ప్రధానమంత్రి మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: సంస్కరణ, స్వావలంబన, ప్రతి భారతీయుడికి సాధికారత కల్పించే దార్శనికత
August 15th, 10:23 am
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. భారతదేశ స్వావలంబన, పరివర్తన ప్రయాణాన్ని ప్రధానంగా తెలియజేశారు. గత దశాబ్దంలో సంస్కరణలు, గణనీయమైన పనితీరుతో భారత్ పరివర్తన చెందిందని.. కానీ ఇప్పుడు మరింత శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. చట్టాలు, నిబంధనలు, వివిధ ప్రక్రియలు సరళీకృతంగా ఉండే.. పారిశ్రామిక వాతావరణానికి ప్రోత్సాహం లభించే, ప్రతి భారతీయడు వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడే విధంగా ఆధునిక, సమర్థవంతమైన, ప్రజలకు అనుకూలమైన వ్యవస్థను సృష్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.