గువహటిలో సంప్రదాయ బోడో సాంస్కృతిక కార్యక్రమం ‘బకురుంబా దహోవ్’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 17th, 06:30 pm
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వజిత్ దైమరీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పబిత్రా మార్గిరిటా, బోడోలాండ్ ప్రాదేశిక పాలన మండలి ముఖ్య కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ హగ్రామా మోహిలరి, రాష్ట్ర మంత్రులు, అస్సాంలోని నా విశిష్ట సోదరీసోదరులారా!అస్సాంలోని గౌహతిలో జరిగిన బగురుంబా ధహోవ్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
January 17th, 06:00 pm
గౌహతిలోని సరుసజాయ్ స్టేడియంలో నిర్వహించిన బోడో చారిత్రాత్మక సాంస్కృతిక కార్యక్రమం 'బగురుంబా ధహోవ్ 2026'ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అస్సాం సంస్కృతి చూడటం, బోడో సామాజిక వర్గ సంప్రదాయాలను నిశితంగా గమనించడం తన అదృష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. మరే ఇతర ప్రధానమంత్రి అస్సాంను తాను సందర్శించినంత తరచుగా సందర్శించలేదన్న ఆయన.. అస్సాం కళలు - సంస్కృతికి పెద్ద వేదిక లభించాలని, భారీ వేడుకల ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నట్లు ప్రధానంగా చెప్పారు. ఈ దిశగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపిన ఆయన.. భారీ స్థాయిలో జరిగిన బిహు వేడుకలు, ఝుమోయిర్ వినోందిని ప్రదర్శన, ఏడాదిన్నర కిందట ఢిల్లీలో జరిగిన భారీ బోడో మహోత్సవ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఉదహరించారు. అస్సాం కళలు, సంస్కృతి అందించే అనన్యమైన ఆనందాన్ని అనుభవించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోనని అన్నారు. బగురుంబా పండుగను నిర్వహించడంపై మరోసారి సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. దీనిని బోడో అస్తిత్వానికి నిదర్శనంగా, అస్సాం వారసత్వ ప్రతీకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న అందరికీ ముఖ్యంగా కళాకారులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.అస్సాం గౌహతిలో ఏర్పాటైన ఝుమోయిర్ బినందిని కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 24th, 06:40 pm
గౌరవనీయ అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు డాక్టర్ ఎస్. జయశంకర్, శ్రీ సర్బానంద్ సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, కళాకారులు, అస్సాం సోదర సోదరీమణులు...అస్సాంలోని గౌహతిలో ఝుమోయిర్ బినందిని కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి
February 24th, 06:39 pm
అస్సాంలోని గౌహతిలో ఒక భారీ ఝుమోర్ కార్యక్రమం అయిన ‘ఝుమోర్ బినందిని 2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఆహూతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమంలో ఎటు చూసినా శక్తి, ఉత్సాహం, ఉత్సుకత వెల్లివిరుస్తున్నాయన్నారు. ఝుమోయిర్ కళాకారులు వారు పనిచేసే తేయాకు తోటల్లోని సుగంధాన్ని, శోభను తమ నృత్యంలో ఆవిష్కరించారంటూ ఆయన ప్రశంసలను కురిపించారు. ఝూమోయిర్తోనూ, తేయాకు తోటల సంస్కృతితోనూ ప్రజలకొక విశిష్ట అనుబంధం ఉన్నట్లే ఈ విషయంలో తాను కూడా ఇదే తరహా అనుభూతిని పొందానని ఆయన అభివర్ణించారు. ఇంత పెద్ద సంఖ్యలో కళాకారులు ఈ రోజు ప్రదర్శించిన ఝూమోయిర్ నృత్యం ఒక రికార్డును సృష్టించగలదని కూడా ఆయన అన్నారు. 2023లో తాను అస్సాంను సందర్శించినప్పుడు కూడా 11,000 మంది కళాకారులు బిహూ నృత్యం చేయగా అదొక రికార్డును సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. అది తాను మరచిపోలేని ఓ జ్ఞాపకమని చెబుతూ అలాంటి ఒక సమ్మోహక ప్రదర్శనను తిలకించడానికి తాను సంసిద్ధుడినై వచ్చినట్లు చెప్పారు. ఒక ఉజ్వల సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు అస్సాం ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ రోజు అస్సాంకూ, తేయాకు తోటల్లో పనిచేసేవారికి, వేడుకల్లో పాలుపంచుకొనే ఆదివాసీలకు గర్వించాల్సిన రోజు అని ఆయన అన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున అందరికీ ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు.Today there is a government in the country which thinks about the poor first: PM Modi
January 15th, 12:15 pm
PM Modi released the first instalment to 1 lakh beneficiaries of Pradhan Mantri Awas Yojana - Gramin (PMAY - G) under Pradhan Mantri Janjati Apasi Nyaya Maha Abhiyan (PM-JANMAN) via video conferencing. The Prime Minister also interacted with the beneficiaries of PM-JANMAN on the occasion. On the one hand, Diwali is being celebrated in Ayodhya, while 1 lakh people from the extremely backward tribal community are also celebrating Diwali”, PM Modi said.‘పిఎం- జన్మన్’ కింద లక్షమంది ‘పిఎంఎవై’(జి) లబ్ధిదారులకు తొలివిడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి
January 15th, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహాభియాన్ (పిఎం-జన్మన్) కింద లక్షమంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (పిఎంఎవై-జి) లబ్ధిదారులకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా తొలివిడత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘పిఎం-జన్మన్’ లబ్ధిదారులతో ఆయన సంభాషించారు.న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం పాఠం
January 14th, 12:00 pm
వనక్కం, మీ అందరికీ పొంగల్ శుభాకాంక్షలు! ఇనియా పొంగల్ నల్వాల్తుక్కల్ !న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
January 14th, 11:30 am
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలియచేశారు. తమిళనాడులోని ప్రతీ ఒక్క ఇంటిలోనూ పొంగల్ పండుగ ఉత్సాహం కనిపిస్తుందని ఆయన అన్నారు. పౌరులందరి జీవితాల్లోనూ ఆనందం, సుసంపన్నత, సంతృప్తి ఏరులై పారాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. నిన్న జరిగిన లోహ్రి వేడుకలు, మకర ఉత్తరాయణ ప్రవేశాన్ని పురస్కరించుకుని రేపు జరిగే మకర సంక్రాంతి, త్వరలో రానున్న మాఘ బిహు వంటి పవిత్ర పండుగల సందర్భంగా దేశ పౌరులందరికీ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు.మంగళప్రదం అయిన కాతిబిహూ సందర్భం లో అసమ్ యొక్క ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
October 18th, 10:47 pm
మంగళప్రదం అయినటువంటి కాతిబిహూ సందర్భం లో అసమ్ యొక్క ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లను తెలిపారు.కాశీ విశ్వనాథ క్షేత్రం.. బిహు వేడుకలపై పౌరుల వ్యాఖ్యలకు ప్రధానమంత్రి స్పందన
April 16th, 10:04 am
కాశీ విశ్వనాథ క్షేత్రం నుంచి బిహు పర్వదిన వేడుకలదాకా పలు అంశాలపై పౌరుల వ్యాఖ్యలమీద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు.గౌహతిలో బిహు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 14th, 06:00 pm
రొంగలీ బిహు సందర్భంగా అస్సాం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు!అస్సాం లోని గువాహటిలో రూ. 10,900 కోట్ల విలువచేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని
April 14th, 05:30 pm
అస్సాం లోని గువాహతి లో సారూసజయ్ స్టేడియం లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రూ.10,900 కోట్లకు పైగా విలువచేసే ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో బ్రహ్మపుత్ర నాది మీద పాలాష్ బారి, సువాల్ కుచి మధ్య వంతెనకు శంకుస్థాపన, రంగ్ ఘర్, శివసాగర్ సుందరీకరణ పనుల శంకు స్థాపనలు, నామ్ రూప్ లో 500 టిపిడి మెంథాల్ ప్లాంట్ ఆవిష్కరణ, ఐదు రైల్వే ప్రాజెక్ట్ లు జాతికి అంకితం చేయటం ఉన్నాయి. పది వేల మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన రంగురంగుల బిహు నాట్యాన్ని కూడా ప్రధాని తిలకించారు.అసమ్ ను ఏప్రిల్ 14 వ తేదీ నాడు సందర్శించనున్న ప్రధానమంత్రి
April 12th, 09:45 am
ఇంచుమించు గా మధ్యాహ్నం 12 గంటల వేళ కు, ప్రధాన మంత్రి ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ కి చేరుకొని ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ కై కొత్త గా నిర్మాణం జరిగినటువంటి కేంపస్ ను పరిశీలిస్తారు. ఆ తరువాత జరిగే ఒక సార్వజనిక కార్యక్రమం లో ఆయన పాల్గొని ఎఐఐఎమ్ఎస్ గువాహాటీ ని మరియు మరో మూడు వైద్య కళాశాల లను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. ఆయన అసమ్ అడ్వాన్స్ డ్ హెల్థ్ కేర్ ఇనొవేశన్ ఇన్స్ టిట్యూట్ (ఎఎహెచ్ఐఐ) కి కూడా శంకుస్థాపన చేయడం తో పాటు అర్హత కలిగిన లబ్ధిదారుల కు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి-పిఎమ్ జెఎవై) కార్డు లను పంపిణీ చేయడం ద్వారా ‘ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్’ అభియాన్ ను ప్రారంభిస్తారు.బోహాగ్ బిహు సందర్భం లో అసమ్ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
April 14th, 09:54 am
బోహాగ్ బిహు సందర్భం లో అసమ్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.