైతులను సాధికారం చేసేందుకు దేశవ్యాప్తంగా 18,000 పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.

Banas Kashi Sankul will give a boost to the income of more than 3 lakh farmers: PM Modi

February 23rd, 02:45 pm

Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone for multiple development projects worth more than Rs 13,000 crore in Varanasi. Addressing the gathering, the Prime Minister expressed gratitude for being present in Kashi once again and recalled being elected as the Parliamentarian of the city 10 years ago. He said that in these 10 years, Banaras has transformed him into a Banarasi.

వారణాసిలో రూ.13,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన , జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

February 23rd, 02:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో రూ.13,000 కోట్ల పైగా పెట్టుబడితో కూడిన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు వేశారు. వారణాసిలోని కర్ఖియాన్ లో యుపిఎస్ఐడిఎ ఆగ్రో పార్క్ లో నిర్మించిన బనస్కాంత జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ పాల ప్రాసెసింగ్ యూనిట్ -బనాస్ కాశీ సంకుల్- ను ప్రధాని సందర్శించారు. ఆవుల లబ్దిదారులతో ముచ్చటించారు. ఉపాధి లేఖలు, జిఐ అధీకృత యూజర్ సర్టిఫికెట్లను ప్రధాని మోదీ అందజేశారు. ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన అభివృద్ధి ప్రాజెక్టులు రోడ్లు, రైలు, విమానయానం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, పట్టణాభివృద్ధి, పారిశుధ్యం వంటి ముఖ్యమైన రంగాల వృద్ధికి ఉపయోగపడతాయి.

India is emphasizing the development of environmentally conscious energy sources to enhance our energy mix: PM Modi

February 06th, 12:00 pm

PM Modi inaugurated India Energy Week 2024 in Goa. India is the world's third largest energy, oil and LPG consumer. Furthermore, he said India is the fourth largest LNG importer and refiner along with the fourth largest mobile market.

ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

February 06th, 11:18 am

ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2024 అనేది భారతదేశం యొక్క అతి పెద్దది అయినటువంటి మరియు సర్వతోముఖమైనటువంటి శక్తి సంబంధి ఏకైక ప్రదర్శన, ఇంకా సమావేశం అని చెప్పాలి. శక్తి పరం గా పరివర్తన కై భారతదేశం నిర్దేశించుకొన్న లక్ష్యాల కు ఉత్ప్రేరకం గా ఉండేటట్టు ఎనర్జీ వేల్యూ చైన్ లోని వేరు వేరు భాగాల ను ఒక చోటు కు చేర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానోద్దేశ్యం గా ఉంది. గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ సిఇఒ లతో మరియు నిపుణుల తో ఒక రౌండ్ టేబుల్ ను కూడా ప్రధాన మంత్రి నిర్వహించారు.

'గ్రీన్ గ్రోత్'పై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగ సారాంశం

February 23rd, 10:22 am

2014 నుండి భారతదేశంలోని అన్ని బడ్జెట్‌లలో ఒక నమూనా గమనించబడింది. మా ప్రభుత్వం యొక్క ప్రతి బడ్జెట్ ప్రస్తుత సవాళ్లను పరిష్కరిస్తూ కొత్త యుగ సంస్కరణలను ప్రోత్సహిస్తుంది. హరిత వృద్ధి మరియు శక్తి పరివర్తన కోసం భారతదేశం యొక్క వ్యూహంలో మూడు ప్రధాన స్తంభాలు ఉన్నాయి. మొదటిది- పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని పెంచడం. రెండవది - మన ఆర్థిక వ్యవస్థలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం. మరియు మూడవది , దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా వెళ్లడం. ఈ వ్యూహం ప్రకారం , ఇథనాల్ బ్లెండింగ్ , పిఎం- కుసుమ్ పథకం , సౌర ఉత్పత్తికి ప్రోత్సాహకం , రూఫ్-టాప్ సోలార్ పథకం , బొగ్గు గ్యాసిఫికేషన్ , బ్యాటరీ నిల్వ ,గత ఏడాది బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో పరిశ్రమలకు గ్రీన్ క్రెడిట్ , రైతుల కోసం ప్రధానమంత్రి ప్రాణం యోజన కూడా ఉన్నాయి. వీటిలో గ్రామాలకు గోబర్ధన్ యోజన మరియు పట్టణ ప్రాంతాలకు వాహనాల స్క్రాపింగ్ విధానం ఉన్నాయి. ఆకుపచ్చ హైడ్రోజన్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది , కాబట్టి చిత్తడి నేల పరిరక్షణకు సమాన శ్రద్ధ చెల్లించబడుతుంది. హరిత వృద్ధికి సంబంధించి ఈ ఏడాది బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఒక విధంగా మన భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తుకు పునాదిరాయి.

‘హరిత వృద్ధి’పై బడ్జెట్‌ అనంతర వెబ్‌ సదస్సులో ప్రధాని ప్రసంగం

February 23rd, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ‘హరిత వృద్ధి’’పై బ‌డ్జెట్ అనంతర వెబ్‌ సదస్సులో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుకు తగిన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన 12 బడ్జెట్ అనంతర వెబ్‌ సదస్సులలో ఇది మొదటిది. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగిస్తూ- దేశంలో 2014 త‌ర్వాత ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్లన్నీ ఇటు వర్తమాన సవాళ్ల‌కు ప‌రిష్కారాన్వేషణ సహా అటు నవతరం సంస్క‌ర‌ణ‌ల‌ను ముందుకు తీసుకెళ్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

September 12th, 11:01 am

ఉత్తరప్రదేశ్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రి వర్గం లో నా సహచరులు శ్రీ పుర్షోత్తం రూపాలా గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ అధ్యక్షుడు పి. బ్రజ్జాలే గారు, ఐడిఎఫ్ డిజి కరోలిన్ ఎమాండ్ గారు, ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

PM inaugurates International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida

September 12th, 11:00 am

PM Modi inaugurated International Dairy Federation World Dairy Summit. “The potential of the dairy sector not only gives impetus to the rural economy, but is also a major source of livelihood for crores of people across the world”, he said.