ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరీ (రిటైర్డ్) మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
May 19th, 01:31 pm
సాయుధ దళాల నుంచి రాజకీయ రంగం వరకూ- మేజర్ జనరల్ ఖండూరీ అమూల్య సేవలను అందించారనీ, ఈ కారణంగా ఆయనను సదా స్మరించుకుంటామనీ ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యమంత్రిగా మేజర్ జనరల్ ఖండూరీ పదవీకాలంలో ఉత్తరాఖండ్ అభివృద్ధి పట్ల అచంచల అంకితభావాన్ని కనబరిచారని శ్రీ మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా శ్రీ ఖండూరీ పదవీకాలం కూడా సరైన అర్థంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా అనుసంధాన వ్యవస్థను గణనీయంగా మెరుగుపరచడానికి శ్రీ ఖండూరీ అవిశ్రాంతంగా కృషి చేశారని ప్రధాని ప్రశంసించారు.